Home
Telangana
Telangana News
-
Harish Rao : మిషన్ భగీరథకు 10 ఏళ్లు.. హరీశ్ రావు సంబరం..
తెలంగాణలో ఇంటింటికీ సురక్షితమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రారంభమైన ‘మిషన్ భగీరథ’ పథకం నేటితో పదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని బిఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆనందం వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ ప్రాజెక్టుకు సంబంధించిన ఒక ప్రత్యేక వీడియోను షేర్ చేసిన ఆయన, ఇది కేవలం ఒక ప్రభుత్వ పథకం మాత్రమే కాదని, తెలంగాణ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన ఒక మహత్తరమైన… -
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
Krishna River Management Board: కృష్ణా నదీ జలాల వినియోగం, నీటి పంపకాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఈ మేరకు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) ఛైర్మన్కు జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లేఖ రాశారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటి నిల్వలపై అత్యవసరంగా చర్చించేందుకు బోర్డు సమావేశం నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ఎల్నినో ప్రభావం నేపథ్యంలో ఈ ఏడాది నీటి లభ్యతపై అనిశ్చితి ఉండే అవకాశం… -
Cyber Crime: సైబర్ క్రైమ్ పనితీరులో మొదటి స్థానంలో తెలంగాణ.. 9 కీలక అంశాల్లో అగ్రగామిగా..
ప్రధాన మంత్రి కార్యాలయం (PMO) నిర్వహించిన ‘ప్రగతి’ సమీక్షా సమావేశంలో సైబర్ నేరాల నియంత్రణ, పనితీరులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. సైబర్ భద్రతకు సంబంధించిన 9 కీలక అంశాల ఆధారంగా ఈ ర్యాంకింగ్ ఇచ్చారు. ఆ అంశాలు ఏవంటే.. రాష్ట్ర సైబర్ క్రైమ్ సమన్వయ కేంద్రం(S4C) ఏర్పాటు, ఈ-జీరో ఎఫ్.ఐ.ఆర్ అమలు, ఫిర్యాదుల పరిష్కార విభాగం, డబ్బును రీఫండ్ చేసే మనీ రెస్టోరేషన్ మాడ్యూల్ (MRM), హానికర కంటెంట్ తొలగించే ‘సహాయోగ్’ పోర్టల్,… -
ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
తెలంగాణ సచివాలయంలో సమాచార సాంకేతిక, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు టీ-ఫైబర్ ప్రాజెక్టు పురోగతిపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ఐటీ శాఖ జాయింట్ సెక్రటరీ అనుదీప్ దురిశెట్టి, టీ-ఫైబర్ మేనేజింగ్ డైరెక్టర్ వేణు ప్రసాద్, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి కేవలం టీ-ఫైబర్ ద్వారానే ఇంటర్నెట్ సౌకర్యాన్ని అందించాలని మంత్రి… -
OTR : కాంగ్రెస్లో ఎమ్మెల్సీ ఫైట్..!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల గురించి కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి చర్చ జరుగుతోంది? రేస్లో ఉన్న అభ్యర్థులు ఎవరు? వాళ్ల గురించి పార్టీ వర్గాలు ఏమనుకుంటున్నాయి? అసలు రెండు ఎమ్మెల్సీ సీట్లకు ఎంత మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు? పార్టీ పెద్దల ఆలోచన ఎలా ఉంది? తెలంగాణలో పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల టైం దగ్గర పడుతున్న కొద్దీ అధికార కాంగ్రెస్ పార్టీలో నేతల హడావుడి పెరిగిపోతోంది. టిక్కెట్ కోసం చాలా మంది నేతలు ఎవరి స్థాయిలో వారు… -
KTR: ప్రచార హామీలు మరిచారా.? జాబ్ క్యాలెండర్ ఎక్కడంటూ ప్రభుత్వంపై ఫైర్.!
KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో యువత తీవ్ర నిరాశలో ఉందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన ఉద్యోగ హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదని ఆరోపించారు. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలోని యువత ఒక రకమైన నిర్వేదంలో ఉందన్నారు. దేశ రాజకీయాలను గమనిస్తున్న ప్రతి ఒక్కరికీ ఈ విషయం అర్థమవుతోందని.. ఎన్నికల సమయంలో… -
CM Revanth Reddy : చెరువులకు మళ్లీ జీవం.. HYDRAAపై సీఎం ప్రశంసలు.!
హైదరాబాద్ నగరంలోని చెరువుల పరిరక్షణ, ఆక్రమణల తొలగింపు , జలవనరుల పునరుజ్జీవం కోసం పనిచేస్తున్న హైడ్రా (HYDRAA) వ్యవస్థ పనితీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. చెరువుల పునరుద్ధరణతో మహానగరం సరికొత్త రూపురేఖలను సంతరించుకుంటోందని, ఇది తనకు ఎంతో సంతృప్తిని ఇస్తోందని ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఉప్పల్ నల్ల చెరువుకు జీవం.. హైడ్రా బృందానికి ప్రశంసలు ప్రధానంగా ఉప్పల్ నల్ల చెరువు పునరుజ్జీవనం కోసం అహర్నిశలు శ్రమించిన హైడ్రా అధికారులు ,… -
CM Revanth Reddy : అభివృద్ధిలో సరికొత్త మైలురాళ్లు తాకుతున్న తెలంగాణ
డిసెంబర్ 2023లో కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టినప్పటి నుండి తెలంగాణ రాష్ట్రం వేగవంతమైన ప్రగతిని సాధిస్తూ, అభివృద్ధిలో సరికొత్త మైలురాళ్లను తాకుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. సరైన విధానపరమైన పరిపాలన, పెట్టుబడుల ఆకర్షణ , ఉద్యోగాల కల్పన ద్వారా రాష్ట్రం నేడు దేశంలోనే అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్న అగ్రగామి రాష్ట్రాలలో ఒకటిగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. తలసరి ఆదాయంలో సరికొత్త రికార్డు రాష్ట్ర ఆర్థిక పురోగతికి అద్దం పడుతూ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తెలంగాణ… -
Anganwadi Recruitment: అంగన్వాడీ ఉద్యోగాల నియామకం.. ఆ జిల్లాలకు మంత్రి సీతక్క డెడ్లైన్..
తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖ పనితీరుపై మంత్రి సీతక్క ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అంగన్వాడీ వ్యవస్థను క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేశారు. అందులో భాగంగా అంగన్వాడీ టీచర్ల నుంచి నేరుగా సలహాలు, సూచనలు స్వీకరించేందుకు జిల్లాల వారీగా ప్రత్యేక సదస్సులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్ల సమస్యలను తక్షణమే గుర్తించి వాటిని పరిష్కరించేలా చర్యలు… -
Hyderabad: పెరుగుతున్న వరద ప్రవాహం.. మూసీ ప్రాజెక్ట్ పరివాహక ప్రాంత ప్రజలకు అలర్ట్..
Hyderabad: హైదరాబాద్ నగరంలో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా మూసీ నదికి వరద నీటి తాకిడి పెరుగుతోంది. ఉపరితలాల నుంచి భారీగా వరద వస్తుండటంతో మూసీ ప్రాజెక్ట్ నీటి మట్టం వేగంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్ట్ ప్రస్తుత పరిస్థితి, నీటి వివరాలను అధికారులు విడుదల చేశారు.
తాజావార్తలు
-
OTR : నెల్లిమర్ల నగర పంచాయతీలో ఛైర్మన్ సీటు పంచాయితీ
-
Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
-
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
-
Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్లో 350 పరుగులు.. తొలి బ్యాటర్గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?