రేపటి నుంచి రెండో విడత రుణ మాఫీ ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నట్టు ప్రకటించారు తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీష్రావు.. సిద్దిపేటలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎందరో మహనీయుల త్యాగాలతో దేశానికి స్వాతంత్ర్యం సాధించుకున్నాం.. మహనీయుల స్ఫూర్తి, మహాత్ముడి అహింసా మార్గం, ప్రజాస్వామ్య పద్ధతిలో మహోద్యమాన్ని నిర్మించి తెలంగాణ స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసుకున్నాం అన్నారు. ఏ ఆశయ సాఫల్యం కోసం స్వరాష్ట్రాన్ని కోరుకున్నమో ఆ లక్ష్యసాధన…
గోల్కొండ కోటలో తెలంగాణ ప్రభుత్వం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జెండా ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఈ సందర్భంగా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు సీఎం కేసీఆర్. ఇది భారత స్వాతంత్ర్య అమృత ఉత్సవాలు జరుగుతున్న సందర్భమని… జాతి చరిత్రలో ఒక విశిష్ట ఘట్టమని వివరించారు. ఈ సందర్భంగా దేశ స్వాతంత్ర్య సాధన కోసం జరిగిన పోరాటంలోని ఉజ్వల ఘట్టాలను, స్వాతంత్ర్య సమరవీరుల మహోన్నత త్యాగాలను…
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థుల ఆత్మహత్యల కట్టడికి చర్యలు తీసుకోకపోవడంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యార్థుల ఆత్మహత్యలపై నివేదిక ఇవ్వాలని గత ఏడాది డిసెంబర్లో ఇరు రాష్ట్రాల సీఎస్లను ఆదేశించింది ఎన్హెచ్ఆర్సీ. దీంతో ప్రభుత్వాల నుంచి స్పందన లేక పోవడంతో సీరీయస్ అయ్యింది. ఆత్యహత్యలకు సంబంధించి ఆరు వారాల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని ఇరు రాష్ట్రాలను ఆదేశించింది. లేకపోతే తమ ముందు హాజరు కావాలని హెచ్చరించింది ఎన్హెచ్ఆర్సీ.
రాయలసీమ ఎత్తిపోతల పనులపై ఏపీ ప్రభుత్వం కోర్టు ధిక్కరణకు పాల్పడినట్టు ధృవీకరించింది కేఆర్ఎంబీ. రాయలసీమ ఎత్తిపోతల పనులపై ఎన్జీటీకి నివేదిక సమర్పించిన కేఆర్ఎంబీ.. డీపీఆర్ కు అవసరమైన పనులకన్నా అధికంగా పనులు జరిగినట్లు నివేదికలో నిర్ధారించింది. ఎన్జీటీ తీర్పును ధిక్కరించినట్లు ధృవీకరించిన కేఆర్ఎంబీ.. పంప్ హౌస్, అప్రోచ్ ఛానల్, ఫోర్ బే, డెలివరీ మెయిన్ ఛానల్, డెలివరీ సిస్టమ్, లింక్ కెనాల్ పనులు జరిగినట్లు నిర్థారించింది. రెండ్రోజులపాటు ప్రాజెక్ట్ పనులను తనిఖీ చేసిన కేఆర్ఎంబీ అధికారులు… ప్రాజెక్టులో…
హుజూరాబాద్ లో ఉప ఎన్నికకు షెడ్యూల్ రాకముందే.. పార్టీలు ప్రచార జోరు పెంచాయి. ఇప్పటికే పలువురు మంత్రులు సైతం నియోజకవర్గంలో పర్యటించి ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఈ ఉపఎన్నిక ఫలితం రాష్ట్ర రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపబోతోందని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్ రాజీనామా చేయడంతో ఈ ఉపఎన్నిక జరగనుంది. ప్రస్తుతం ఇరువురి మాటల తూటాలతో తెలంగాణ రాజకీయం వేడెక్కింది. కాగా, ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 16న భారీ…
తెలంగాణలో ఏ ఎన్నిక వచ్చినా ఆ పార్టీలకు పరీక్షే. ఇప్పుడు కొత్తగా మరో పార్టీ ఆ జాబితాలో చేరింది. ఉనికి కోసం క్షేత్రస్థాయిలో పోరాడాల్సిన పరిస్థితి. ఎన్నికల్లో పోటీ చేస్తాయో లేదో తెలియదు. బరిలో ఉన్నవారికి మద్దతిస్తాయో లేదో కూడా అర్థం కాదు. మొత్తానికి గుంపులో గోవిందగా మారిపోయాయి. ఇప్పుడు హుజురాబాద్లోనూ అంతేనా? హుజురాబాద్లో పోటీ చేస్తాయా లేదా? తెలంగాణాలో కొన్నిపార్టీలకు ఎన్నికలంటేనే దడ. ఒక రాజకీయపార్టీగా అలా నడిపించేద్దాం అని అనుకుంటున్న సమయంలో హుజురాబాద్ బైఎలక్షన్…
వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భౌగోళిక మార్పులు ఆ ప్రజాప్రతినిధి పదవికి ఎసరు పెడుతున్నాయా? ఇరుకున పెట్టాలనే వైరివర్గం చక్రం తిప్పిందా? చివరిక్షణంలో మారిన పరిణామాలు దేనికి సంకేతం? ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరుగుతున్న చర్చ ఏంటి? ఇంతకీ ఎవరి పదవికి ముప్పు పొంచి ఉంది? హన్మకొండజిల్లాలో కలిసిన శాయంపేట.. ఇరకాటంలో గండ్ర జ్యోతి! గండ్ర జ్యోతి. వరంగల్ జిల్లా జడ్పీ ఛైర్పర్సన్. వరంగల్, హన్మకొండ జిల్లాల ఏర్పాటుపై చర్చ ఎలా ఉన్నా.. ఆమె పరిస్థితిపై ఎంకిపెళ్లి సుబ్బిచావుకొచ్చినట్టుగా…
దళిత బందు పైన దుష్ప్రచారం చేస్తున్నారు దీన్ని తీవ్రంగా కండిస్తున్న.. అని చెప్పిన టీఆర్ఎస్ మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి దళితబంధు పూర్తిస్థాయిలో అమలు చేయకపోతే టీఆర్ఎస్కే నష్టమని అన్నడం చర్చకు దారి తీసింది ఒకే ఏడాదిలో 15 లక్షల కుటుంబాలకు ఆర్థికసాయం అందించలేకపోవచ్చన్నా కడియం దశల వారికి అందరికి ఆడుతుంది.. ఒకవేళ అందకపోతే మాత్రం టిఆర్ఎస్ కి నష్టమే అన్నారు. కానీ సీఎం అని ఆలోచించే దళిత బందువును ప్రవేశపెట్టారు అన్నారు. . దళితబంధు…
ఖమ్మం వ్యవసాయ మార్కెట్ నూతన పాలకమండలి ప్రమాణ స్వీకారానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి హాజరైయ్యారు. ఈమేరకు ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ మార్కెట్లో రిజర్వేషన్ లు పెట్టిన తోలి రాష్ట్రం తెలంగాణ అని కొనియాడారు. కాంగ్రెస్, బీజేపీ రాష్ట్రాలలో ఎందుకు రిజర్వేషన్లు అమలు చేయరు. రైతే వెన్నుముక అన్న పార్టీలకు రైతు బంధు లాంటి పథకాలు అమలు చేయాలని ఆలోచన లేదు. కరెంటు అడిగితే కాల్చి చంపారు. మరో పార్టీ రైతు పంటలను ఎక్కడ…
తెలంగాణలో కరోనా పాజిటివ్ రోజువారి కేసుల తగ్గుతూ వస్తుంది. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 87,355 సాంపిల్స్ పరీక్షించగా.. 420 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో ముగ్గురు కోవిడ్ బాధితులు మృత్యువాతపడ్డారు.. ఇదే సమయంలో 623 మంది కరోనా నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,52,135కు చేరగా.. రికవరీ కేసులు 6,40,688గా పెరిగాయి.. ఇక,…