Return Rush to Hyderabad: హైదరాబాద్కు తిరుగు ప్రయాణాలు.. రద్దీగా మారిన హైవేలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Return Rush to Hyderabad: సంక్రాంతి సెలవులు ముగియడంతో ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ వైపు తిరుగు ప్రయాణాలు ఊపందుకున్నాయి. తెలంగాణ నుంచి సంక్రాంతి పండుగ కోసం ఏపీకి వచ్చినవారు తిరిగి తమ ఉద్యోగాలు, విధులు నిర్వహించేందుకు హైదరాబాద్కు బయల్దేరడంతో జాతీయ రహదారులపై తీవ్ర వాహన రద్దీ నెలకొంది. విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ స్పష్టంగా కనిపిస్తోంది. విశాఖపట్నం నుంచి కాకినాడ, రాజమండ్రి, ఏలూరు, బెజవాడ, గుంటూరు తదితర ప్రాంతాల నుంచి భారీగా వాహనాలు బయల్దేరడంతో టోల్ ప్లాజాల వద్ద కార్లు బారులు తీరాయి. గన్నవరం సమీపంలోని కలపర్రు, గొట్టిపాడు టోల్ ప్లాజాలు, నందిగామ వద్ద కేసర, జగ్గయ్యపేట పరిధిలోని చిలకలు టోల్ ప్లాజాల వద్ద తీవ్ర రద్దీ కొనసాగుతోంది.
Read Also: Deputy CM Pawan Kalyan: చారిత్రాత్మక ఒప్పందానికి ఏపీ వేదిక అయింది.. కాకినాడని ఎంచుకోవడం సంతోషం..
Also Read
- Trump China Visit: చైనాను అస్సలు నమ్మని ట్రంప్.. చెత్త బుట్టలోకి చైనీస్ గిఫ్ట్స్..
- YS Jagan: కూటమి ప్రభుత్వ పనితీరుపై జగన్ ఆసక్తికర ట్వీట్
- PM Modi: ప్రపంచం కొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది.. భారత్ విశ్వసనీయ వారధి అన్న మోడీ
- Dhurandhar 2: బ్యాన్ చేసిన దేశంలో బ్లాక్బస్టర్.. దాయాది దేశంలో ‘‘ధురంధర్ 2’’ క్రేజ్..
నాలుగు రోజుల క్రితం కూడా తెలంగాణ నుంచి ఏపీకి సుమారు 80 వేలకుపైగా వాహనాలు రావడంతో ఇదే రకమైన ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. ఇప్పుడు సెలవులు పూర్తవడంతో అందరూ తిరిగి హైదరాబాద్ వైపు ప్రయాణం చేయడంతో పరిస్థితి మరింత తీవ్రమైంది. ఈ వాహన రద్దీ ఇవాళతో పాటు రేపు కూడా కొనసాగే అవకాశాలు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ పరిధిలోని అంబారుపేట వై జంక్షన్ వద్ద భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దాదాపు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు ఫ్లైఓవర్పై వాహనాలకు అనుమతి ఇచ్చి ట్రాఫిక్ను మళ్లిస్తున్నారు.
ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గించేందుకు బెజవాడ నగరంలో పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. నగరంలోకి వాహనాలు రాకుండా వెస్ట్ బైపాస్ మీదుగా హైదరాబాద్కు వెళ్లే వాహనాలకు అనుమతి ఇచ్చారు. దీంతో బెజవాడలో ట్రాఫిక్ సజావుగా కొనసాగుతోంది. సంక్రాంతి పండుగను పల్లెల్లో ఆనందంగా జరుపుకున్న ఆంధ్ర ప్రాంత ప్రజలు, ఇప్పుడు తిరిగి పట్నం బాట పట్టారు. ఇవాళ ఎక్కువగా వాహనాలు హైదరాబాద్కు వెళ్తున్నాయని అధికారులు తెలిపారు. రేపు కూడా కొంతమేర ట్రాఫిక్ కొనసాగే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రయాణికులు సహనంతో వ్యవహరించాలని, ట్రాఫిక్ సూచనలను పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Jayam Ravi: 14 ఏళ్లు బానిసలా బతికా.. నాపై క్షుద్ర పూజలు.. ఆ ‘ఇడ్లీ నటి’ వల్లే నా బతుకు ఇలా.. జయం రవి కన్నీరు
-
Trump China Visit: చైనాను అస్సలు నమ్మని ట్రంప్.. చెత్త బుట్టలోకి చైనీస్ గిఫ్ట్స్..
-
YS Jagan: కూటమి ప్రభుత్వ పనితీరుపై జగన్ ఆసక్తికర ట్వీట్
-
NEET Paper Leak: పేపర్ సెట్ చేసినవారే లీక్ చేశారు.. NEET స్కాంలో మరో టీచర్ అరెస్ట్..
-
Peddi: పెద్ది ట్రైలర్’పై చిరు రివ్యూ.. డైలాగ్ లీక్
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..