మంత్రి పొన్నం మాట్లాడుతూ.. అందరికీ భోగి, మకర సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సీజన్ లో కూడా మంచి పుష్కలమైన వర్షాలు పడి ఆయుఆరోగ్యాలతో పాడి పంటలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో తెలంగాణ సమాజం బాగుండాలని రాజన్న స్వామిని మొక్కుకున్న.. రైతంగా బాగుంటేనే అందరూ బాగుంటారు.. దక్షిణ కాశీ వేములవాడ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే పలు కార్యక్రమాలను ప్రారంభించారు.
బీర్లకు, బార్లలో ఖర్చు చేస్తున్నారు.. కానీ ప్రాణానికి రక్షణనిచ్చే హెల్మెట్ కోసం మాత్రం ఖర్చు చేయడం లేదని వాపోయారు. జిల్లాలో గత ఏడాదిలో 213 మంది చనిపోయారు.. మనతో పాటు మనల్ని నమ్ముకున్న వాళ్లు ఉంటారు.. అందుకే రోడ్డు భద్రత ప్రతి ఒక్కరు పాటించాలని మంత్రి సీతక్క తెలిపారు.
Road Accident: పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో విషాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని కారు ఢీ కొట్టడంతో ఒకే కుటుంబంలోని ఇద్దరు తండ్రి, కొడుకు మృతి చెందారు. హైదరాబాద్ నుంచి గోదావరిఖనికి వస్తుండగా గాంధీ నగర్ లో ప్రమాదం జరిగింది.
ఇందిరమ్మ ఇళ్లు అంటేనే కాంగ్రెస్ గుర్తుకు వస్తోంది అని ఆయన తెలిపారు. ఇక, ధనిక రాష్ట్రాన్ని గత ప్రభుత్వం కొల్ల కొట్టింది అని ఆరోపించారు. పేదవాడు ఇబ్బందులు పడవద్దని ఇందిరమ్మ ప్రభుత్వ ఆలోచన.. అందుకే ఇందిరమ్మ ఇళ్ల మీద ప్రభుత్వం శ్రద్ధ చూపిస్తుందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు.
Kaushik Reddy: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డికి పోలీసులు షాక్ ఇచ్చారు. ఆయనపై మూడు కేసులు నమోదు చేశారు. పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
Bhogi Festival: తెలుగు ప్రజలు జరుపుకొనే అతి పెద్ద పండుగ సంక్రాంతి.. ముఖ్యంగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంత వాసులు ఈ పండుగను నాలుగు రోజుల పాటు చేసుకుంటారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజునే మకర సంక్రాంతిగా జరుపుతారు.
స్టడీస్ కంప్లీట్ అయిన తర్వాత ఉద్యోగ వేటలో పడిపోతుంటారు యువతీ యువకులు. ప్రభుత్వ, ప్రైవేట్ సెక్టార్ లలో జాబ్స్ కోసం తెగ ట్రై చేస్తుంటారు. అయితే ప్రైవేట్ జాబ్స్ గాల్లో దీపాల్లాగా మారుతున్న తరుణంలో ప్రభుత్వ ఉద్యోగాలకు డిమాండ్ పెరిగింది. వందల్లో పోస్టులుంటే లక్షల్లో పోటీపడుతున్నారు. చిన్న జాబ్ అయినా సరే గవర్నమెంట్ జాబ్ కావాలని ప్రయత్నిస్తున్నారు. మరి మీరు కూడా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారా? మీరు టెన్త్ పాసై ఖాళీగా ఉన్నారా? అయితే…
Republic Day : న్యూఢిల్లీలోని కర్తవ్య పథ్లో జరిగే గణతంత్ర దినోత్సవ పరేడ్కు తెలంగాణ రాష్ట్రం నుండి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా 41 మందిని ఆహ్వానించింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందిన వ్యక్తులను ఎంపిక చేసి, వారికి ఈ ఘనతను అందించింది. వీరు వివిధ రంగాలలో తమ ప్రతిభను చాటుకున్నారు మరియు ప్రభుత్వ పథకాలను సమర్థంగా ఉపయోగించుకున్నారు. ఈ ప్రత్యేక అతిథుల ఎంపికతో గణతంత్ర దినోత్సవంలో తెలంగాణకు…