అదే విధంగా వరి ఎక్కువ పండించే రాష్ట్రం ఏదంటే అక్కడ కూడా తెలంగాణనే ముందుంది.. ఈ ఘనత కేసీఆర్ దే అని బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు తెలిపారు. కాంగ్రెస్ కి అధికారం కట్టబెట్టినందుకు గ్రామాల్లో ప్రజలు పశ్చాత్తాప పడుతున్నారు.
గతంలో అన్ని రంగాల్లో అవినీతి రాజ్యం ఏలింది అని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. గతంలో చేసిన తప్పులను రిదిద్దుకుంటూ ఈ ప్రభుత్వం ముందుకు వెళుతుంది తెలిపారు. వర్షాలు సరిగ్గా లేకపోవడం వల్ల ప్రాజెక్ట్ లలో నీళ్లు లేవు.. నాగార్జున సాగర్ లో గేట్లు ఎత్తిన నీళ్ళు రాని పరిస్థితి నెలకొంది.. ఈనాడు మంచి నీళ్లను ప్రక్క రాష్ట్రాల నుంచి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పాడింది.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలో తెలిపిన వివరాలు.. గతంలో మాదిరే నేతన్నలకు అర్డర్లు వేంటనే ఇవ్వాలి అని డిమాండ్ చేశారు.
అంబర్ పేట్ నియోజకవర్గం కాచిగూడ డివిజన్ పర్యటనలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మే 13వ తేదీన తెలంగాణలో లోక్ సభలో ఎన్నికలు జరగనున్నాయి.
రాజ్యసభ సభ్యురాలుగా తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ ప్రమాణస్వీకారం చేశారు. సోనియా గాంధీ చేత ఉప రాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్కడ్ ప్రమాణం స్వీకారం చేయించారు. రాజస్థాన్ రాష్ట్రం నుంచి సోనియా గాంధీ ఏకగ్రీవంగా రాజ్యసభ సభ్యురాలుగా ఎన్నికైన విషయం మనకు తెలిసిందే. ఈ ప్రమాణ స్వీకారంలో భాగంగా సోనియాగాంధీతో పాటు కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, కాంగ్రెస్ కోశాధికారి అజయ్ మాకెన్ లు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. Also read:…
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చందాపూర్ కెమికల్ పరిశ్రమలో పేలుడు వల్ల గాయపడిన వారిని ఎంఎన్ఆర్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతున్న వారిని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు, ఎమ్మెల్యేలు చింత ప్రభాకర్, సునీత లక్ష్మారెడ్డి, మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటరామరెడ్డి పరామర్శించారు.
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ కేసులో కీలక పరిణామం జరిగింది. చంచల్ గూడ జైలు నుంచి HMDA మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ విడుదల అయ్యారు. నాంపల్లి ఏసీబీ కోర్టు షరతులతో కూడిన బెయిల్ ను శివ బాలకృష్ణకు మంజూరు చేసింది.