Bhagyanagar Utsava Samiti: ఈ నెల 19నే వినాయక చవితి.. ఖైరతాబాద్ లో ఫ్లెక్సీలు నిషేధం
ఈ సంవత్సరం వినాయక చవిత ఉత్సవాలపై భాగ్యనగర్ ఉత్సవ సమితి కీలక ప్రకటన చేసింది. ఈనెల 19వ తారీఖున సాంప్రదాయబద్దంగా గణేష్ పండుగ నిర్వహించుకోవాలని తెలిపింది. అలాగే, 28వ తేదీన నిమజ్జనం ఉంటుందని క్లారిటీ ఇచ్చింది. కాగా, భాగ్యనగర్ ఉత్సవ సమితి సభ్యులు నేడు (సోమవారం) సమావేశం అయ్యారు. గణేష్ ఉత్సవ ఏర్పాట్లపై ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ ఏడాది వినాయక చవితి ఏ రోజున జరుపుకోవాలని చాలా మందిలో సందేహం ఉంది. అయితే, ఈనెల 18వ తేదీన మధ్యాహ్నం చవితి ప్రారంభమై.. 19వ తేదీ మధ్యాహ్నం వరకు ఉంటుంది. కనుకా.. సూర్యోదయం తర్వాత వచ్చిన తిథినే పండుగ రోజుగా గుర్తిస్తామని భాగ్యనగర్ ఉత్సవ్ కమిటీ తెలిపింది.. కాబట్టి 19వ తేదీన సాంప్రదాయబద్దంగా గణేష్ పండగ జరుపుతున్నామని పేర్కొన్నారు. ఈనెల 28వ తేదీన నిమజ్జన కార్యక్రమం ఉంటుందని వెల్లడించారు.
Read Also: Deve Gowda: లోక్సభ ఎన్నికల కోసం దేవెగౌడ కీలక నిర్ణయం .. జేడీఎస్ కోర్ కమిటీ ఏర్పాటు
Also Read
- TGSRTC: రూ. 20 వేలు లంచం డిమాండ్ చేసిన టికెట్ ఇన్ స్పెక్టర్.. చెప్పుతో దాడి చేసిన కండక్టర్, ప్రయాణికులు
- TG DGP C.V. Anand: తెలంగాణ నూతన డీజీపీగా సీవీ ఆనంద్ బాధ్యతల స్వీకరణ..
- Tandur: తాండూరులో చేతబడి కలకలం.. కూతురు ప్రేమ విఫలం కావాలని తల్లి క్షుద్రపూజలు..
- Junior Civil Judge Court: కాటారం రెవెన్యూ డివిజన్కు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు మంజూరు..
అయితే, గత సంవత్సరం లాగే ఈసారి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తామని భాగ్యనగర్ ఉత్సవ సమితి ప్రకటించింది. గణేష్ పూజా విధానం తెలిపే బుక్తో పాటు పూజా సామాగ్రిని భక్తులకు ఇవ్వాలిని నిర్ణయించామన్నారు. గణేష్ మండపాలకు పోలీసు పర్మిషన్ తప్పనిసరి కాదు.. స్థానిక పోలీసు స్టేషన్లో చెబితే సరిపోతుంది అని తెలిపారు. గణేష్ ఉత్సవాల్లో రాజకీయ నాయకుల ఫ్లెక్సీలు పెడుతున్నారు.. ఇప్పటికే సుప్రీంకోర్టు ఫ్లెక్సీలను నిషేధించింది.. ఈసారి కూడా రాజకీయ నాయకుల ఫ్లెక్సీలను పెట్టవొద్దని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కు చెప్పామని భాగ్యనగర్ ఉత్సవ సమితి సభ్యులు తెలిపారు. గణేష్ ఉత్సవాలకు సీఎం కేసీఆర్ రావాలని అడిగినట్టు వారు తెలిపారు.
Read Also: Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి ఈ క్వాలిటీస్ ఉన్న అమ్మాయే కావాలట..
ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. హైదరాబాద్లో ఎంతో ఘనంగా గణేష్ ఉత్సవాలు జరుగుతాయన్నారు. 30 వేలకు పైగా వినాయక విగ్రహాలు రెడీ అవుతున్నాయి.. గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు పండుగ సజావుగా సాగేందుకు కృషి చేస్తున్నారు.. తెలంగాణ ప్రభుత్వం తరఫున గడిచిన తొమ్మిదేళ్లలో అన్ని మతాల పండుగలను గ్రాంఢ్ గా నిర్వహించామని ఆయన తెలిపారు. గణేష్ నిమజ్జన కార్యక్రమం శోభాయమానంగా జరుపుతాం.. నిమజ్జనం కోసం తాత్కాలిక చెరువులను ఏర్పాటు చేస్తామన్నారు.
తాజావార్తలు
-
TGSRTC: రూ. 20 వేలు లంచం డిమాండ్ చేసిన టికెట్ ఇన్ స్పెక్టర్.. చెప్పుతో దాడి చేసిన కండక్టర్, ప్రయాణికులు
-
Bhuvneshwar Kumar Record: దూసుకెళ్తున్న స్వింగ్ మాస్టర్ భువనేశ్వర్.. జస్ప్రీత్ బుమ్రా రికార్డు బ్రేక్!
-
AC Health Risks: గంటల తరబడి ఏసీలో ఉంటున్నారా..? ఈ వ్యాధులకు కారణం కావచ్చు..! ఏం చేయాలి..
-
Top Selling CNG Cars: భారత్లో అత్యధికంగా సేల్ అయిన CNG కార్లు ఇవే..
-
IPL 2026 Playoffs Chances: రసవత్తరంగా ప్లేఆఫ్స్ రేస్.. గుజరాత్కు చిగురించిన ఆశలు, ఆ 5 టీమ్స్ ఇక ఇంటికేనా?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!