Bhagyanagar Utsava Samiti: ఈ నెల 19నే వినాయక చవితి.. ఖైరతాబాద్ లో ఫ్లెక్సీలు నిషేధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ సంవత్సరం వినాయక చవిత ఉత్సవాలపై భాగ్యనగర్ ఉత్సవ సమితి కీలక ప్రకటన చేసింది. ఈనెల 19వ తారీఖున సాంప్రదాయబద్దంగా గణేష్ పండుగ నిర్వహించుకోవాలని తెలిపింది. అలాగే, 28వ తేదీన నిమజ్జనం ఉంటుందని క్లారిటీ ఇచ్చింది. కాగా, భాగ్యనగర్ ఉత్సవ సమితి సభ్యులు నేడు (సోమవారం) సమావేశం అయ్యారు. గణేష్ ఉత్సవ ఏర్పాట్లపై ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ ఏడాది వినాయక చవితి ఏ రోజున జరుపుకోవాలని చాలా మందిలో సందేహం ఉంది. అయితే, ఈనెల 18వ తేదీన మధ్యాహ్నం చవితి ప్రారంభమై.. 19వ తేదీ మధ్యాహ్నం వరకు ఉంటుంది. కనుకా.. సూర్యోదయం తర్వాత వచ్చిన తిథినే పండుగ రోజుగా గుర్తిస్తామని భాగ్యనగర్ ఉత్సవ్ కమిటీ తెలిపింది.. కాబట్టి 19వ తేదీన సాంప్రదాయబద్దంగా గణేష్ పండగ జరుపుతున్నామని పేర్కొన్నారు. ఈనెల 28వ తేదీన నిమజ్జన కార్యక్రమం ఉంటుందని వెల్లడించారు.
Read Also: Deve Gowda: లోక్సభ ఎన్నికల కోసం దేవెగౌడ కీలక నిర్ణయం .. జేడీఎస్ కోర్ కమిటీ ఏర్పాటు
Also Read
అయితే, గత సంవత్సరం లాగే ఈసారి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తామని భాగ్యనగర్ ఉత్సవ సమితి ప్రకటించింది. గణేష్ పూజా విధానం తెలిపే బుక్తో పాటు పూజా సామాగ్రిని భక్తులకు ఇవ్వాలిని నిర్ణయించామన్నారు. గణేష్ మండపాలకు పోలీసు పర్మిషన్ తప్పనిసరి కాదు.. స్థానిక పోలీసు స్టేషన్లో చెబితే సరిపోతుంది అని తెలిపారు. గణేష్ ఉత్సవాల్లో రాజకీయ నాయకుల ఫ్లెక్సీలు పెడుతున్నారు.. ఇప్పటికే సుప్రీంకోర్టు ఫ్లెక్సీలను నిషేధించింది.. ఈసారి కూడా రాజకీయ నాయకుల ఫ్లెక్సీలను పెట్టవొద్దని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కు చెప్పామని భాగ్యనగర్ ఉత్సవ సమితి సభ్యులు తెలిపారు. గణేష్ ఉత్సవాలకు సీఎం కేసీఆర్ రావాలని అడిగినట్టు వారు తెలిపారు.
Read Also: Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి ఈ క్వాలిటీస్ ఉన్న అమ్మాయే కావాలట..
ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. హైదరాబాద్లో ఎంతో ఘనంగా గణేష్ ఉత్సవాలు జరుగుతాయన్నారు. 30 వేలకు పైగా వినాయక విగ్రహాలు రెడీ అవుతున్నాయి.. గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు పండుగ సజావుగా సాగేందుకు కృషి చేస్తున్నారు.. తెలంగాణ ప్రభుత్వం తరఫున గడిచిన తొమ్మిదేళ్లలో అన్ని మతాల పండుగలను గ్రాంఢ్ గా నిర్వహించామని ఆయన తెలిపారు. గణేష్ నిమజ్జన కార్యక్రమం శోభాయమానంగా జరుపుతాం.. నిమజ్జనం కోసం తాత్కాలిక చెరువులను ఏర్పాటు చేస్తామన్నారు.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!