తెలంగాణలో ఒక్కసారి కూడా అసెంబ్లీని 30 రోజులు నడపక పోవడం చాలా బాధాకరం అని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. నా లాంటి చిన్న సభ్యుడితో.. సీనియర్ అయిన కేసీఆర్ అనిపించుకోవడం జాలి కలుగుతుంది అని ఆయన అన్నారు. శాసన సభను నడిపించడంలో ఇబ్బంది ఏంటి అంటూ రఘునందన్ రావు ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్రానికి వాతావరణ శాఖ వర్ష సూచన చేసింది. నేడు హైదరాబాద్ నగరంలో పలుచోట్ల భారీ వాన కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ సందర్భంగా హైదరాబాద్ నగరంలో మళ్లీ భారీ వర్షం కురుస్తోంది.
యువ రైతులు చేస్తున్న వ్యవసాయానికి మంత్రి నిరంజన్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ వ్యవసాయమే ప్రపంచానికి దిక్సూచి.. వ్యవసాయ రంగం సుభిక్షంగా ఉంటేనే ఈ ప్రపంచం సురక్షితంగా ఉంటుంది అని అన్నారు. పంట సాగుకు దూరమవుతున్న యువత మీలాంటి వారిని చూసి మళ్లీ వ్యవసాయాన్ని ప్రేమించాలి.. మట్టి పరిమళాన్ని ఆస్వాదించాలి అని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణాలోని నియంత పాలన అంతం అయ్యే దాకా బీజేపీ నిద్రపోదు అని కమలం పార్టీ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఈ ప్రభుత్వం ఇచ్చేదకా వదలం.. లేదంటే బీజేపీ అధికారంలోకి వచ్చాక మేమే ఇస్తామని ఆమె అన్నారు.
భర్త అంటే అమితమైన ప్రేమ ఉన్నవాళ్లు వాళ్లు భౌతికంగా దూరం అయిన తమతో ఉన్నారనే భావనలో ఉంటారు.. వికారాబాద్ తాండూరు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కోట్రిక విజయలక్ష్మి భర్త కోట్రిక వెంకటయ్య భౌతికంగా దూరమైనా ఆయనపై ఉన్న ప్రేమను మొక్క పై చూపిస్తుంది.. మొక్కలో తన భర్తను చూసుకుంది.. ఇంట్లో ఏ శుభకార్యం అయిన కూడా ఆ చెట్టును రెడీ చేసి అపూరూపంగా చూసుకుంటుంది.. తాజాగా తన భర్త పుట్టినరోజు సందర్బంగా చెట్టుకు వేడుక చేసింది. కుటుంబ…
బంగారు తెలంగాణ అని చెప్పి నీ కుటుంబాన్ని బంగారు కుంటుంబం చేసుకున్నావు.. తెలంగాణలో దోపిడి చేసి మహారాష్ట్రలో పార్టీ కార్యకలాపాలు చేస్తున్నాడు అని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరికాసేపట్లో డా.బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం స్టార్ట్ కానుంది. ఈ మీటింగ్ లో 40 నుంచి 50 అంశాలపై సుదీర్ఘంగా చర్చ జరిగే అవకాశం ఉంది.
తెలంగాణాలో వీధికుక్కల దాడిలో ఇప్పటికే చాలా మంది చిన్నారులు మృతి చెందారు.. ఇప్పుడు మరో దారుణం జరిగింది.. రెండు నెలల చిన్నారి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో దాడి చేసింది. ఈ దాడిలో చిన్నారి ముఖం పై, తలపై తీవ్రంగా గాయపరిచింది.. ఈ దారుణ ఘటన తెలంగాణ కామారెడ్డిలో వెలుగు చూసింది.. మాచారెడ్డి మండలం అంకిరెడ్డిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని గుంటి తండాలో చోటుచేసుకుంది.. తండాకు చెందిన భానోత్ సురేష్ జ్యోతి దంపతులు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా వీధి…
తెలంగాణ సీఐడీ ఎస్పీ కిషన్ సింగ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుపై సీఐడీ ఎస్పీపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు పేర్కొన్నారు. కొత్త పేటలోని TSSPDCL సీనియర్ అసిస్టెంట్ కు సీఐడీ ఎస్పీ కిషన్ సింగ్ వేధింపులకు గురిచేసినట్లు తెలుస్తోంది.