Donald Trump: మిత్రదేశాలపై ట్రంప్ ఆగ్రహం.. ‘మీరు పిరికివారు’ అంటూ విమర్శ..
- మిత్ర దేశాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్..
- హర్మూజ్ జలసంధిని తెరిపించేందుకు ముందుకు రండి..
- ఆకాశాన్ని తాకుతున్న నిత్యావసర వస్తువులు..
ఇరాన్తో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో.. సముద్ర మార్గాలను కాపాడేందుకు సైనిక సాయం అందించని దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా మండిపడ్డారు. అమెరికాకు మిత్రులుగా ఉన్న దేశాలను ఆయన ‘పిరికివారు’ అని సంబోధించారు. ‘మిమ్మల్ని మేము గుర్తుపెట్టుకుంటాం’ అంటూ తన సోషల్ మీడియా వేదికగా హెచ్చరించారు.
ట్రంప్ వాదన ఏమిటి..?
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
చమురు (ఆయిల్) ధరలు పెరిగిపోతున్నాయని అందరూ ఫిర్యాదు చేస్తున్నారని.. కానీ హర్మూజ్ జలసంధిని తెరిపించడానికి మాత్రం ఎవరూ ముందుకు రావడం లేదని ట్రంప్ విమర్శించారు. అమెరికా గతంలో ఎన్నో దేశాలకు సహాయం చేసిందని, ఇప్పుడు ఆ దేశాలు తమ స్వార్థం కోసమైనా ఇరాన్ను అడ్డుకోవడానికి సహకరించాలని ఆయన కోరారు.
యుద్ధం మొదలవ్వకముందు 70 డాలర్లు ఉన్న ఆయిల్ ధర, ఇప్పుడు 108 డాలర్లకు చేరుకుంది. ఇంధన ధరలు పెరగడంతో ఆహార వస్తువులు, నిత్యావసరాల ధరలు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి. హర్మూజ్ మార్గం గుండానే ఎక్కువ చమురు సరఫరా అవుతుంది కాబట్టి.. మనలాంటి ఆసియా దేశాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. కంప్యూటర్ చిప్స్ తయారీకి వాడే హీలియం, ఎరువుల తయారీకి వాడే సల్ఫర్ వంటి వాటికి కూడా కొరత ఏర్పడే ప్రమాదం ఉంది.
మరోవైపు బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, జపాన్ దేశాలు ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. సముద్ర మార్గాల్లో ప్రయాణాలు సురక్షితంగా సాగేందుకు తాము కృషి చేస్తామని చెప్పాయి. ఇరాన్ చేస్తున్న దాడులను, సముద్రంలో మైన్లు వేయడాన్ని ఈ దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఇరాన్ యుద్ధం మొదలై 21 రోజులు అవుతోంది. ప్రస్తుతం ఆ సముద్ర మార్గం దాదాపు మూతపడింది. ఇప్పటివరకు దాదాపు 23 ఓడలపై దాడులు జరిగినట్లు సమాచారం.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!