ICC vs Bangladesh: బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డును ICC సస్పెండ్ చేసే అవకాశం..?
- భారత్లో జరిగే టీ20 వరల్డ్ కప్ను బహిష్కరించిన బంగ్లాదేశ్..
- బంగ్లాదేశ్ నిర్ణయంపై రాజకీయ దురుద్దేశం దాగి ఉందని ఐసీసీ అనుమానం..
- బీసీబీ నిర్ణయంపై అంతర్గతంగా విచారణ ప్రారంభించిన ఐసీసీ..
- క్రికెట్కు అతీతమైన కారణాలు తీసుకున్నట్లు తేలితే.. బంగ్లా క్రికెట్ బోర్డును ICC సస్పెండ్ చేసే ఛాన్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ICC vs Bangladesh: టీ20 వరల్డ్ కప్ మ్యాచ్లు భారత్లో ఆడబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) తీసుకున్న నిర్ణయాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అత్యంత సీరియస్గా పరిగణిస్తున్నట్లు సమాచారం. టోర్నమెంట్ భారత్లోనే జరుగుతుందని స్పష్టంగా చెప్పడంతో, బీసీబీ ఆ నిర్ణయాన్ని నిరాకరించడంలో రాజకీయ దురుద్దేశం దాగి ఉందని ఐసీసీ అనుమానిస్తోంది. ఈ అంశంపై ఇప్పటికే అంతర్గతంగా విచారణ ప్రారంభించినట్లు క్రీడా వర్గాలు తెలియజేస్తున్నాయి. బంగ్లాదేశ్ నిర్ణయం వెనుక క్రికెట్కు అతీతమైన కారణాలు ఉన్నాయని నిర్ధారణ అయితే, బీసీబీపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది.
Also Read
- Smriti Mandhana: మిథాలీ రాజ్ను పక్కకు నెట్టిన స్మృతి.. ఆసియా కప్లో సరికొత్త చరిత్ర..
- Prabhsimran Singh: టీమిండియాలో దక్కని చోటు.. మూడు రోజుల్లో రెండు సెంచరీలతో వీరవిహారం..
- Mohsin Naqvi: ‘భారత్ పసికూన ఐర్లాండ్ చేతిలో ఓడిపోలేదా..? పాకిస్థాన్పై మీ విమర్శలు ఎందుకు..’?
- Asia Cup 2026: ఆసియా కప్లో జోరుమీదున్న భారత్.. నేడు హాంకాంగ్తో మ్యాచ్.. తుది జట్టు ఇదే..
అయితే, అవసరమైతే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డును సస్పెండ్ చేయాలన్న ఆలోచన కూడా ఐసీసీ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. వచ్చే నెల 7న టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో, ఈ అంశంపై ఆలస్యం చేయకుండా త్వరలోనే తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని క్రీడా వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. వరల్డ్ కప్ టోర్నమెంట్ షెడ్యూల్, నిర్వహణలో ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకెళ్లడమే ప్రధాన లక్ష్యంగా ఐసీసీ చర్యలు చేపట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ పరిణామం క్రికెట్ ప్రపంచంలో పెద్ద చర్చకు దారి తీస్తుండగా, బంగ్లాదేశ్ టోర్నీ బహిష్కరణపై ఇంకా కొద్ది రోజులు వేచి చూడాల్సి ఉంటుందని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Smriti Mandhana: మిథాలీ రాజ్ను పక్కకు నెట్టిన స్మృతి.. ఆసియా కప్లో సరికొత్త చరిత్ర..
-
OTR: రాజగోపాల్ రెడ్డి రాజన్న రాగం ఎందుకు వినిపిస్తున్నారు..?
-
Chatgpt: చాట్ జీపీటీలో అంతరాయం.. వినియోగదారుల్లో ఆందోళన
-
Jaishankar in Kyiv: రష్యా చమురు కొనుగోళ్లను భారత్ ఆపుతుందా? జెలెన్స్కీకి జైశంకర్ క్లారిటీ..
-
OTR: స్థానిక సమరం.. ఉమ్మడి అనంతపురం జిల్లా వైసీపీ నేతల్లో గుబులు..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!