* నేడు కేంద్రమంత్రులతో భేటీ కానున్న సీఎం చంద్రబాబు.. ఉదయం 10 గంటలకు కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ తో చంద్రబాబు సమావేశం.. ఉదయం 11 గంటలకి అమిత్ షాతో చంద్రబాబు భేటీ.. మధ్యాహ్నం ఒంటి గంటకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో సీఎం చంద్రబాబు సమావేశం.. మధ్యాహ్నం 3గంటలకి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ తో చంద్రబాబు భేటీ.. సాయంత్రం 4 గంటలకి రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో సమావేశం కానున్న ఏపీ సీఎం చంద్రబాబు..
* నేడు మాజీ మంత్రి అంబటి రాంబాబు క్వాష్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ.. నగరం పాలెం పోలీసులు నమోదు చేసిన కేసు క్వాష్ చేయాలని అంబటి పిటిషన్.. కేసులో ఏ5గా ఉన్న అంబటి రాంబాబు..
* నేడు సినీ నటుడు మోహన్ బాబు క్వాష్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ.. తిరుచానూరు పీఎస్ లో నమోదైన కేసు క్వాష్ చేయాలని మోహన్ బాబు పిటిషన్..
* నేడు కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో జ్యోతి స్వరూపార్చన, కోటి దీపోత్సవం, మహా పుష్పయాగం.. శ్రీ వెంకటేశ్వర వైభవం అంశంపై బ్రహ్మశ్రీ మైలవరపు శ్రీనివాసరావు ప్రవచన కార్యక్రమం..
* నేడు తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. 21 కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 12 గంటల సమయం..
* నేడు వరల్డ్ కప్ లో మూడు మ్యాచ్ లు.. ఢిల్లీ వేదికగా ఉదయం 11 గంటలకు నెదర్లాండ్స్ వర్సెస్ నమీబియా.. చెన్నై వేదికగా మధ్యాహ్నం 3 గంటలకు న్యూజిలాండ్ వర్సెస్ యూఏఈ.. కొలంబో వేదికగా రాత్రి 7 గంటలకి పాకిస్తాన్ వర్సెస్ అమెరికా..