పాదయాత్ర.. ఇప్పుడో పొలిటికల్ ట్రెండ్..!
పాదయాత్ర చేస్తే.. అధికారం ఖాయమా? ఎన్నికలకు ముందు జనాన్ని నేరుగా కలిస్తే.. గెలుపు తనంతట తానే మన దగ్గరకు వస్తుందా? గతంలోని ఉదాహరణలు చూపించి.. అది నిజమే అని చాలా మంది అంటుంటారు. అందుకు 2003లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన పాదయాత్ర నాంది పలికిందనే చెప్పవచ్చు. ఆనాడు కాంగ్రెస్ ను ఎలాగైనా అధికారంలోకి తీసుకురావాలన్న సంకల్పంతో.. ఆయన చేసిన పాదయాత్ర.. సంచలనాన్ని సృష్టించింది. కాంగ్రెస్ ను పూర్తి స్థాయి మెజారిటీతో అధికారంలోకి తీసుకువచ్చింది.
తర్వాత.. 2013లో చంద్రబాబు చేసిన పాదయాత్ర ఆ పార్టీకి మంచి మైలేజీ తీసుకువచ్చింది. ఉమ్మడి రాష్ట్ర విభజన ఖాయమైన అనంతరం.. 2014లో జరిగిన ఎన్నికల్లో.. అవశేష ఆంధ్రప్రదేశ్ కు తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని కల్పించింది. తర్వాత.. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ సైతం 2018లో సుదీర్ఘ పాదయాత్ర చేశారు. న్యాయపరమైన చిక్కుల్లో ఇరుక్కున్నప్పుడు ఆయన సోదరి షర్మిల.. జగన్ తరఫున జనంలోకి వెళ్లారు. చివరికి.. 2019లో జరిగిన ఎన్నికల్లో ఫలితాన్ని మనం చూశాం. అనూహ్యంగా జగన్ భారీ ఆధిక్యంతో పవర్ లోకి వచ్చారు.
Also Read
- Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
- Nigeria: నైజీరియాలో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఫుట్బాల్ మైదానంలో కాల్పులు.. 29 మంది మృతి
- Bengal Elections: రేపు తృణమూల్ కంచుకోటలో పోలింగ్.. ఈసారి ఎవరిది పైచేయి!
- Manish Sisodia: కోర్టులో మీరుంటే విచారణకు రాను.. జస్టిస్ స్వర్ణకాంతకు మనీష్ సిసోడియా లేఖ
ఇప్పుడు తెలంగాణలో చూస్తే.. హుజూరాబాద్ ఉప ఎన్నిక.. రాష్ట్రంలోనే కాదు.. జాతీయ స్థాయిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. మంత్రిగా ఉన్న నేత.. ఆరోపణలు రాగానే రాజీనామా చేసి.. బీజేపీలో చేరి.. ఆ పార్టీ అభ్యర్థిగా జనాల్లోకి వెళ్తూ.. రాజకీయాన్ని వేడెక్కిస్తున్నారు. ఆయన సైతం.. పాదయాత్రనే ఆయుధంగా చేసుకున్నారు. నియోజకవర్గాన్ని మొత్తాన్నీ చుట్టేసే ప్రయత్నం చేశారు.
అలాగే.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. పాదయాత్రతో జనాల్లోకి వెళ్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శల మీద విమర్శలు చేస్తున్నారు. వీరందరితో పాటు.. నిత్యం కేసీఆర్ పై, టీఆర్ఎస్ పై విమర్శలు చేస్తూ.. ప్రస్తుతం ఓ కేసులో జైలుపాలైన తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ సైతం.. ఓ దశలో భారీ పాదయాత్రకు నిర్ణయం తీసుకున్నారు. కానీ.. అనుకోని పరిస్థితుల నేపథ్యంలో ఆయన ఇప్పుడు జైలులో ఉన్నారు.
ఇదంతా చూస్తుంటే.. అటు ఆంధ్రాలో.. ఇటు తెలంగాణలో.. రాజకీయ నేతలు.. పాదయాత్రను ఓ గెలుపు మంత్రంగా భావిస్తున్నారని చెప్పవచ్చు. కానీ.. ఒకరిని చూసి.. మిగతా అంతా అదే పని చేస్తే.. అప్పుడు పాదయాత్ర అన్నది చాలా మందికి ఓ వృథా ప్రయత్నంగానే మిగిలే అవకాశాలున్నాయి. ఇలాంటి స్థితిలో.. నేతలు సరికొత్తగా ఎలాంటి ప్రయత్నాన్ని చేస్తారు.. జనాన్ని కలిసేందుకు వినూత్నంగా ఎలా ప్రయత్నిస్తారన్నది.. చూడాలి.
తాజావార్తలు
-
UIDAI Important Update: యూఐడీఏఐ కీలక నిర్ణయం.. ఇక వీటికి ఆధార్ చెల్లదు..
-
Navjot Kaur Sidhu: రాఘవ్ చద్దా బీజేపీలో చేరడానికి ప్రియాంక చోప్రానే కారణం.. అసలు కథ ఇదేనా?
-
Toxic: యష్ ‘టాక్సిక్’కు ఓటీటీ టెన్షన్..
-
Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
-
Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!