Mutual Funds: మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకు భారీ శుభవార్త.. కొత్త రూల్ తీసుకొచ్చిన సెబీ..
- మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకు శుభవార్త..
- కొత్త రూల్స్ ప్రకటించిన సెబీ..
- ఏప్రిల్ 30 నుంచి ‘డెబిట్ ఫ్రీజ్’ సౌకర్యం అందుబాటులోకి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియాలోని మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకు సెబీ అదిరే న్యూస్ చెప్పింది. మీ పెట్టుబడులకు అదనపు రక్షణ కల్పించేలా ‘వాలంటరీ లాక్-ఇన్’ లేదా ‘డెబిట్ ఫ్రీజ్’ అనే కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. సాధారణంగా మనం ఇంట్లో ఉన్న నగలను భద్రత కోసం లాకర్లో పెట్టి తాళం వేసినట్లుగానే.. ఇప్పుడు మీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్లకు కూడా డిజిటల్గా తాళం వేసుకోవచ్చు. దీనివల్ల మీ అనుమతి లేకుండా ఎవరూ మీ ఖాతా నుంచి డబ్బును విత్డ్రా చేయడం కానీ.. వేరే ఫండ్లోకి మార్చడం (Switch) కానీ సాధ్యం కాదు.
ఇటువంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారంటే.. ప్రస్తుతం అంతా డిజిటల్ యుగం నడుస్తోంది. ఫోన్లలోని యాప్స్ ద్వారానే మ్యూచువల్ ఫండ్ లావాదేవీలు చాలా సులభంగా జరిగిపోతున్నాయి. ఈ సౌలభ్యం ఎంత బాగుందో, సైబర్ మోసాల భయం కూడా అంతే పెరుగుతోంది. ఎవరైనా మీ అకౌంట్ను హ్యాక్ చేసినా లేదా అనధికారికంగా లావాదేవీలు జరపాలని చూసినా.. ఈ ’లాకింగ్’ ఫీచర్ వారి ప్రయత్నాలను తిప్పికొడుతుంది. ఇన్వెస్టర్ల నమ్మకాన్ని కాపాడటానికి సెబీ ఈ ముందస్తు చర్యలు చేపట్టింది.
Also Read
- SEBI F&O New Rules: ఎఫ్అండ్ఓ (F&O) ట్రేడింగ్ను మార్చబోతున్న సెబీ కొత్త రూల్.. అసలు మ్యాటర్ ఇదే!
- Satish Sanpal: 8వ తరగతి డ్రాపౌట్ నుంచి వేల కోట్ల అధిపతిగా.. భార్యకు 40 కిలోల బంగారం గిఫ్ట్తో వైరల్గా మారిన సక్సెస్ స్టోరీ!
- Gold Loan Surge : సంక్షోభ సమయంలో గోల్డ్ లోన్లవైపు పరుగులు తీస్తున్న సామాన్యులు.. ఎందుకిలా?
- Stock Market: ఢిల్లీ కంటే తక్కువ జనాభా.. కానీ స్టాక్ మార్కెట్లో భారత్నే వెనక్కి నెట్టి ఈ చిన్న దేశం..
Also Read:Telangana: పాఠశాల ప్రభుత్వ ఉపాధ్యాయుడు సస్పెండ్.. ఆ పని చేసినందుకే ఇలా..
ఇది ఎలా పని చేస్తుందంటే.. మీరు ఒకసారి మీ ఖాతాను ‘ఫ్రీజ్’ చేస్తే.. మళ్లీ దాన్ని అన్లాక్ చేసే వరకు ఎటువంటి ట్రాన్సాక్షన్స్ జరగవు. మీ దగ్గర డీమ్యాట్ ఖాతా ఉన్నా లేకపోయినా.. అంటే నేరుగా మ్యూచువల్ ఫండ్ కంపెనీల దగ్గర పెట్టుబడి పెట్టినా ఈ సదుపాయాన్ని వాడుకోవచ్చు. మొదటగా ఈ సదుపాయం ‘MF Central’ అనే డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా అందుబాటులోకి వస్తుంది. పెట్టుబడిదారులు తమకు అవసరమైనప్పుడు ఈ లాక్ ఫీచర్ను ఆన్ లేదా ఆఫ్ చేసుకోవచ్చు.
Also Read:Interest Rates Cut: ఆ బ్యాంక్లో లోన్ తీసుకున్న వారికి శుభవార్త.. వడ్డీ రేట్లు తగ్గింపు..
ఈ సదుపాయాన్ని వాడుకోవాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. మీ ఫోలియోకు ఖచ్చితంగా కేవైసీ పూర్తయి ఉండాలి. వాడుకలో ఉన్న ఈమెయిల్ ఐడీ అండ్ మొబైల్ నంబర్ కలిగి ఉండాలి. ఇవి రెండు మీ ఖాతాకు లింక్ అయి ఉండాలి. ఎందుకంటే లాక్ వేసేటప్పుడు లేదా తీసేటప్పుడు అథెంటికేషన్ కోసం మీకు వచ్చే మెసేజ్లు, ఓటీపీల ద్వారానే ఇది సాధ్యమవుతుంది. ఈ కొత్త నిబంధనలు ఏప్రిల్ 30 నుంచి అమల్లోకి వస్తాయని సెబీ పేర్కొంది.
ప్రస్తుతం మన దేశంలో మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు 80 లక్షల కోట్ల రూపాయలు దాటాయి. లక్షలాది మంది సామాన్యులు SIPల రూపంలో డబ్బులు దాచుకుంటున్నారు. సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ఉండటానికి ఈ ‘డిజిటల్ లాక్’ ఇన్వెస్టర్లకు ఒక వజ్రాయుధంలా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
RCB vs GT : గుజరాత్పై ఆర్సీబీ ‘రాయల్’ విక్టరీ.. ఏకంగా 92 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్లోకి..!
-
OTR : తెలంగాణ బీజేపీ నాయకులకు ఢిల్లీ అధిష్టానం వార్నింగ్ ఇచ్చిందా?
-
Siddaramaiah: కర్ణాటకలో ఉత్కంఠకు తెర.. గురువారం గుడ్బై చెప్పనున్న సిద్ధరామయ్య!
-
Khaja Mohijuddin: వక్ఫ్ బోర్డు భూముల పోరాటమే ప్రాణం తీసిందా? సెకండ్ హ్యాండ్ ‘స్కార్పియో’తో లాయర్ను లేపేసిన కిల్లర్స్!
-
Vizag Bhimili Murder: ప్రియుడి మోజులో పచ్చని సంసారంలో నిప్పులు.. భర్తను చున్నీతో చంపేసిన ఇల్లాలు!
ట్రెండింగ్
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!
-
వాతావరణం మారితే కలర్ మారుతున్న ఫోన్.. 12 కలర్ వేరియంట్స్, సరికొత్త AI ఫీచర్లతో Infinix HOT 70 లాంచ్.!
-
Nitish Kumar Reddy Birthday: టెక్నిక్ + టాలెంట్ + టెంపరమెంట్.. విశాఖ కుర్రాడి జర్నీ.!
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!