Road Accident: ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన కారు.. ఇద్దరు మృతి
- పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో రోడ్డు ప్రమాదం..
- ఆగి ఉన్న లారీని కారు ఢీ కొట్టడంతో ఇద్దరు మృతి..
- ప్రమాదంలో గాయపడిన వారిని కరీంనగర్ లోని ఆస్పత్రికి తరలింపు..
Road Accident: పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో విషాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని కారు ఢీ కొట్టడంతో ఒకే కుటుంబంలోని ఇద్దరు తండ్రి, కొడుకు మృతి చెందారు. హైదరాబాద్ నుంచి గోదావరిఖనికి వస్తుండగా గాంధీ నగర్ లో ప్రమాదం జరిగింది. సతీష్ అనే సింగరేణి కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందగా చికిత్స పొందుతూ అతని 11 నెలల కుమారుడు సాత్విక్ కూడా చనిపోయాడు. ప్రమాదంలో గాయపడిన కుటుంబ సభ్యులను మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ కార్పొరేట్ ఆసుపత్రికి తరలించారు.
Read Also: Sai Pallavi: ఆ స్టార్ హీరోని రిజెక్ట్ చేసిన సాయి పల్లవి
Also Read
అయితే, బాధితులు గోదావరి ఖనిలోని హనుమాన్ నగర్ కు చెందిన సతీశ్, సాత్విక్ గా గుర్తించారు. సతీశ్ భార్య, అక్క, బావలు తీవ్రంగా గాయపడ్డారు. వారికి కరీంనగర్ లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ఇక, సంఘటన ప్రదేశానికి చేరుకున్న పోలీసులు.. ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు పోలీసులు..
తాజావార్తలు
-
Air Cooler: రోజుకు 8 గంటలు కూలర్ ఆన్లో ఉంటే ఎంత బిల్లు వస్తుందో తెలుసా?
-
Jabalpur Boat Tragedy: “లైఫ్ జాకెట్” ఉన్నా తల్లి బిడ్డ ఎలా మరణించారు.?
-
Unusual Weather : తెలుగు రాష్ట్రాల్లో భిన్నవాతావరణం… పగలు సెగలు..సాయంత్రం జల్లులు
-
SRH vs KKR IPL 2026: అరుదైన రికార్డు సాధించిన సునీల్ నరైన్.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ఆటగాడిగా..
-
Donald Trump: జర్మనీకి డబుల్ షాక్ ఇచ్చిన ట్రంప్..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!