హైదరాబాద్: పెండింగ్ లో ఉన్న ట్రాఫిక్ చలాన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం రాయితి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఈ రోజు (డిసెంబర్ 26) నుంచి పెండింగ్ చలాన్లపై రాయితీ వర్తింపజేస్తున్నట్లు ప్రభుత్వం జీవో విడుదల చేసింది. టూ వీలర్స్పైన 80 శాతం రాయితీ ప్రకటిస్తున్నట్టు జీవో స్పష్టం చేసింది. త్రీ వీలర్స్పై 90 శాతం రాయితీ.. కార్లకు 50 శాతం రాయతీని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో దాదాపు రెండు…
చంద్రబాబు ఇద్దరు పీకేలను విమర్శించి.. వాళ్లనే పక్కన పెట్టుకున్నాడు: ఒకప్పుడు ఇద్దరు పీకేలను విమర్శించి.. ఇప్పుడు వాళ్లనే పక్కన పెట్టుకున్నాడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి విమర్శించారు. చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో ఎలాంటి అభివృధి, సంక్షేమం పాలన అందించ లేదన్నారు. చంద్రబాబుకు ఎస్సీలను చిన్నచూపు చూసే నైజం మొదటి నుంచి ఉందన్నారు. దళితులను నేటికీ గౌరవించని వ్యక్తి చంద్రబాబు అని నారాయణ స్వామి మండిపడ్డారు. నేడు నెహ్రూ మున్సిపల్…
నేటి నుంచి ‘ఆడుదాం ఆంధ్రా’ కార్యక్రమం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారిగా గ్రామ, వార్డు సచివాలయ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు నిర్వహిస్తున్న ‘ఆడుదాం ఆంధ్రా’ క్రీడా పోటీలు మంగళవారం ప్రారంభం కానున్నాయి. ఈ పోటీలను మంగళవారం గుంటూరు జిల్లాలోని నల్లపాడు వద్ద ఉన్న లయోలా పబ్లిక్ స్కూల్లో సీఎం వైఎస్ జగన్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. డిసెంబర్ 26 నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు 47 రోజుల పాటు జరిగే క్రీడా సంబరంలో క్రికెట్,…
నేడు కృష్ణా జిల్లాలో బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి పర్యటించనున్నారు. పామర్రు బెల్ పరిశ్రమ పరిశీలన, జిల్లా కార్యవర్గ సమావేశంలో పురంధరేశ్వరి పాల్గొననున్నారు. నేడు అనకాపల్లి మండలం కూండ్రం గ్రామంలో వంగవీటి రంగా విగ్రహాంను విశాఖ ఉత్తర ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆవిష్కరించనున్నారు. అనంతరం గ్రామంలో బహిరంగ సభ ఏర్పాటు చేసి మాట్లాడనున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి తానేటి వనిత పర్యటించనున్నారు. ఉదయం 11:00 గంటలకు కొవ్వూరు టౌన్లో…
తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తన తాజా బులిటెన్లో వెల్లడించింది. ఇప్పటి వరకూ మొత్తం నమోదైన కేసుల సంఖ్య దాదాపు 8 లక్షల 44 వేల 558కి చేరింది.
తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల జీరో టికెట్లు ఇచ్చామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. మా కమిట్మెంట్ ఎలా ఉంటే.. బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం ఆర్థిక వ్యవస్థను చిన్నా భిన్నం చేసింది.. అసెంబ్లీలో మేము శ్వేత పత్రం విడుదల చేశాం.. కేటీఆర్ విడుదల చేసిన స్వేద పత్రంలో ఔటర్ రింగ్ రోడ్డు కట్టినట్లు ఫోటో పట్టుకున్నారు.. ఔటర్ కట్టింది కాంగ్రెస్ పార్టీ అనే విషయం గుర్తు పెట్టుకోవాలని ఆయన సూచించారు.