బీజేపీ అనూహ్య నిర్ణయం.. అమిత్ షా ను ‘అక్కడికి’ రప్పిస్తున్నారట..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ నాయకులు.. తెలంగాణలో అందివచ్చిన వేవ్ ను కొనసాగించేందుకు అందుబాటులో ఉన్న అన్ని ప్రయత్నాలనూ చేస్తున్నట్టే కనిపిస్తోంది. దుబ్బాకలో గెలుపు ఇచ్చిన కిక్ తో పాటు.. గ్రేటర్ హైదరాబాద్ లో అందిన అనూహ్య విజయం ఆ పార్టీలో మరింత జోష్ నింపింది. ఇది కొనసాగించడంతో పాటు.. రేవంత్ నాయకత్వంలోని కాంగ్రెస్ అడుగులకు బ్రేక్ వేయాలన్న లక్ష్యంతో.. బండి సంజయ్ విస్తృతంగా పాదయాత్ర చేస్తున్నారు. ఇదే క్రమంలో అధికార పార్టీపైనా విమర్శల దాడి చేస్తున్నారు. ఈ వేడిని మరింత ముందుకు తీసుకుపోయే దిశగా.. అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.
ఈ నెల 17న.. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించేందుకు బీజేపీ నేతలు ఇప్పటినుంచే ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలోనూ విమోచన దినోత్సవాన్ని ఆర్భాటంగా నిర్వహించిన ఆ పార్టీ నేతలు.. ఇప్పుడు తమకు మరింత ప్రజాదరణ రావడమే లక్ష్యంగా సూపర్ ప్లాన్ వేశారు. ఏకంగా.. పార్టీ అగ్రనేత అమిత్ షాను రప్పించి.. సభ నిర్వహించి.. పార్టీ ఉద్దేశాలను జనంలోకి తీసుకువెళ్లాలని భావిస్తున్నారు. విమోచన దినోత్సవాన్ని అమిత్ షా తో.. నిర్మల్ లో భారీ బహిరంగ సభతో నిర్వహించేందుకు నిర్ణయించినట్టుగా తెలుస్తోంది.
Also Read
- Bhadradri Kothagudem: దారుణం.. గర్భిణి కడుపులోనే కత్తెర మర్చిపోయిన నర్సు.. తల్లీబిడ్డల మృతి!
- Instagram Love: ఇన్స్టాగ్రామ్లో ప్రేమ పేరుతో మోసం.. ఇద్దరు యువతుల నుంచి రూ.12 లక్షలకు పైగా కాజేసిన కేటుగాడు.!
- Tilak Varma-Siraj: తెలుగు ప్లేయర్స్ సిరాజ్, తిలక్కు లీగల్ నోటీసులు.. ఇద్దరు టాలీవుడ్ హీరోస్కు కూడా!
- TG Registration Services: తెలంగాణలో రిజిస్ట్రేషన్ సేవలకు బ్రేక్.. ప్రభుత్వం కీలక ప్రకటన.. కారణం ఇదే..!
గతంలో సున్నితమైన విషయాల్లో తీవ్రమైన ఘర్షణలు జరిగిన భైంసా ప్రాంతం.. నిర్మల్ జిల్లాలోనే ఉంది. అలాంటి ప్రాంతంలో.. అత్యంత సున్నితమైన నియోజకవర్గంలో.. అమిత్ షాను రప్పించి.. సభను నిర్వహించడం అంటే.. అది మామూలుగా చూడాల్సిన విషయం ఏ మాత్రం కాదు. తెలంగాణలో ఇప్పుడు తమకు ఉన్న అనుకూలతలను మరింత బలంగా మార్చుకునేందుకు.. పార్టీ సందేశాన్ని జనంలోకి మరింత బలంగా తీసుకువెళ్లేందుకు.. ఇది ఉపయోగపడుతుందని పార్టీ రాష్ట్ర నాయకత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది.
ఇదే జరిగితే.. మరోసారి బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ డైలాగ్ వార్ కు.. మరో అడుగు ముందుకు పడినట్టుగానే భావించాలి. అంతే కాక.. నిర్మల్ కు అమిత్ షా అంటూ వస్తే.. త్వరలో జరగబోయే హుజూరాబాద్ ఉప ఎన్నికపైనా రాజకీయాన్ని ముందుకు తీసుకుపోవచ్చన్న అభిప్రాయాన్ని పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఉత్తర తెలంగాణలో కీలకమైన నిర్మల్, హుజూరాబాద్ నియోజకవర్గాలపై అమిత్ షా నిర్మల్ పర్యటనతో.. తమదైన ముద్ర వేసే అవకాశాలు ఉన్నాయని వారు కసరత్తు చేస్తున్నారు.
బీజేపీ రాష్ట్ర నేతల ప్రయత్నాలు ఫలించి.. అమిత్ షా అంటూ రాష్ట్రానికి వస్తే.. పొలిటికల్ ఫైట్ మరో టర్న్ తీసుకోవడం ఖాయమని చెప్పవచ్చు.
తాజావార్తలు
-
FIFA World Cup 2026: మెక్సికో సంచలన విజయం.. నాకౌట్ దశలోకి తొలి అర్హత సాధించిన జట్టుగా.!
-
Bhadradri Kothagudem: దారుణం.. గర్భిణి కడుపులోనే కత్తెర మర్చిపోయిన నర్సు.. తల్లీబిడ్డల మృతి!
-
PM Modi: నేటితో 56వ వసంతంలోకి రాహుల్ గాంధీ.. ప్రధాని మోడీ ఆసక్తికర పోస్ట్..
-
Instagram Love: ఇన్స్టాగ్రామ్లో ప్రేమ పేరుతో మోసం.. ఇద్దరు యువతుల నుంచి రూ.12 లక్షలకు పైగా కాజేసిన కేటుగాడు.!
-
Gold and Silver Prices Today: గోల్డ్, సిల్వర్ ధరలు ఢమాల్.. ఊహించని రీతిలో తగ్గినయ్
ట్రెండింగ్
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Tilak Varma-Siraj: తెలుగు ప్లేయర్స్ సిరాజ్, తిలక్కు లీగల్ నోటీసులు.. ఇద్దరు టాలీవుడ్ హీరోస్కు కూడా!
-
Smriti Mandhana: క్రికెట్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా స్మృతి మంధాన.. పురుష క్రికెటర్లకు కూడా సాధ్యం కాని రేర్ రికార్డు!
-
పార్లమెంట్కూ చేరిన FIFA World Cup జోష్.. వైకింగ్ పడవ ప్రయాణాన్ని అనుకరించిన ఎంపీలు.! వీడియో వైరల్..
-
Sreesanth: ఆమె లేకపోతే ఆత్మహత్య చేసుకునేవాడిని.. తీహార్ జైల్లో నరకం అనుభవించా!