ఉప్పల్ నియోజవర్గం కాప్రాలోని సాయిబాబా కాలనీలో జరిగిన కార్నర్ మీటింగ్ లో కాంగ్రెస్ పార్టీ మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి పట్నం సునీతా మహేందర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఎన్నికల ప్రచార పర్వం తుది అంకానికి చేరుకుంది. ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి ప్రచార పర్వానికి ఫుల్ స్టాప్ పడుతుంది. మైకులు బంద్ కాబోతున్నాయి. సుధీర్ఘంగా సాగిన ప్రచారానికి తెరపడబోతోంది. పార్టీలకు మిగిలింది కొన్ని గంటలే. ఈ సమయాన్ని పక్కాగా ఉపయోగించుకుని ఓటర్లను ఆకర్షించేందుకు వ్యూహ రచన చేస్తున్నాయి. చివరిరోజు అగ్రనేతల ప్రచారాలతో హోరెత్తించనున్నాయి.
సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మరావు గౌడ్ పార్టీ కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కావడంతో భారీ ర్యాలీతో అదరగొట్టారు.
Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్కు మరికొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉంది. నేటితో ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. మే 11వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఎన్నికల ప్రచారం ముగియనుంది.
PM Modi: ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫలితాలపై ప్రధాని నరేంద్రమోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సారి తెలంగాణలో బీజేపీ అన్ని పార్లమెంట్ స్థానాలను క్లీన్స్వీప్ చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 80-90లో గుజరాత్ రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్ ఎలా పెరిగిందో అదే విధంగా తెలంగాణలో కూడా జరుగుతోందని ప్రధాని అన్నారు. తెలంగాణలో బీజేపీ ఎక్కువ సీట్లు గెలుస్తుందని అన్నారు. ఇక్కడ ప్రజలు తక్కువ సయమంలోనే ప్రజలు నిరాశలో పడిపోయారని అన్నారు.…
తెలుగు న్యూస్ ఛానెళ్ల చరిత్రలోనే తొలిసారిగా ప్రధాని మోడీని ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేస్తోంది ఎన్టీవీ.. తన మనసులోని మాటను మోడీ ఎన్టీవీతో పంచుకున్నారు.. వచ్చే ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి.. తెలంగాణలో బీజేపీ హవా కొనసాగుతుందా? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ రాజకీయాలకు సంబంధించిన ఎన్నో అంశాలపై స్పందించిన ప్రధాని నరేంద్ర మోడీ..
నేటి రాత్రి 8 గంటలకు ప్రధాని ఎన్టీవీకి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఇవ్వనున్నారు ప్రధాని మోడీ. ఇదే విషయాన్ని ప్రధాని మోడీ స్వయంగా తన ఎక్స్(గతంలో ట్విట్టర్) అకౌంట్ ద్వారా పంచుకున్నారు.
Bandi Sanjay: నీ గడీలు బద్దలు కొట్టిం..నీ మెడలు వంచి..నీ ప్రభుత్వాన్ని గద్దె దించి.. నిన్ను ఫామ్ హౌస్ నుంచి గుంజుకొచ్చి ధర్నా చౌక్ వద్ద నిలబెట్టింది నేనే అంటూ కేసీఆర్ పై కరీంనగర్ ఎంపీ, బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.