మేడారంలో తెలంగాణ కేబినెట్ భేటీ అయ్యింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో పాలనాపరమైన సంస్కరణలు , స్థానిక సంస్థల బలోపేతం లక్ష్యంగా ఈ కేబినెట్ భేటీలో మున్సిపల్ ఎన్నికలు , జిల్లాల పునర్విభజన వంటి అంశాలపై స్పష్టతనిచ్చింది. రాష్ట్రంలో గడువు ముగిసిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించేందుకు కేబినెట్ పచ్చజెండా ఊపింది. వస్తున్న ఫిబ్రవరి మాసంలోనే ఈ ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.…
సింగరేణి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కొంతమంది అసత్య ప్రచారం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. సింగరేణిలో కుంభకోణం జరిగిందని, బొగ్గు మాయమైందని కొన్ని పత్రికల్లో ప్రచారం చేస్తున్నారని.. కాంగ్రెస్ ప్రభుత్వంలో అవకతవకలకు తావులేదన్నారు. సింగరేణి టెండర్లను అనుభవం ఉన్నవారికే ఇస్తాం అని, ఈ విషయంలో అణా పైసా కూడా అవినీతికి ఆస్కారం లేదని స్పష్టం చేశారు. తమ రెండేళ్ల పాలనలో ఎలాంటి అవకతవకలకు అవకాశం ఇవ్వలేదని సీఎం రేవంత్ చెప్పుకొచ్చారు. ఖమ్మంలో రూ.362 కోట్ల విలువైన…
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం మహా జాతర మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతోంది. మొక్కితే వరాలిచ్చే వనదేవతలైన సమ్మక్క సారక్కలను దర్శించుకునేందుకు భక్తులు ఇప్పటికే మేడారానికి క్యూ కట్టారు. మరి మీరు కూడా రేపు మేడారానికి వెళ్లడానికి ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ విషయం మీకోసమే.. రేపు ఎల్లుండి మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మేడారంలో రేపు క్యాబినెట్ మీటింగ్ కి ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ఎల్లుండి పునర్నిర్మాణం చేసిన వన…
తెలంగాణలో భారీగా ఐపీఎస్ ల బదిలీలు చేపట్టింది ప్రభుత్వం. ఏకంగా 20మంది ఐపీఎస్ లను బదిలీ చేసి పోస్టింగ్స్ ఇచ్చింది. డా. గజరావు భూపాల్ (IPS 2008) సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ నుంచి బదిలీ అయి ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ – ప్రొవిజనింగ్ & లాజిస్టిక్స్గా నియామకం అయ్యారు. అదనంగా IG – స్పోర్ట్స్ & వెల్ఫేర్ ఇన్చార్జ్ గా నియమితులయ్యారు. అభిషేక్ మొహంతీ (IPS 2011) నార్కోటిక్స్ బ్యూరో DIG నుంచి, విజిలెన్స్…
మహబూబ్నగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. చిట్టిబోయినపల్లిలో ట్రిపుల్ ఐటీకి శంకుస్థాపన చేశారు.. ఇరిగేషన్, ఎడ్యుకేషన్కు మా ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తుందని సీఎం రేవంత్ తెలిపారు. భారత తొలి ప్రధాని నెహ్రూ సాగునీటి ప్రాజెక్టులు, విద్యకే తొలి ప్రాధాన్యత ఇచ్చారని, తమ ప్రభుత్వం కూడా వాటికే ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులతో సీఎం రేవంత్రెడ్డి ముఖాముఖి నిర్వహించారు. Also Read:CM Revanth Reddy: మహబూబ్ నగర్ పై సీఎం రేవంత్…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో రూ.1284 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మహబూబ్ నగర్ నగర పాలక సంస్థ పరిధిలో ఎం.వి.ఎస్ డిగ్రీ,పి.జి కళాశాలలో రూ.200 కోట్లతో మహబూబ్ నగర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేయనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలకు శంకుస్థాపన చేశారు. రూ.20.50 కోట్లతో ఎం. వి.ఎస్.డిగ్రీ కళాశాల అదనపు తరగతి గదులకు శంకు స్థాపన చేశారు. Also…
Return Rush to Hyderabad: సంక్రాంతి సెలవులు ముగియడంతో ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ వైపు తిరుగు ప్రయాణాలు ఊపందుకున్నాయి. తెలంగాణ నుంచి సంక్రాంతి పండుగ కోసం ఏపీకి వచ్చినవారు తిరిగి తమ ఉద్యోగాలు, విధులు నిర్వహించేందుకు హైదరాబాద్కు బయల్దేరడంతో జాతీయ రహదారులపై తీవ్ర వాహన రద్దీ నెలకొంది. విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ స్పష్టంగా కనిపిస్తోంది. విశాఖపట్నం నుంచి కాకినాడ, రాజమండ్రి, ఏలూరు, బెజవాడ, గుంటూరు తదితర ప్రాంతాల నుంచి భారీగా వాహనాలు బయల్దేరడంతో టోల్…