BJP : ‘మదర్సాలలో తిండి లేదు, ఆలయాలు కబ్జా చేస్తున్నారు’.. బీజేపీ అభ్యర్థి సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP : భారతీయ జనతా పార్టీ (బిజెపి) 2024 లోక్సభ ఎన్నికలకు అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. లోక్సభ ఎన్నికల్లో టికెట్ పొందిన అభ్యర్థుల్లో హైదరాబాద్, తెలంగాణకు చెందిన మాధవి లత కూడా ఉన్నారు. ఆమె ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) చీఫ్ అసదుద్దీన్ ఒవైసీని టార్గెట్ చేశారు. బీజేపీ అభ్యర్థి మాధవి లత వార్తా సంస్థతో మాట్లాడుతూ, “నేను గత ఎనిమిది సంవత్సరాలుగా చూస్తున్నాను. అక్కడ పరిశుభ్రత, విద్య లేదు. మదర్సాలలో పిల్లలకు ఆహారం అందడం లేదు. దేవాలయాలు, హిందువుల ఇళ్లను అక్రమంగా కబ్జా చేస్తున్నారు. ముస్లిం పిల్లలు చదువుకోలేదు. బాల కార్మికులు ఉన్నారు. వారికి చదువు లేదా భవిష్యత్తు లేదు. వీరికి ఒకే ఒక పని, అల్లర్లు, ఇలా చేస్తున్న వారు దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. పాతబస్తీ హైదరాబాద్ నడి మధ్యలో ఉంది.. అయినా అక్కడ ఇంకా పేదరికమే ఉంది.
Read Also:Pavitranath: మొగలిరేకులు దయ మృతి.. భార్య చేసిన ఆరోపణలు.. దానివలనే
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
హైదరాబాద్ లోక్సభ స్థానంపై చర్చ ఎందుకు?
తెలంగాణలోని ప్రముఖ హైదరాబాద్ స్థానం నుంచి అసదుద్దీన్ ఒవైసీపై బీజేపీ మాధవి లతను బరిలోకి దింపింది. ప్రస్తుతం ఈ స్థానం నుంచి అసదుద్దీన్ ఒవైసీ ఎంపీగా ఉండగా, 1984 నుంచి ఒవైసీ కుటుంబం ఈ స్థానం నుంచి వరుసగా గెలుస్తూ వస్తోంది. ఈ ప్రాంతం ఒవైసీ కుటుంబానికి కంచుకోటగా పరిగణించబడుతుంది. అసదుద్దీన్ తండ్రి సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ 1984లో తొలిసారిగా ఈ స్థానం నుంచి ఎంపీగా ఎన్నికై 2004 వరకు ఎంపీగా కొనసాగారు. అప్పటి నుంచి అసదుద్దీన్ ఒవైసీ ఇక్కడి నుంచి ఎంపీగా కొనసాగుతున్నారు.
మాధవి లత ఎవరు?
బీజేపీ అభ్యర్థి మాధవి లత వృత్తిరీత్యా వైద్యురాలు, విరించి ఆస్పత్రి చైర్పర్సన్ కూడా. దీనితో పాటు, ఆమె భరతనాట్యం నర్తకి కూడా. ఆమె హిందుత్వ సమస్యపై గళం విప్పుతూనే ఉంది. హిందూమతం గురించి ఆమె చేసిన ప్రసంగాల ద్వారా చాలా చర్చనీయాంశమైంది. గతంలో ఈ స్థానంలో బీజేపీ భగవత్రావును బరిలోకి దింపగా, హైదరాబాద్ నుంచి మహిళా అభ్యర్థికి బీజేపీ టికెట్ ఇవ్వడం ఇదే తొలిసారి.
#WATCH | Hyderabad, Telangana: On her candidature from Hyderabad constituency, BJP leader Madhavi Latha says, "I have been seeing for last 8 years… There is no cleanliness and education. Children in Madrasas are not getting food. Temples and Hindu homes are being occupied… pic.twitter.com/eKBkGAWXa8
— ANI (@ANI) March 2, 2024
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!