Telangana: తెలంగాణలోని అన్ని గురుకుల విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఈరోజు నుంచి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) ప్రారంభం కానుంది. పోస్టుల వారీగా పరీక్షలు 23వ తేదీ వరకు కొనసాగుతాయి.
ఇవాళ ( సోమవారం ) జరిగిన కేబినెట్ సమావేశంలో టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషం, ప్రతి ఒక్కరు హర్షించదగిన విషయం.. ఈ విలీన నిర్ణయం తీసుకున్నందుకు TJMU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి JAC కన్వీనర్ హనుమంతు ముదిరాజ్ ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.
తెలంగాణ ప్రభుత్వం టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు క్యాబినెట్ మీటింగ్ లో చర్చించారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ మండలి కీలక నిర్ణయం తీసుకున్నది.