Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Headlines Ntv Top News At 9am On 16th December 2023

Top Headlines@9AM: టాప్‌ న్యూస్‌

Published Date :December 16, 2023 , 9:00 am
By Chandra Shekhar Pamena
Top Headlines@9AM: టాప్‌ న్యూస్‌
  • Follow Us :
  • google news
  • dailyhunt

కొనసాగుతున్న అసెంబ్లీ సమావేశాలు.. నేడు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. నాలుగోరోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గత వారం ప్రమాణ స్వీకారం అనంతరం సభ వాయిదా పడింది. అనంతరం 14న తేదీ తెలంగాణ స్పీకర్‌ గా గడ్డం ప్రసాద్‌ కుమార్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం ఈనెల బీజేపీ, బీఆర్‌ఎస్‌, బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. నిన్న (15వ) తేదీన ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. 16వ తేదీన గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని శాసనసభ, మండలిలో విడివిడిగా ప్రవేశపెట్టి చర్చిస్తారు. 17న కూడా సమావేశాలు నిర్వహించే అవకాశాలున్నాయి.

త్వరలోనే కొత్త రేషన్‌ కార్డులు.. రేవంత్ సర్కార్‌ చర్యలు
తెలంగాణ రాష్ట్రంలో కొలువుదీరిన కొత్త సర్కార్ పెండిగ్‌లో ఉన్న పనులపై దృష్టి సారించింది. కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్న కొత్త రేషన్ కార్డులను జారీ చేసే సమస్యను రేవంత్ సర్కార్ ప్రారంభించింది. త్వరలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం.. విధి విధానాలను సృష్టించడం కూడా ప్రారంభించింది. అయితే సచివాలయంలో పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులతో నీటి పారుదల, సివిల్ సప్లయ్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సెక్రటేరియట్‌లో సివిల్ సప్లైస్ విభాగం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కొత్త రేషన్ కార్డుల జారీతో పాటు ప్రస్తుత రేషన్ కార్డులపై అధికారులతో మంత్రి ఈ సమస్యపై చర్చించారు. అంతేకాకుండా.. కొన్ని నెలలుగా రేషన్‌ తీసుకోని కార్డులు ఉంచాలా తీసేయాలా అనే అంశంపై కూడా అధికారులతో చర్చించారు. అయితే.. అసలైన అర్హులకే కార్డులుండేలా చర్యలు తీసుకోవాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు.

ఏపీలో ఐదో రోజు కొనసాగుతున్న అంగన్వాడీల సమ్మె
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీలతో ప్రభుత్వం చర్చలు మరోసారి విఫలమయ్యాయి. దీంతో అంగన్వాడీ సిబ్బంది ఐదు రోజులుగా సమ్మె చేస్తున్నారు. ఏపీ సర్కార్ ఓవైపు వలంటీర్లతో అంగన్వాడీ సెంటర్లు తెరిపిస్తూనే మరోవైపు అంగన్వాడీ సిబ్బందితో చర్చలు చేస్తుంది. అయితే, నిన్న జరిగిన మూడో విడత చర్చలు కూడా ఫలించలేదు. అటు అంగన్వాడీ సిబ్బంది.. ఇటు ప్రభుత్వం మెట్టు దిగి రావడం లేదు.. దీంతో సమ్మె కొనసాగుతోంది. ఇవాళ మరోసారి అంగన్వాడీ యూనియన్లు నిరవాధిక సమ్మెకు దిగింది.
జీతాల విషయంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వెనక్కి తగ్గకపోవడంతో అంగన్వాడీ సిబ్బంది సమ్మె కొనసాగిస్తున్నట్టు వెల్లడించాయి. ప్రభుత్వం మొండి వైఖరితో ఉండటం వల్లే సమ్మెకు దిగుతున్నట్లు అంగన్వాడీ యూనియన్లు తెలిపాయి.

కాంగ్రెస్ భారీ ప్లాన్.. 28న నాగ్‌పూర్‌లో 10 లక్షల మందితో మెగా ర్యాలీ
కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నాగ్‌పూర్‌లో మెగా ర్యాలీ జరగనుంది. డిసెంబర్ 28న జరిగే ఈ మెగా ర్యాలీకి 10 లక్షల మంది కాంగ్రెస్ కార్యకర్తలు హాజరుకానున్నారు. ఈ మెగా ర్యాలీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులందరూ హాజరుకానున్నారు. ఆలిండియా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ కెసి వేణుగోపాల్ మహారాష్ట్ర కాంగ్రెస్ నేతలతో జరిగిన సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రజలు కాంగ్రెస్‌ వెంటే ఉన్నారని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్‌ అన్నారు. పార్టీ ఓట్ల శాతం పెరుగుతోంది. రాష్ట్ర ఎన్నికల ఫలితాలను బట్టి ఇది అర్థమవుతుంది. పార్టీ నేతలతో సమావేశమైన అనంతరం వేణుగోపాల్ మాట్లాడుతూ.. నాగ్‌పూర్‌లో జరిగే మహా ర్యాలీలో మా అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తదితరులు ప్రసంగిస్తారని తెలిపారు. మహారాష్ట్ర, ముఖ్యంగా విదర్భలో పార్టీకి ఎన్నికల అవకాశాలున్నాయని కేంద్ర నాయకత్వం మరింత దృష్టి సారించాలని పార్టీ నేతలు కోరినట్లు ఆయన తెలిపారు.

