Return Rush to Hyderabad: హైదరాబాద్కు తిరుగు ప్రయాణాలు.. రద్దీగా మారిన హైవేలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Return Rush to Hyderabad: సంక్రాంతి సెలవులు ముగియడంతో ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ వైపు తిరుగు ప్రయాణాలు ఊపందుకున్నాయి. తెలంగాణ నుంచి సంక్రాంతి పండుగ కోసం ఏపీకి వచ్చినవారు తిరిగి తమ ఉద్యోగాలు, విధులు నిర్వహించేందుకు హైదరాబాద్కు బయల్దేరడంతో జాతీయ రహదారులపై తీవ్ర వాహన రద్దీ నెలకొంది. విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ స్పష్టంగా కనిపిస్తోంది. విశాఖపట్నం నుంచి కాకినాడ, రాజమండ్రి, ఏలూరు, బెజవాడ, గుంటూరు తదితర ప్రాంతాల నుంచి భారీగా వాహనాలు బయల్దేరడంతో టోల్ ప్లాజాల వద్ద కార్లు బారులు తీరాయి. గన్నవరం సమీపంలోని కలపర్రు, గొట్టిపాడు టోల్ ప్లాజాలు, నందిగామ వద్ద కేసర, జగ్గయ్యపేట పరిధిలోని చిలకలు టోల్ ప్లాజాల వద్ద తీవ్ర రద్దీ కొనసాగుతోంది.
Read Also: Deputy CM Pawan Kalyan: చారిత్రాత్మక ఒప్పందానికి ఏపీ వేదిక అయింది.. కాకినాడని ఎంచుకోవడం సంతోషం..
Also Read
- FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు 'ఛాంపియన్షిప్ రింగ్స్'..
- Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
- Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
- Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
నాలుగు రోజుల క్రితం కూడా తెలంగాణ నుంచి ఏపీకి సుమారు 80 వేలకుపైగా వాహనాలు రావడంతో ఇదే రకమైన ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. ఇప్పుడు సెలవులు పూర్తవడంతో అందరూ తిరిగి హైదరాబాద్ వైపు ప్రయాణం చేయడంతో పరిస్థితి మరింత తీవ్రమైంది. ఈ వాహన రద్దీ ఇవాళతో పాటు రేపు కూడా కొనసాగే అవకాశాలు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ పరిధిలోని అంబారుపేట వై జంక్షన్ వద్ద భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దాదాపు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు ఫ్లైఓవర్పై వాహనాలకు అనుమతి ఇచ్చి ట్రాఫిక్ను మళ్లిస్తున్నారు.
ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గించేందుకు బెజవాడ నగరంలో పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. నగరంలోకి వాహనాలు రాకుండా వెస్ట్ బైపాస్ మీదుగా హైదరాబాద్కు వెళ్లే వాహనాలకు అనుమతి ఇచ్చారు. దీంతో బెజవాడలో ట్రాఫిక్ సజావుగా కొనసాగుతోంది. సంక్రాంతి పండుగను పల్లెల్లో ఆనందంగా జరుపుకున్న ఆంధ్ర ప్రాంత ప్రజలు, ఇప్పుడు తిరిగి పట్నం బాట పట్టారు. ఇవాళ ఎక్కువగా వాహనాలు హైదరాబాద్కు వెళ్తున్నాయని అధికారులు తెలిపారు. రేపు కూడా కొంతమేర ట్రాఫిక్ కొనసాగే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రయాణికులు సహనంతో వ్యవహరించాలని, ట్రాఫిక్ సూచనలను పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?