లిక్కర్ కేసులో ఆ ముగ్గురికి బిగ్ రిలీఫ్.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డిలకు సుప్రీంకోర్టు పెద్ద ఊరట కల్పించింది. వీరి అరెస్టు నుంచి ఇప్పటివరకు ఉన్న రక్షణను సుప్రీంకోర్టు పొడిగించింది. అయితే, ఈ ముగ్గురు రెగ్యులర్ బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ట్రయల్ కోర్టులో…
మూడో రోజు దావోస్ టూర్.. నేడు సీఎం చంద్రబాబు కీలక సమావేశాలు.. స్విట్జర్లాండ్ దావోస్లో జరుగుతున్న ప్రతిష్టాత్మక వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వరుసగా మూడో రోజూ కీలక సమావేశాల్లో పాల్గొననున్నారు. ప్రపంచ స్థాయి పారిశ్రామికవేత్తలు, ప్రముఖ కంపెనీల సీఈఓలతో సీఎం ముఖాముఖి భేటీలు నిర్వహించనున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం కాంగ్రెస్ సెంటర్లో పారిశ్రామిక పురోగతిపై నిర్వహించే ప్రత్యేక సెషన్లో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో…
* ఇవాళ్టి నుంచి భారత్, న్యూజిలాండ్ టీ-20 సిరీస్.. ఇవాళ రాత్రి 7 గంటలకు నాగ్పూర్ వేదికగా తొలి మ్యాచ్.. భారత్-న్యూజిలాండ్ మధ్య 5 మ్యాచ్ల టీ-20 సిరీస్ * నేటి నుంచి జేఈఈ మెయిన్స్.. రికార్డు స్థాయిలో 14.50 లక్షల మంది దరఖాస్తు.. * మేడారం జాతరకు పోటెత్తిన భక్తులు.. ఇవాళ మండమెలిగే పండుగకు ఏర్పాట్లు.. మేడారం జాతరకు తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు.. ఈ నెల 25 నుంచి 31 వరకు ఆర్టీసీ స్పెషల్…
భారత్ ఫ్యూచర్ సిటీని ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చేసేందుకు తెలంగాణతో కలిసి పనిచేయడానికి యూఏఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని యూఏఈ ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి హెచ్.ఈ. అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మార్రీ తెలిపారు. ప్రపంచ ఆర్థిక వేదిక –2026 సదస్సులో భాగంగా దావోస్లో తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డితో యూఏఈ మంత్రి మంగళవారం భేటీ అయ్యారు. ‘తెలంగాణ రైజింగ్’ ప్రతినిధి బృందంతో కలిసి రాష్ట్రంలో చేపట్టే భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు,…
పెండింగ్ చలాన్ల వసూలు విషయంలో వాహనదారులకు ఊరటనిస్తూ రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. గత కొంతకాలంగా ట్రాఫిక్ పోలీసులు చలాన్ల పేరుతో వాహనదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో, న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. రహదారులపై తనిఖీలు చేసే సమయంలో పెండింగ్ చలాన్లు ఉన్నాయని వాహనదారులను బలవంతపెట్టవద్దని పోలీసులకు హైకోర్టు స్పష్టం చేసింది. చలాన్లు చెల్లించాలని ఒత్తిడి చేస్తూ వాహనాల కీలను (keys) లాక్కోవడం లేదా వాహనాలను అక్కడే ఆపేసి ట్రాఫిక్ నిరోధించడం వంటి…
రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణ వేగవంతమైంది. ఈ కేసులో భాగంగా మాజీ మంత్రి హరీష్రావును ప్రత్యేక విచారణ బృందం (SIT) సుదీర్ఘంగా ప్రశ్నిస్తోంది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో జరిగిన ఈ విచారణలో ఫోన్ ట్యాపింగ్కు సంబంధించిన పలు కీలక అంశాలపై అధికారులు ఆయన నుంచి సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులతో ఉన్న సంబంధాలు, ఆ సమయంలో జరిగిన పరిణామాలపై సిట్ అధికారులు హరీష్రావును సుమారు 4…
ఇటీవలి కాలంలో యువతీ యువకులు చిన్న చిన్న కారణాలకే క్షణికావేశంలో దారుణాలకు ఒడిగడుతున్నారు. చదువులో రాణించడం లేదని, జాబ్ రావడం లేదని, లవ్ ఫెయిల్ అయ్యిందని, తల్లిదండ్రులు మందలించారని ఇలా రకరకాల కారణాలతో తనువులు చాలిస్తున్నారు. తాజాగా మెదక్ జిల్లా హావేలిఘనపూర్ (మం) ముత్తాయిపల్లిలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. మొబైల్ లో గేమ్స్ ఆడొద్దని తల్లిదండ్రులు మందలించినందుకు 19 ఏళ్ల యువతి షాకింగ్ డెసిషన్ తీసుకుంది. Also Read:Tamil Nadu: స్టాలిన్ సర్కార్కు గవర్నర్ షాక్.. ప్రసంగించకుండా…
మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాజీ నగర్ లో దారుణం చోటుచేసుకుంది. గంజాయి మత్తులో కన్నతల్లిపై కత్తితో దాడి చేశాడు కసాయి కొడుకు. స్థానికులు వెంటనే తల్లి రజినినీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. తల్లికి వేరొకరితో అక్రమ సంబంధం ఉందని పక్కాగా ప్లాన్ వేసిన కొడుకు.. సంబంధం పెట్టుకున్న వ్యక్తిని ఇంటికి పిలిచి మందు తాగించాడు రజిని కొడుకు. తాగిన తర్వాత గొడవ చేసి అతన్ని చంపే ప్రయత్నం…
స్విట్జర్లాండ్లోని దావోస్లో నేటి నుంచి జనవరి 23వ తేదీ వరకు ఐదు రోజుల పాటు జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం పాల్గొంటోంది. ఈ అంతర్జాతీయ వేదికపై ‘తెలంగాణ రైజింగ్ విజన్ 2047’ డాక్యుమెంట్ను సీఎం రేవంత్ రెడ్డి బృందం ప్రదర్శించనుంది. రాష్ట్ర అభివృద్ధి కోసం రూపొందించిన లక్ష్యాలను, భవిష్యత్ ప్రణాళికలను ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ప్రతినిధులకు వివరించడం ఈ పర్యటన ప్రధాన ఉద్దేశం. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి…