CM Revanth Reddy: బొగ్గు మాయమైందని ప్రచారం చేస్తున్నారు.. మా ప్రభుత్వంలో అవకతవకలకు తావులేదు!
- సింగరేణిలో బొగ్గంతా మాయమైందని కొన్ని పత్రికలు రాస్తున్నాయి
- మా ప్రభుత్వంలో అలాంటి అవకతవకలకు తావుండదు
- మా మంత్రులపై తప్పుడు ప్రచారం చేసి బద్నామ్ చేయకండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సింగరేణి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కొంతమంది అసత్య ప్రచారం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. సింగరేణిలో కుంభకోణం జరిగిందని, బొగ్గు మాయమైందని కొన్ని పత్రికల్లో ప్రచారం చేస్తున్నారని.. కాంగ్రెస్ ప్రభుత్వంలో అవకతవకలకు తావులేదన్నారు. సింగరేణి టెండర్లను అనుభవం ఉన్నవారికే ఇస్తాం అని, ఈ విషయంలో అణా పైసా కూడా అవినీతికి ఆస్కారం లేదని స్పష్టం చేశారు. తమ రెండేళ్ల పాలనలో ఎలాంటి అవకతవకలకు అవకాశం ఇవ్వలేదని సీఎం రేవంత్ చెప్పుకొచ్చారు. ఖమ్మంలో రూ.362 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు.
Also Read: T20 World Cup: భారత్లో ఆడటంపై బంగ్లాదేశ్ కీలక ప్రతిపాదన.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన ఐర్లాండ్..
Also Read
- Lakshadweep: ప్రధాని మోడీ "కుర్చీ మడత పెడితే" ఎలా ఉంటుందో తెలుసా.. లక్షదీవులే సాక్ష్యం..
- Iran: ప్రపంచ దేశాలకు ఇరాన్ కొత్త వార్నింగ్.. భారత్కు ముప్పు తప్పదా?
- IPL 2026: ఐపీఎల్ అరంగేట్రంలోనే అదరగొట్టిన తెలుగు కుర్రాడు.. మంత్రి ప్రశంసలు..
- Eating on Banana Leaves: అరిటాకులో భోజనం.. సంప్రదాయం వెనుక దాగి ఉన్న అద్భుత ఆరోగ్య రహస్యాలు..!
‘సింగరేణిలో కుంభకోణం జరిగింది, బొగ్గు మాయమైందని కొన్ని పత్రికల్లో ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రభుత్వంలో అవకతవకలకు తావులేదు. సింగరేణి టెండర్లను అనుభవం ఉన్నవారికే ఇస్తాము. ఈ విషయంలో అణా పైసా కూడా అవినీతికి ఆస్కారం లేదు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ఎలాంటి అవకతవకలకు అవకాశం ఇవ్వలేదు. తప్పుడు ప్రచారాలతో అపోహలు సృష్టించి మారీచుడు, సుబాహుడు బలపడేందుకు సహకరిస్తున్నారు. మీకు మీకు మీడియా పంచాయితీలు ఉంటే తలుపులు వేసుకొని కొట్టుకోండి. అంతేకానీ అందులోకి మమ్మల్ని లాగొద్దు. మంత్రులను బద్నాం చేయొద్దు. మా మంత్రులపై వార్తలు రాసేముందు నా దగ్గర వివరణ తీసుకోండి. మీడియాకు వివరాలు ఇచ్చేందుకు 24 గంటలు అందుబాటులో ఉంటా. మా మంత్రులపై వార్తలు వస్తే నా గౌరవానికి భంగం కలుగుతుంది. నా నాయకత్వం పట్ల అపోహలు సృష్టిస్తుంది. ఇలాంటి విషయాల్లో ఎలాంటి కాంప్రమైజ్ లేదు’ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
తాజావార్తలు
-
Lakshadweep: ప్రధాని మోడీ “కుర్చీ మడత పెడితే” ఎలా ఉంటుందో తెలుసా.. లక్షదీవులే సాక్ష్యం..
-
Iran: ప్రపంచ దేశాలకు ఇరాన్ కొత్త వార్నింగ్.. భారత్కు ముప్పు తప్పదా?
-
IPL 2026: ఐపీఎల్ అరంగేట్రంలోనే అదరగొట్టిన తెలుగు కుర్రాడు.. మంత్రి ప్రశంసలు..
-
Eating on Banana Leaves: అరిటాకులో భోజనం.. సంప్రదాయం వెనుక దాగి ఉన్న అద్భుత ఆరోగ్య రహస్యాలు..!
-
Cancer Injection: భారత్లో 7 నిమిషాల్లో క్యాన్సర్ ఇంజెక్షన్.. కానీ ధర వింటే షాక్.
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!