MLC Jeevan Reddy: అనవసర ప్రాజెక్ట్ లు కట్టి రాష్ట్రాన్ని అప్పులోకి నెట్టారు..
తెలంగాణ శాసనమండలిలో అసెంబ్లీలో గవర్నర్ ప్రంసగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరిగింది. ఈ చర్చలో భాగంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుపై వెంటనే దృష్టి పెట్టాలి.. కృష్ణా నీటిని అక్రమంగా తరలిస్తున్నా.. చూస్తూ కూర్చుంటే ఎలా.. గత ప్రభుత్వం కృష్ణా జలాల్లో మన హక్కులను పరిరక్షించలేదు అని ఆయన తెలిపారు. గత ప్రభుత్వం లేఖలకే పరిమితం అయింది అంటూ విమర్శలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కాదు అది కమిషన్ ప్రాజెక్ట్.. మిషన్ భగీరథ తో జనాలకు ఒరిగింది ఏమి లేదు.. అనవసర ప్రాజెక్ట్ లు కట్టి రాష్ట్రాన్ని అప్పులోకి నెట్టారు అంటూ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.
Read Also: Parliament Attack: పార్లమెంటు వెలుపల తనను తాను కాల్చుకోవాలనుకున్న దాడి నిందితుడు.. విచారణలో వెల్లడి
Also Read
మేడిగడ్డ ప్రాజెక్ట్, మిషన్ భగీరథపై జ్యుడిషియల్ విచారణ చేపట్టాలి అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కోరారు. కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వలన ఎల్టీఐఆర్ (Itir) ప్రాజెక్ట్ మన రాష్ట్రానికి రాలేదు అంటూ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతుంటే బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు అడ్డుపడినారు. ఇక, విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన విద్యుత్ ను ఎందుకు తీసుకు రాలేక పోయారు?.. 4 వేల మెగావాట్ల ఉచిత విద్యుత్ కేంద్రం నుంచి రావాల్సి ఉంది.. దాన్ని కాదని నాటి ముఖ్యమంత్రి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్మాణం చేపట్టారు అంటు ఆయన పేర్కొన్నారు. బొగ్గు ఉత్పత్తి అయ్యే రామగుండంలో విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయకుండా నల్గొండ దామరచర్లలో ఎందుకు ఏర్పాటు చేశారు?.. ఉద్యమ నాయకుడు, నాటి ముఖ్యమంత్రి రాష్ట్రానలన్ని అప్పుల ఊబిలో నెట్టాడు అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.
Read Also: Raghuram Rajan: ప్రభుత్వాలు దివాలా తీసే స్థాయిలో ఉచితాలు ఉండొద్దు..
రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి ప్రాబ్లమ్ అవుతుంది అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేర్కొన్నారు. విద్యుత్ కొనుగోలు చేసి ప్రజలకు ఇవ్వడం రాష్ట్రంలో ఉత్పత్తి చేసినట్లు కాదు.. తెలంగాణ వచ్చిన తరువాత కూడా జనాల బతుకులు మారలేదు.. మా ప్రాంతంలో జనాలు బతకడానికి ఇంకా గల్ఫ్ కి వెళుతున్నారు.. గత ప్రభుత్వంలో గల్ఫ్ కార్మికులు కట్టిన ట్యాక్స్ లు తీసుకున్నారు.. కానీ వాళ్ళు గల్ఫ్ దేశాల్లో చనిపోతే వాళ్లకు ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం ఇవ్వలేదు అంటూ ఆయన చెప్పారు. గత ప్రభుత్వం గల్ఫ్ కార్మికులను ఆదుకుంటామని చెప్పి కనీసం పట్టించుకోలేదు.. మండలి చైర్మన్ మీకు ఎంత టైం కావాలో చెప్పండి అంత టైం ఇస్తాము.. నన్ను అక్కడికి పంపిస్తే అయిపోవు కదా మీరు నిమ్మలంగా ఉండే వాళ్ళు.. చైర్మన్ మిమ్మల్ని అక్కడికి పంపిన మళ్ళీ ఇక్కడికే వచ్చే వారు కదా.. జనాలు ఎక్కడ ఉండాలని ఆశీర్వాదం ఇస్తే అక్కడ ఉంటాను.. నా బాధ్యత నేను నిర్వహిస్తానంటూ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Telangana DGP: తెలంగాణ కొత్త డీజీపీగా CV ఆనంద్ నియామకం.!
-
Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్రం కీలక ప్రకటన..
-
Jana Nayagan: ఎన్నికల ఆఫీసులో పైరసీ సినిమా.. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా? చూస్తే షాక్ అవుతారు!
-
Faria Abdullah: అమ్మ హిందూ.. నాన్న ముస్లిం.. కానీ అసలైన ట్విస్ట్ ఇదే!
-
Honeymoon murder: హనీమూన్ మర్డర్ కేసులో సోనమ్ రఘువంశీకి బెయిల్..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో