Lok Sabha Elections: నామినేషన్ పత్రాల్లో లెటెస్ట్ ఫోటోలు పెట్టండి లేదంటే రిజెక్ట్ చేస్తాం.. సీఈసీ సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lok Sabha Elections: తెలంగాణలో ఎంపీ అభ్యర్థులకు ఈసీ శుభవార్త చెప్పింది. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ నామినేషన్లను ఆన్లైన్లో కూడా సమర్పించవచ్చని సీఈసీ వికాస్ రాజ్ తెలిపారు. నామినేషన్ పత్రాల్లో లేటెస్ట్ ఫోటోలు తప్పనిసరిగా పొందుపరచాలని తెలిపారు. లేకుంటే నామినేషన్ పత్రాలను తిరస్కరిస్తామని వికాస్ రాజ్ తెలిపారు. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నామినేషన్ ఫారం, అఫిడవిట్ను జాగ్రత్తగా నింపాలని తెలిపారు. నామినేషన్ పత్రాలు ప్రింట్ తీసి 24 ఏప్రిల్ వరకు ఆర్వోకు అందజేయాలన్నారు.
Read also: Rohit Sharma: ఆ రోజు చాలా భయపడ్డాను: రోహిత్ శర్మ
Also Read
- Rice Procurement : తెలంగాణ రైతులకు కేంద్రం గుడ్ న్యూస్.. బియ్యం కోటా భారీ పెంపు.!
- Bhatti Vikramarka : కేటీఆర్కు 'ఎల్ నినో'పై కనీస అవగాహన లేదు
- Bhatti Vikramarka: రాహుల్ గాంధీ అరెస్టు.. రాజ్యాంగాన్ని అవమానించడమే..!
- CM Revanth: విద్యార్థులపై దాడులు అమానుషం.. నీట్ వ్యవహారంపై కేంద్రంపై సీఎం రేవంత్ ఫైర్..!
జాగ్రత్తగా అఫిడవిట్, నామినేషన్ పత్రాలు పూర్తి చేయాలన్నారు. ఫాం-1లో ప్రదేశం ఎక్కడ రాస్తారో అక్కడి ఆర్వోకి అందజేయాలని సూచించారు. అదే నియోజకవర్గంకు చెందిన 10 మంది ప్రపోజల్స్ సంతకాలు, వివరాలు ఉండాలని తెలిపారు. ఫా-ఏ, ఫాం-బీపై ఒరిజినల్ సంతకాలు ఉండాలని చెప్పారు. అభ్యర్థులు తాజా పాప్ పోర్ట్ సైజ్ 5 ఫోటోలు జత పర్చాలని.. గతంలో బ్యాలెట్ పత్రాల్లో తమ ఫోటో సక్రమంగా ముద్రించలేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. యూనిఫాంతో ఉన్న, క్యాప్, రంగుల కళ్ళజోడుతో ఉన్న ఫోటోలు, పాత ఫోటోలు కాకుండా ఇప్పటి (లేటెస్ట్) ఫోటు ఉండాలని తెలిపారు. పాత ఫోటోలు పెడితే చెల్లవని రిజెక్ట్ చేస్తామని అన్నారు. అభ్యర్థి ఖచ్చితంగా క్రిమినల్ హిస్టరీ పబ్లిష్ చెయ్యాలని చెప్పారు.
Read also: Bengaluru: కూతురి హంతకుడిని చంపిన తల్లి.. బెంగళూర్లో డబుల్ మర్డర్ కలకలం..
అఫిడవిట్ లో ఏ కాలంను ఖాళీగా పెట్టొద్దని, అందుకు సంబంధించిన వివరాలు రాయాల్సి ఉంటుందని వికాస్ రాజ్ వెల్లడించారు. నామినేషన్ పత్రాలు, అఫిడవిట్ల కోసం హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయమని ఆర్వోలను ఆదేశించామని సీఈవో వికాస్ రాజ్ తెలిపారు. 17 నియోజకవర్గాల్లో 42 మంది 48 నామినేషన్లు దాఖలు చేసారు.. 5, 7048 ఈవీఎంలు అందుబాటులో ఉన్నాయి.. 19 ఎన్ ఫోర్స్ మెంట్ ఏజెన్సీలు ఎన్నికల విధుల్లో నిమగ్నమైయ్యాయి. ఇప్పటి వరకు 60 కంపెనీల కేంద్ర బలగాలు వచ్చాయి.. మరో 100 కంపెనీల పోలీసు బలగాలు త్వరలో రాష్టానికి వస్తాయి.. వివిధ రాష్ట్రాల నుంచి 12 వేల మంది పోలీసులు బందోబస్తు కోసం వచ్చారు.. మరో 16 వేల మంది త్వరలో రాష్ట్రానికి వస్తారని తెలంగాణ సీఈవో వికాస్ రాజ్ తెలిపారు.
LSG vs CSK: సొంత ఇలాకాలో లక్నోను చెన్నై సూపర్ కింగ్స్ ఓడిస్తుందా..
తాజావార్తలు
-
Pakistan: మధ్యవర్తిత్వం చేశాం కదా $10 బిలియన్లు ఇవ్వండి.. అమెరికాను కోరిన పాకిస్తాన్..
-
Balakrishna : బాలయ్యకి సర్జరీ.. NBK 111 పరిస్థితి ఏంటి?
-
Rahul Gandhi: 152 సార్లు నీట్ పేపర్ లీకైతే ఒక్కరికీ శిక్ష పడలేదు.. రాహుల్గాంధీ కీలక వ్యాఖ్యలు
-
Gabbar Singh Ramesh: గబ్బర్ సింగ్’ నటుడికి బ్రెయిన్ స్ట్రోక్!
-
MS Dhoni: ఎంఎస్ ధోనీ కొత్త బిజినెస్కు బంపర్ బూస్ట్.. కోట్లలో నిధులు సమీకరణ!
ట్రెండింగ్
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!