రాజకీయల్లో గత 40 ఏళ్లుగా అభివృద్ధి ద్యేయంగా పని చేశానని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. భవిష్యత్ లో కూడా అదే పని విధానము ఉంటుంది అని ఆయన తెలిపారు. ఒక నాయకుడు పార్టీలోకి వస్తుంటే కొందరు ఇబ్బంది పడతారు.. కానీ నన్ను క్రింది స్థాయి నుంచి అందరూ స్వాగతించారు.
ప్రాకృతిక సౌందర్యం, సంస్కృతి, కళలకు పెట్టింది పేరైన తెలంగాణ గ్రామాలు, కళలకు కేంద్ర ప్రభుత్వం సరైన గౌరవాన్ని కల్పిస్తోంది. ఇప్పటికే తెలంగాణ కళలకు, సాంస్కృతిక, పర్యాటక కేంద్రాలకు అంతర్జాతీయ గుర్తింపు రావడంలో కేంద్ర ప్రభుత్వం చొరవతీసుకుంది.
తెలంగాణకు తనకు ఉన్న బంధాన్ని సోనియమ్మ వెల్లడించారు అని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మీరందరూ తనతో ఉంటారుగా అని హామీ తీసుకొని వెళ్లారు సోనియమ్మ.. ఆ హామీని మనం నెరవేర్చాలి.. అభ్యర్థులు ఎవరైనా మన గుర్తు హస్తం గుర్తు మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. 6 డిక్లరేషన్లను ఖచ్చితంగా అమలు చ్చేస్తాం..
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆవకాశం నాకు కల్పించారు.. నాకు ఛాన్స్ ఇచ్చిన తర్వాత నియోజకవర్గ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యతో, పల్లా రాజేశ్వర్ రెడ్డితో, ముఖ్య నాయకులు అందరితో మాట్లాడుతున్నాను అని ఆయన తెలిపారు.
Education: రాష్ట్ర విభజనకు ముందు 2011లో చివరిసారిగా గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదలైంది. కాగా దాదాపు 11 సంవత్సరాల తరువాత 2022 ఏప్రిల్ 26న తెలంగాణలో తొలి గ్రూప్-1 ప్రకటనను టీఎస్పీఎస్సీ విడుదల చేసినది. ఇందులో ఏకంగా 503 పోస్టులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో 3.80 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షకు ధరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 2,32,457 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. ఈ ఫరీక్ష ఫలితాలు విడుదలైయ్యాక పేపర్ లీకేజ్ అయ్యిందని పరీక్షను రద్దు చేశారు.…
అల్పపీడన ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో సాధారణం నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. అయితే, నేడు కూడా హైదరాబాద్ నగరం సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీగా వానలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటిచింది.
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మరోసారి అధికార పార్టీకి గట్టి షాక్ ఇచ్చారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను ఆమె తిరస్కరించింది. గత కొన్ని రోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీలో చేరిన దాసోజు శ్రవణ్తో పాటు మాజీ ఎమ్మెల్యే కుర్రా సత్యనారాయణ అభ్యర్థిత్వాల సిఫార్సులను తమిళిసై తిరస్కరించారు.
కేంద్రంలో బీజేపీ సర్కార్ వచ్చాక వ్యవస్థలు అన్ని ధ్వంసం అయ్యాయని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. దేశంలో ఎక్కడ చూసిన ప్రతిపక్షాలపై ఈడీ, ఐటీ దాడులు జరుగుతున్నాయి..
దేశవ్యాప్తంగా మరో 9 వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు పట్టాలెక్కాయి. ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్గా వందేభారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు వందేభారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి.