KTR: ప్రజలకు అర్థమైంది.. వారి పతనం ప్రారంభమైంది!
- కేసీఆర్ పాలనలో యూరియా కొరత ఎప్పుడూ రాలేదు
- అసమర్థుల వల్లే రైతులకు ఈ కష్టాలు
- వందేళ్ల విజన్ ఉన్న నాయకుడు కేసీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR Slams Congress Govt over Urea Shortage: మాజీ సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణలో యూరియా కొరత ఎప్పుడూ రాలేదని, ఇప్పుడు పరిపాలన చేతకాని వారి వల్లనే ఈ దుస్థితి ఏర్పడిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఫైర్ అయ్యారు. కేసీఆర్ ముందుచూపు, పాలన అంటే ఏంటో జనాలకు ఇప్పుడు అర్థమైందని.. రైతును అరిగోస పెడుతున్న వారి పతనం ప్రారంభమైందన్నారు. నాడు కేసీఆర్ యూరియా కోసం ముందస్తు ప్రణాళికలు రూపొందించారన్నారు. వ్యవసాయ అధికారుల నుంచి రైల్వే శాఖ వరకు కేసీఆర్ స్వయంగా సమన్వయం చేశారని కేటీఆర్ చెప్పుకొచ్చారు.
‘రైతును అరిగోస పెడుతున్న వారి పతనం ప్రారంభమైంది. కేసీఆర్ ముందుచూపు, పాలన అంటే ఏంటో ప్రజలకు ఇప్పుడు అర్థమైంది. చిల్లర రాజకీయాలు చేసే అసమర్థుల వల్లే రైతులకు ఈ కష్టాలు వచ్చాయి. వందేళ్ల విజన్ ఉన్న కేసీఆర్కు, బూతులు మాట్లాడే వారికి తేడా ప్రజలకు అర్థమైంది. నాడు కేసీఆర్ యూరియా కోసం ముందస్తు ప్రణాళికలు రూపొందించారు. వ్యవసాయ అధికారుల నుంచి రైల్వే శాఖ వరకు కేసీఆర్ స్వయంగా సమన్వయం చేశారు. యూరియా కోసం ప్రత్యేకంగా గూడ్స్ ట్రెయిన్లు, లారీలు ఏర్పాటు చేయించారు. గ్రామాల్లోనే యూరియా సరఫరా చేసేలా పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. కేసీఆర్ పాలనలో తెలంగాణలో యూరియా కొరత ఎప్పుడూ రాలేదు. ఇప్పుడు పరిపాలన చేతకాని వారి వల్లనే ఈ దుస్థితి నెలకొంది’ అని కేటీఆర్ ఫైర్ అయ్యారు.
Also Read
- Ramachandra Rao: కర్ణాటక మాజీ డీజీపీ రామచంద్ర రావుకు భారీ ఊరట.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
- SRH Vs PBKS: 3 ఓవర్లలోనే మరో రికార్డు నెలకొల్పిన కాటేరమ్మ కొడుకులు.. ఉప్పల్ లో పరుగుల వరద..
- Mamata Banerjee: రాజీనామాకు ససేమిరా.. సుప్రీంకోర్టుకు మమతా బెనర్జీ..
- MK Stalin-Rajinikanth: స్టాలిన్ను కలిసిన రజనీకాంత్.. మాజీ సీఎంకు ఓదార్పు
Also Read: Bhatti Vikramarka: పదేళ్లు ఉద్యోగాలు ఇవ్వలేదు.. పైగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు!
ఆగస్టు మొదటి వారం నుంచి వర్షాలు కురుస్తుండటంతో రైతులకు యూరియా ఆవశ్యకత ఏర్పడింది. వరి, పత్తి, కందులు, మొక్కజొన్న, మిర్చి, బంతి లాంటి పంటలకు యూరియా వేసే సమయం కాబట్టి రైతులు ఎగబడుతున్నారు. సహకార సంఘాలు, ప్రైవేటు డీలర్ల వద్దకు పరుగులు తీస్తున్నారు. డిమాండుకు సరిపడా ఎరువులు లేకపోవడంతో.. దుకాణాల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారు.కొన్నిచోట్ల రైతులు యూరియా కోసం వారం రోజులుగా పట్టాపాస్ పుస్తకాలు, చెప్పులు వరుసలో పెడుతున్నారు. ఇంకొందరైతే అక్కడే నిద్రిస్తున్నారు కూడా.
- Tags
- BRS
- congress
- ktr
- KTR on Urea
- telangana
తాజావార్తలు
-
Radico Khaitan: మత్తులో మునిగి.. లాభాల్లో తేలిన వోడ్కా కంపెనీ! 3 నెలల్లో వందల కోట్ల లాభం..
-
Ramachandra Rao: కర్ణాటక మాజీ డీజీపీ రామచంద్ర రావుకు భారీ ఊరట.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
-
SRH Vs PBKS: 3 ఓవర్లలోనే మరో రికార్డు నెలకొల్పిన కాటేరమ్మ కొడుకులు.. ఉప్పల్ లో పరుగుల వరద..
-
Mamata Banerjee: రాజీనామాకు ససేమిరా.. సుప్రీంకోర్టుకు మమతా బెనర్జీ..
-
MK Stalin-Rajinikanth: స్టాలిన్ను కలిసిన రజనీకాంత్.. మాజీ సీఎంకు ఓదార్పు
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!