Kadiyam Srihari: కాంగ్రెస్-బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాలలో ఉచిత పథకాలు ఉన్నాయా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో గ్రామస్థాయి విస్తృతస్థాయి సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆవకాశం నాకు కల్పించారు.. నాకు ఛాన్స్ ఇచ్చిన తర్వాత నియోజకవర్గ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యతో, పల్లా రాజేశ్వర్ రెడ్డితో, ముఖ్య నాయకులు అందరితో మాట్లాడుతున్నాను అని ఆయన తెలిపారు. 2009 నుంచి 2014 వరకు స్టేషన్ ఘనపూర్ ప్రజలు నన్ను ప్రజాప్రతినిధిగా ఎన్నుకున్నారు.. నియోజకవర్గానికి ఎంత సేవ చేసిన తక్కువే, నియోజకవర్గ ప్రజలకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేను అని కడియం శ్రీహరి అన్నారు.
Read Also: Pooja Hegde: క్రికెటర్ ప్రేమలో పూజా.. మరి ఆ డైరెక్టర్ పరిస్థితి ఏంటి.. ?
Also Read
- Ram Mandir Donation Scam: రామ మందిర విరాళాల వ్యవహారంలో ట్విస్ట్.. 8 మందిపై ఎఫ్ఐఆర్
- Pakistan Cricket Player: నా భార్య సపోర్ట్ ఇండియాకే.. పాక్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..
- Ketan Agarwal Case: సియా తండ్రికి గుండెపోటు.. కూతురిని ఉరితీయాలని ప్రకటన
- Foods for Naturally Glowing Skin: మెరిసే చర్మం కావాలా? ఈ ఫుడ్ తీసుకుంటే సహజ కాంతి మీ సొంతం..!
నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత పదవులు రావడం ఈ నియోజకవర్గం ప్రజలు పెట్టిన భిక్షే అంటూ కడియం శ్రీహరి అన్నారు. ఎవరిని మోసం చేసే గుణం నాది కాదు.. పనులు ఇస్తా అని పదవులు ఇస్తానని డబ్బులు తీసుకునే అలవాటు నా దగ్గర లేదు అని ఆయన పేర్కొన్నారు. ఏ పని చేసిన నిజాయితీగా చేస్తా.. మీకు గౌరవం దక్కే విధంగా ఉంటాను తప్ప, తలవొంపులు తీసుకురాను.. కాంగ్రెస్-బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాలలో రైతులకు ఉచిత పథకాలు అందుతున్నాయా అని కడియం ప్రశ్నించారు. అన్నమో రామచంద్ర అన్న తెలంగాణ రాష్ట్రం ఇవాళ దేశానికే అన్నం పెట్టే స్థాయికి ఎదిగింది అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి తెలిపారు.
Read Also: CAG Report: అసెంబ్లీ ముందుకు కాగ్ నివేదిక.. రాజధాని కోసం భూసేకరణను ఎండగట్టిన కాగ్..
తుక్కుగూడ బహిరంగ సభలో ఇచ్చిన ఆరు హామీలను కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్నారా అని కడియం శ్రీహరి ప్రశ్నించారు. బీజేపీ పార్టీ గురించి ఎక్కువ మాట్లాడే అవసరం లేదు.. రాష్ట్ర వ్యాప్తంగా సింగిల్ నెంబర్ కే పరిమితమై ఉంటుంది.. కానీ వాళ్ళ మాటలు మాత్రం కోటలు దాటుతాయి.. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎలా కొట్లాడుకుంటారో మన అందరికీ తెలుసు.. కాంగ్రెస్ పార్టీకి తప్పుదారి ఓటు వేస్తే ఆగమైతాం సుమా.. అభివృద్ధి చెందుతున్న తెలంగాణను ఆగం చేసుకున్నట్లేనని ఆయన చెప్పారు. ప్రజల మధ్యలో ఉంటే.. పనితీరు మంచిగా ఉంటే, నాయకులను ప్రజలు కడుపులో పెట్టి చూసుకుంటారు.. మంచి పనులు చేస్తే ప్రజలే మనల్ని కోరుకుంటారు.. దానికి ఉదాహరణ నేనే.. నియోజకవర్గ ప్రజలు నన్ను కోరుకోవడం.. నీతిగా నిజాయితీగా ఉంటే అవకాశం వస్తుందని కడియం శ్రీహరి అన్నారు.
తాజావార్తలు
-
Ram Mandir Donation Scam: రామ మందిర విరాళాల వ్యవహారంలో ట్విస్ట్.. 8 మందిపై ఎఫ్ఐఆర్
-
Pawan Kalyan :మీరు అడిగారు, మేము విన్నాం.. ఓజీ యూనివర్స్లోకి స్వాగతం
-
Pakistan Cricket Player: నా భార్య సపోర్ట్ ఇండియాకే.. పాక్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..
-
DOST : డిగ్రీ సీట్లకు డిమాండ్ డౌన్.. ప్రభుత్వ కాలేజీలకే క్రేజ్.!
-
Ketan Agarwal Case: సియా తండ్రికి గుండెపోటు.. కూతురిని ఉరితీయాలని ప్రకటన
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!