ఇండియన్ సినిమాలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ లలో అందాల తార జాన్వీ కపూర్ ఒకరు. కెరీర్ మొదట్లో వరుస ఫ్లాపులు పలకరించినా, ఇప్పుడు మాత్రం పక్కా ప్లానింగ్తో దూసుకుపోతోంది. అయితే, తాజాగా ఆమె తీసుకున్న ఒక నిర్ణయం బాలీవుడ్ వర్గాలను షాక్కి గురిచేస్తోంది. తనను ఇండస్ట్రీకి పరిచయం చేసి, వెన్నంటి నిలిచిన స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్కు జాన్వీ షాకిచ్చింది. ఆయనకు చెందిన ‘ధర్మ ప్రొడక్షన్స్’ టాలెంట్ మేనేజ్మెంట్ నుండి బయటకు వచ్చేసి, సొంతంగా తన కెరీర్ నిర్ణయాలు తీసుకోవాలని ఫిక్స్ అయ్యింది.
Also Read : Nagarjuna : 27 ఏళ్ల తర్వాత ‘నిన్నే పెళ్లాడుతా’ జోడీ రిపీట్!
ఇన్నాళ్లూ జాన్వీ ఏ సినిమా చేయాలన్నా, ఏ బ్రాండ్కు ప్రచారం చేయాలన్నా కరణ్ జోహార్ కనుసన్నల్లోనే జరిగేది. దీనివల్ల ఆమెపై ‘నెపో కిడ్’ అనే ముద్ర బలంగా పడింది. ఈ విమర్శల నుండి బయటపడటానికే జాన్వీ ఇప్పుడు ‘కలెక్టివ్ ఆర్టిస్ట్ నెట్వర్క్’ అనే కొత్త సంస్థతో ఒప్పందం కుదుర్చుకుందట. తన తల్లి శ్రీదేవి అప్పట్లో ఎలాగైతే స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుని స్టార్డమ్ సంపాదించుకున్నారో, ఇప్పుడు జాన్వీ కూడా అదే రూటులో వెళ్తోంది. కరణ్ నీడ నుండి బయటకు వచ్చి, తన టాలెంట్తోనే అవకాశాలు దక్కించుకోవాలని ఆమె గట్టిగా నిశ్చయించుకుంది.
ప్రస్తుతం జాన్వీ ఫోకస్ మొత్తం టాలీవుడ్ సౌత్ సినిమాలపైనే ఉంది. ‘దేవర’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ఈ బ్యూటీ, ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సరసన ‘పెద్ది’లో నటిస్తోంది. అంతేకాదు, అల్లు అర్జున్-అట్లీ కాంబినేషన్లో రాబోయే భారీ ప్రాజెక్ట్లోనూ జాన్వీ పేరు దాదాపు ఖరారైనట్లు సమాచారం. బాలీవుడ్ మేనేజ్మెంట్కు గుడ్ బై చెప్పి, సౌత్ ప్యాన్ ఇండియా ప్రాజెక్టులతో తన కెరీర్ గ్రాఫ్ను నెక్స్ట్ లెవల్కు తీసుకెళ్లాలని జాన్వీ వేస్తున్న ఈ స్కెచ్ చూసి అంతా షాక్ అవుతున్నారు.