పాదయాత్ర.. ఇప్పుడో పొలిటికల్ ట్రెండ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాదయాత్ర చేస్తే.. అధికారం ఖాయమా? ఎన్నికలకు ముందు జనాన్ని నేరుగా కలిస్తే.. గెలుపు తనంతట తానే మన దగ్గరకు వస్తుందా? గతంలోని ఉదాహరణలు చూపించి.. అది నిజమే అని చాలా మంది అంటుంటారు. అందుకు 2003లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన పాదయాత్ర నాంది పలికిందనే చెప్పవచ్చు. ఆనాడు కాంగ్రెస్ ను ఎలాగైనా అధికారంలోకి తీసుకురావాలన్న సంకల్పంతో.. ఆయన చేసిన పాదయాత్ర.. సంచలనాన్ని సృష్టించింది. కాంగ్రెస్ ను పూర్తి స్థాయి మెజారిటీతో అధికారంలోకి తీసుకువచ్చింది.
తర్వాత.. 2013లో చంద్రబాబు చేసిన పాదయాత్ర ఆ పార్టీకి మంచి మైలేజీ తీసుకువచ్చింది. ఉమ్మడి రాష్ట్ర విభజన ఖాయమైన అనంతరం.. 2014లో జరిగిన ఎన్నికల్లో.. అవశేష ఆంధ్రప్రదేశ్ కు తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని కల్పించింది. తర్వాత.. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ సైతం 2018లో సుదీర్ఘ పాదయాత్ర చేశారు. న్యాయపరమైన చిక్కుల్లో ఇరుక్కున్నప్పుడు ఆయన సోదరి షర్మిల.. జగన్ తరఫున జనంలోకి వెళ్లారు. చివరికి.. 2019లో జరిగిన ఎన్నికల్లో ఫలితాన్ని మనం చూశాం. అనూహ్యంగా జగన్ భారీ ఆధిక్యంతో పవర్ లోకి వచ్చారు.
Also Read
- Iran: ప్రపంచ దేశాలకు ఇరాన్ కొత్త వార్నింగ్.. భారత్కు ముప్పు తప్పదా?
- Twisha Sharma: పెళ్లైన 5 నెలలకే తెలుగు హీరోయిన్ మృతి!
- CM Vijay: ముఖ్యమంత్రిగా ఢిల్లీ టూర్కు విజయ్.. ప్రధాని మోడీని ఎప్పుడు కలవబోతున్నారంటే..!
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
ఇప్పుడు తెలంగాణలో చూస్తే.. హుజూరాబాద్ ఉప ఎన్నిక.. రాష్ట్రంలోనే కాదు.. జాతీయ స్థాయిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. మంత్రిగా ఉన్న నేత.. ఆరోపణలు రాగానే రాజీనామా చేసి.. బీజేపీలో చేరి.. ఆ పార్టీ అభ్యర్థిగా జనాల్లోకి వెళ్తూ.. రాజకీయాన్ని వేడెక్కిస్తున్నారు. ఆయన సైతం.. పాదయాత్రనే ఆయుధంగా చేసుకున్నారు. నియోజకవర్గాన్ని మొత్తాన్నీ చుట్టేసే ప్రయత్నం చేశారు.
అలాగే.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. పాదయాత్రతో జనాల్లోకి వెళ్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శల మీద విమర్శలు చేస్తున్నారు. వీరందరితో పాటు.. నిత్యం కేసీఆర్ పై, టీఆర్ఎస్ పై విమర్శలు చేస్తూ.. ప్రస్తుతం ఓ కేసులో జైలుపాలైన తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ సైతం.. ఓ దశలో భారీ పాదయాత్రకు నిర్ణయం తీసుకున్నారు. కానీ.. అనుకోని పరిస్థితుల నేపథ్యంలో ఆయన ఇప్పుడు జైలులో ఉన్నారు.
ఇదంతా చూస్తుంటే.. అటు ఆంధ్రాలో.. ఇటు తెలంగాణలో.. రాజకీయ నేతలు.. పాదయాత్రను ఓ గెలుపు మంత్రంగా భావిస్తున్నారని చెప్పవచ్చు. కానీ.. ఒకరిని చూసి.. మిగతా అంతా అదే పని చేస్తే.. అప్పుడు పాదయాత్ర అన్నది చాలా మందికి ఓ వృథా ప్రయత్నంగానే మిగిలే అవకాశాలున్నాయి. ఇలాంటి స్థితిలో.. నేతలు సరికొత్తగా ఎలాంటి ప్రయత్నాన్ని చేస్తారు.. జనాన్ని కలిసేందుకు వినూత్నంగా ఎలా ప్రయత్నిస్తారన్నది.. చూడాలి.
తాజావార్తలు
-
Ram Charan: బుచ్చిబాబు వల్లే నా చేతికి గాయమైంది
-
CM YOGI: ‘‘రోడ్లున్నది నమాజ్ చేయడానికి కాదు’’.. యోగి స్ట్రాంగ్ వార్నింగ్..
-
TGSRTC: సూపర్ లగ్జరీ టికెట్ ధర చెల్లించి.. లహరి బస్సులో ప్రయాణించండి..
-
Lakshadweep: ప్రధాని మోడీ “కుర్చీ మడత పెడితే” ఎలా ఉంటుందో తెలుసా.. లక్షదీవులే సాక్ష్యం..
-
Iran: ప్రపంచ దేశాలకు ఇరాన్ కొత్త వార్నింగ్.. భారత్కు ముప్పు తప్పదా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!