గోషామహల్ పోలీస్స్టేషన్ పరిధిలో పోలీసులు భారీ మొత్తంలో నగదు పట్టుకున్నారు. ఫిబ్రవరి 9న సాయంత్రం గోషామహల్ గ్యాన్బాగ్ కాలనీలోని గోకుల్ గోల్డ్ ఎలక్ట్రిక్ ఐటమ్స్ షాప్ సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలపై అనుమానాస్పదంగా సంచులతో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాధారణ తనిఖీల్లో భాగంగా వీరిని ఆపి పరిశీలించగా.. సంచుల్లో భారీగా డబ్బు ఉన్నట్లు బయటపడింది.
Also Read: Hydra: రూ.700 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా!
తనిఖీలో మూడు సంచుల్లో భారీ మొత్తంలో నగదు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మొత్తం నగదు విలువ రూ.76,87,650గా నిర్ధారణైంది. నగదు తరలింపు తీరు అనుమానాస్పదంగా ఉండటంతో పోలీసులు వెంటనే చర్యలు చేపట్టారు. అనుమానితులను జ్యోతిరామ్, గణపతి రామ్, మహేందర్లుగా పోలీసులు గుర్తించారు. ముగ్గురినీ గోషామహల్ పోలీస్స్టేషన్కు తరలించి నగదుపై విచారణ చేపట్టారు. విచారణ సమయంలో అనుమానితులు పొంతనలేని సమాధానాలు ఇవ్వడంతో పాటు నగదుకు సంబంధించిన ఎలాంటి ధ్రువీకరణ పత్రాలను సమర్పించలేకపోయారు. దీంతో నగదును పోలీసులు సీజ్ చేశారు. ఈ ఘటనపై గోషామహల్ ఇన్స్పెక్టర్ స్పందిస్తూ.. స్వాధీనం చేసుకున్న నగదును ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు అప్పగించనున్నట్లు తెలిపారు. అక్రమ నగదు తరలింపులపై కఠిన చర్యలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.