TG High Court Jobs: 10th పాసైతే చాలు.. హైకోర్టులో జాబ్స్ మీకోసమే.. కొడితే లైఫ్ సెట్ అయిపోద్ది!
- తెలంగాణ హైకోర్టులో 1673 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్
- టెన్త్, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులైన వారు అప్లై చేసుకోవచ్చు
- దరఖాస్తుకు చివరి తేదీ జనవరి 31 2025
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టడీస్ కంప్లీట్ అయిన తర్వాత ఉద్యోగ వేటలో పడిపోతుంటారు యువతీ యువకులు. ప్రభుత్వ, ప్రైవేట్ సెక్టార్ లలో జాబ్స్ కోసం తెగ ట్రై చేస్తుంటారు. అయితే ప్రైవేట్ జాబ్స్ గాల్లో దీపాల్లాగా మారుతున్న తరుణంలో ప్రభుత్వ ఉద్యోగాలకు డిమాండ్ పెరిగింది. వందల్లో పోస్టులుంటే లక్షల్లో పోటీపడుతున్నారు. చిన్న జాబ్ అయినా సరే గవర్నమెంట్ జాబ్ కావాలని ప్రయత్నిస్తున్నారు. మరి మీరు కూడా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారా? మీరు టెన్త్ పాసై ఖాళీగా ఉన్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో ఉద్యోగాలు రెడీగా ఉన్నాయి. ఈ జాబ్స్ ను సాధిస్తే లైఫ్ లో సెటిల్ అయిపోవచ్చు.
రీసెంట్ గా తెలంగాణ హైకోర్ట్ జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 1673 పోస్టులను భర్తీ చేయనున్నది. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, అసిస్టెంట్, ఎగ్జామినర్, టైపిస్ట్, ఆఫీస్ సబార్డినేట్, కంప్యూటర్ అపరేటర్, సిస్టమ్ అనలిస్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. భర్తీకానున్న పోస్టుల్లో 1277 టెక్నికల్ పోస్టులు, 184 నాన్-టెక్నికల్ పోస్టులు, తెలంగాణ జ్యుడీషియల్ మినిస్టీరియల్ పోస్టులు, సబార్డినేట్ సర్వీస్ కింద 212 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు పోటీ పడే అభ్యర్థులు టెన్త్, ఇంటర్, డిగ్రీ పాసై ఉండాలి. దీనితో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
Also Read
- TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
- TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
- SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
- Police Recruitment: పోలీస్ ఉద్యోగాల దరఖాస్తు గడువు పెంపు.. ఎస్సై, కానిస్టేబుల్ జీతాల వివరాలు వెల్లడి..
అభ్యర్థుల వయసు 18-34 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడీబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్ల వరకు గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. సీబీటీ టెస్ట్, స్కిల్ టెస్ట్, మెరిట్ లిస్ట్, షార్ట్ హ్యాండ్ ఇంగ్లీష్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ.600 చెల్లించాలి. ఎస్టీ/ ఎస్సీ/ ఈడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీస్మెన్, పీడబ్ల్యూబీడీఎస్ అభ్యర్థులకు రూ.400గా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి ఉన్నవారు జనవరి 31 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం tshc.gov.in వెబ్ సైట్ ను సందర్శించాల్సి ఉంటుంది.
తాజావార్తలు
-
CM Chandrababu : వచ్చే కాన్ఫరెన్స్ నాటికి 100 శాతం కనెక్టివిటీ ఉండాల్సిందే
-
China: షిప్యార్డులో భారీ అగ్నిప్రమాదం.. విదేశీ కార్గో నౌకలో 20 మంది మృతి
-
Karnataka: ఇకపై వందేమాతరంలో రెండు చరణాలే పాడండి.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
-
CM Chandrababu : కలెక్టర్లకు చంద్రబాబు బిగ్ టార్గెట్.. న్యూ ఏజ్ గవర్నెన్స్పై ఫోకస్
-
Trump Freebie Politics: ట్రంప్ ‘‘ఉచితాలు’’.. భారత ఎన్నికల నుంచి పాఠాలు.?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్లో 350 పరుగులు.. తొలి బ్యాటర్గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?