యువకుడి ప్రాణాలు కాపాడిన మాజీ ముఖ్యమంత్రి
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శుక్రవారం రాత్రి ఓ యువకుడి ప్రాణాలను కాపాడారు. భోపాల్‌లోని రవీంద్ర భవన్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తన కాన్వాయ్‌ను ఆపి గాయపడిన యువకుడిని తన కారులో ఆసుపత్రికి తరలించారు. ఈ సమయంలో గాయపడిన వ్యక్తి రక్తం శివరాజ్ సింగ్ చౌహాన్ చేతులకు అంటింది. ఆస్పత్రికి వెళుతుండగా గాయపడిన యువకుడు మామయ్య తనతో ఉన్నాడని… దీనిపై మాజీ సీఎం శివరాజ్ స్పందిస్తూ.. చింతించకండి, మామయ్య మీ వెంటే ఉన్నారని అన్నారు. ఈ సంఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయినప్పటి నుండి శివరాజ్ సింగ్ ఈ దాతృత్వం చాలా చర్చనీయాంశమైంది.

జెరూసలేం పై రాకెట్లు వర్షం.. గాజాలో నిరాశ్రయులైన 85శాతం జనాభా
ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఇజ్రాయెల్ ఆర్మీ విమానాలు హమాస్ నియంత్రణలో ఉన్న గాజా స్ట్రిప్‌పై నిరంతరం బాంబు దాడులు చేస్తున్నాయి. ఈ యుద్ధం శనివారంతో 71 రోజులు పూర్తి చేసుకుంది. యుద్ధం కారణంగా అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. హమాస్ చేతిలో ఉన్న ముగ్గురు బందీలను ఇజ్రాయెల్ సైన్యం అనుకోకుండా చంపేసింది. సైన్యం వారిని ముప్పుగా భావించి కాల్చి చంపింది. బందీలను చంపడంపై ఇజ్రాయెల్‌లో కలకలం రేగుతోంది. ఇది విషాదకర ఘటన అని ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వ్యాఖ్యానించారు. ఆగ్రహించిన ప్రజలు టెల్ అవీవ్‌లోని ఇజ్రాయెల్ ఆర్మీ ప్రధాన కార్యాలయం వెలుపల ప్రదర్శనలు చేశారు. ఇజ్రాయెల్ సైన్యం గాజాకు అందించిన సహాయం తమ భూభాగం గుండా వెళుతుందని తెలిపింది. అక్టోబర్ 7న ప్రారంభమైన యుద్ధం తర్వాత పాలస్తీనియన్లకు ఇజ్రాయెల్ ద్వారా సాయం అందడం ఇదే తొలిసారి.

డైనోసర్ మొదటి టికెట్ జక్కన చేతికి…
రెబల్ స్టార్ ప్రభాస్… ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కి ఇండియన్ బాక్సాఫీస్ ని రఫ్ఫాడించడానికి వస్తుంది సలార్. ఈరోజు నుంచి సరిగ్గా ఆరు రోజుల్లో తీరాన్ని తాకనున్న సలార్ తుఫాన్ ధాటికి ఎన్ని బాక్సాఫీస్ రికార్డులు లేస్తాయో లెక్కబెట్టడానికి ట్రేడ్ వర్గాలు రెడీగా ఉన్నాయి. ప్రభాస్ ఫ్యాన్స్ కూడా సలార్ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇండియాస్ మోస్ట్ యాంటిసిపేటెడ్ సినిమా కాబట్టి కలెక్షన్స్ కూడా ఆ రేంజులోనే ఉండబోతున్నాయి. బుకింగ్స్ ఓపెన్ అవ్వడంతో సలార్ టికెట్స్ కోసం ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. అయితే సలార్ ఫస్ట్ టికెట్ మాత్రం రాజమౌళి చేతికి వెళ్లింది. దర్శక ధీరుడు రాజమౌళితో సలార్ సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూ చేసారు. ప్రశాంత్ నీల్, ప్రభాస్, పృథ్వీరాజ్ తో రాజమౌళి స్పెషల్ ఇంటర్వ్యూ చేసాడు. ఇద్దరు సెన్సేషనల్ డైరెక్టర్స్ కలిసి చేసిన పాన్ ఇండియా ఇంటర్వ్యూ ఆడియన్స్ కి తప్పకుండా ఎంటర్టైన్ చేస్తుంది. ఈ ఇంటర్వ్యూలో సలార్ ఫస్ట్ టికెట్ ని రాజమౌళి తీసుకున్నాడు. దాదాపు పది వేలకి పైగా ఖర్చు పెట్టి సలార్ ఫస్ట్ టికెట్ ని రాజమౌళి దక్కించుకున్నాడు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • andhrapradesh
  • international news
  • national news
  • telangana
  • telangana elections 2023

తాజావార్తలు

  • బిర్యానీ ప్రియులరా.. జర ఇది చూడండి.. బంజారాహిల్స్‌లో కుళ్ళిన బిర్యానీ కలకలం

  • CM Chandrababu: సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా రాయలసీమ.. రూ.39,436 కోట్ల విలువైన 31 ప్రాజెక్టులకు ఆమోదం.!

  • RR vs MI 2026: అభిమానులకు షాక్.. రాజస్థాన్ vs ముంబై మ్యాచ్‌ అనుమానమే!

  • Pradeep Ranganathan : చాలా బ్రేకప్స్ చూశా..వాళ్లే నన్ను బ్లాక్ చేస్తూ ఉంటారు!

  • BCCI మాస్టర్ ప్లాన్.. నెక్స్ట్ జెనరేషన్ టెస్ట్ క్రికెటర్లను తీర్చిదిద్ధేందుకు ప్రత్యేక రోడ్ మ్యాప్..!

ట్రెండింగ్‌

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions