బీజేపీ అనూహ్య నిర్ణయం.. అమిత్ షా ను ‘అక్కడికి’ రప్పిస్తున్నారట..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ నాయకులు.. తెలంగాణలో అందివచ్చిన వేవ్ ను కొనసాగించేందుకు అందుబాటులో ఉన్న అన్ని ప్రయత్నాలనూ చేస్తున్నట్టే కనిపిస్తోంది. దుబ్బాకలో గెలుపు ఇచ్చిన కిక్ తో పాటు.. గ్రేటర్ హైదరాబాద్ లో అందిన అనూహ్య విజయం ఆ పార్టీలో మరింత జోష్ నింపింది. ఇది కొనసాగించడంతో పాటు.. రేవంత్ నాయకత్వంలోని కాంగ్రెస్ అడుగులకు బ్రేక్ వేయాలన్న లక్ష్యంతో.. బండి సంజయ్ విస్తృతంగా పాదయాత్ర చేస్తున్నారు. ఇదే క్రమంలో అధికార పార్టీపైనా విమర్శల దాడి చేస్తున్నారు. ఈ వేడిని మరింత ముందుకు తీసుకుపోయే దిశగా.. అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.
ఈ నెల 17న.. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించేందుకు బీజేపీ నేతలు ఇప్పటినుంచే ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలోనూ విమోచన దినోత్సవాన్ని ఆర్భాటంగా నిర్వహించిన ఆ పార్టీ నేతలు.. ఇప్పుడు తమకు మరింత ప్రజాదరణ రావడమే లక్ష్యంగా సూపర్ ప్లాన్ వేశారు. ఏకంగా.. పార్టీ అగ్రనేత అమిత్ షాను రప్పించి.. సభ నిర్వహించి.. పార్టీ ఉద్దేశాలను జనంలోకి తీసుకువెళ్లాలని భావిస్తున్నారు. విమోచన దినోత్సవాన్ని అమిత్ షా తో.. నిర్మల్ లో భారీ బహిరంగ సభతో నిర్వహించేందుకు నిర్ణయించినట్టుగా తెలుస్తోంది.
Also Read
- Bhatti Vikramarka: ‘హట్టి గోల్డ్ మైన్స్’ సందర్శించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.!
- ACB Raids: భారీగా అక్రమ ఆస్తులు బట్టబయలు.. గనుల శాఖ అధికారి జయరాజ్ అరెస్ట్.!
- Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
- Bhatti Vikramarka : కర్ణాటకలో గోల్డ్ హంట్.. దేవదుర్గ గనిపై భట్టి ఫోకస్..
గతంలో సున్నితమైన విషయాల్లో తీవ్రమైన ఘర్షణలు జరిగిన భైంసా ప్రాంతం.. నిర్మల్ జిల్లాలోనే ఉంది. అలాంటి ప్రాంతంలో.. అత్యంత సున్నితమైన నియోజకవర్గంలో.. అమిత్ షాను రప్పించి.. సభను నిర్వహించడం అంటే.. అది మామూలుగా చూడాల్సిన విషయం ఏ మాత్రం కాదు. తెలంగాణలో ఇప్పుడు తమకు ఉన్న అనుకూలతలను మరింత బలంగా మార్చుకునేందుకు.. పార్టీ సందేశాన్ని జనంలోకి మరింత బలంగా తీసుకువెళ్లేందుకు.. ఇది ఉపయోగపడుతుందని పార్టీ రాష్ట్ర నాయకత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది.
ఇదే జరిగితే.. మరోసారి బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ డైలాగ్ వార్ కు.. మరో అడుగు ముందుకు పడినట్టుగానే భావించాలి. అంతే కాక.. నిర్మల్ కు అమిత్ షా అంటూ వస్తే.. త్వరలో జరగబోయే హుజూరాబాద్ ఉప ఎన్నికపైనా రాజకీయాన్ని ముందుకు తీసుకుపోవచ్చన్న అభిప్రాయాన్ని పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఉత్తర తెలంగాణలో కీలకమైన నిర్మల్, హుజూరాబాద్ నియోజకవర్గాలపై అమిత్ షా నిర్మల్ పర్యటనతో.. తమదైన ముద్ర వేసే అవకాశాలు ఉన్నాయని వారు కసరత్తు చేస్తున్నారు.
బీజేపీ రాష్ట్ర నేతల ప్రయత్నాలు ఫలించి.. అమిత్ షా అంటూ రాష్ట్రానికి వస్తే.. పొలిటికల్ ఫైట్ మరో టర్న్ తీసుకోవడం ఖాయమని చెప్పవచ్చు.
తాజావార్తలు
-
Geetu Mohandas : అసలు ఏం చెప్పాలనుకుంది? ఏం చెప్పింది?
-
Bigg Boss Telugu 10: బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇస్తున్న యంగ్ హీరో?..
-
Honor 600S 5G: 8100mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Honor 600S 5G.. Snapdragon చిప్, Android 16తో కొత్త ఫోన్
-
Odala Revu Fishermens: 23 రోజుల ఉత్కంఠకు తెర.. క్షేమంగా స్వగ్రామానికి చేరుకున్న ఓడలరేవు మత్స్యకారులు!
-
Anumana Pakshi: ‘డీజే టిల్లు’ దర్శకుడి మరో కొత్త కామెడీ.. ‘అనుమాన పక్షి’ రిలీజ్ డేట్ ఫిక్స్
ట్రెండింగ్
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!