పాదయాత్ర.. ఇప్పుడో పొలిటికల్ ట్రెండ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాదయాత్ర చేస్తే.. అధికారం ఖాయమా? ఎన్నికలకు ముందు జనాన్ని నేరుగా కలిస్తే.. గెలుపు తనంతట తానే మన దగ్గరకు వస్తుందా? గతంలోని ఉదాహరణలు చూపించి.. అది నిజమే అని చాలా మంది అంటుంటారు. అందుకు 2003లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన పాదయాత్ర నాంది పలికిందనే చెప్పవచ్చు. ఆనాడు కాంగ్రెస్ ను ఎలాగైనా అధికారంలోకి తీసుకురావాలన్న సంకల్పంతో.. ఆయన చేసిన పాదయాత్ర.. సంచలనాన్ని సృష్టించింది. కాంగ్రెస్ ను పూర్తి స్థాయి మెజారిటీతో అధికారంలోకి తీసుకువచ్చింది.
తర్వాత.. 2013లో చంద్రబాబు చేసిన పాదయాత్ర ఆ పార్టీకి మంచి మైలేజీ తీసుకువచ్చింది. ఉమ్మడి రాష్ట్ర విభజన ఖాయమైన అనంతరం.. 2014లో జరిగిన ఎన్నికల్లో.. అవశేష ఆంధ్రప్రదేశ్ కు తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని కల్పించింది. తర్వాత.. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ సైతం 2018లో సుదీర్ఘ పాదయాత్ర చేశారు. న్యాయపరమైన చిక్కుల్లో ఇరుక్కున్నప్పుడు ఆయన సోదరి షర్మిల.. జగన్ తరఫున జనంలోకి వెళ్లారు. చివరికి.. 2019లో జరిగిన ఎన్నికల్లో ఫలితాన్ని మనం చూశాం. అనూహ్యంగా జగన్ భారీ ఆధిక్యంతో పవర్ లోకి వచ్చారు.
Also Read
- North Korea: ఫుట్బాల్ టోర్నమెంట్లో చరిత్ర సృష్టించిన ఉత్తర కొరియా జట్టు.. షేక్ హ్యాండిచ్చి అభినందించిన కిమ్.. సెలబ్రేషన్స్ వైరల్!
- CM Vijay: రాజ్యసభ సీటుపై విజయ్ కీలక నిర్ణయం.. కీలక మిత్ర పక్షానికి కేటాయింపు
- Trump: మొజ్తబా ఖమేనీని కలవాలనుకుంటున్నా.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
- El Nino-Centre: ఎల్నినోపై కేంద్రం అప్రమత్తం.. భయాందోళన అక్కర్లేదని హామీ
ఇప్పుడు తెలంగాణలో చూస్తే.. హుజూరాబాద్ ఉప ఎన్నిక.. రాష్ట్రంలోనే కాదు.. జాతీయ స్థాయిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. మంత్రిగా ఉన్న నేత.. ఆరోపణలు రాగానే రాజీనామా చేసి.. బీజేపీలో చేరి.. ఆ పార్టీ అభ్యర్థిగా జనాల్లోకి వెళ్తూ.. రాజకీయాన్ని వేడెక్కిస్తున్నారు. ఆయన సైతం.. పాదయాత్రనే ఆయుధంగా చేసుకున్నారు. నియోజకవర్గాన్ని మొత్తాన్నీ చుట్టేసే ప్రయత్నం చేశారు.
అలాగే.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. పాదయాత్రతో జనాల్లోకి వెళ్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శల మీద విమర్శలు చేస్తున్నారు. వీరందరితో పాటు.. నిత్యం కేసీఆర్ పై, టీఆర్ఎస్ పై విమర్శలు చేస్తూ.. ప్రస్తుతం ఓ కేసులో జైలుపాలైన తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ సైతం.. ఓ దశలో భారీ పాదయాత్రకు నిర్ణయం తీసుకున్నారు. కానీ.. అనుకోని పరిస్థితుల నేపథ్యంలో ఆయన ఇప్పుడు జైలులో ఉన్నారు.
ఇదంతా చూస్తుంటే.. అటు ఆంధ్రాలో.. ఇటు తెలంగాణలో.. రాజకీయ నేతలు.. పాదయాత్రను ఓ గెలుపు మంత్రంగా భావిస్తున్నారని చెప్పవచ్చు. కానీ.. ఒకరిని చూసి.. మిగతా అంతా అదే పని చేస్తే.. అప్పుడు పాదయాత్ర అన్నది చాలా మందికి ఓ వృథా ప్రయత్నంగానే మిగిలే అవకాశాలున్నాయి. ఇలాంటి స్థితిలో.. నేతలు సరికొత్తగా ఎలాంటి ప్రయత్నాన్ని చేస్తారు.. జనాన్ని కలిసేందుకు వినూత్నంగా ఎలా ప్రయత్నిస్తారన్నది.. చూడాలి.
తాజావార్తలు
-
Test Match: ఆ ప్లేయర్కు రెస్ట్.. రంజీ హీరోకు ఛాన్స్..? అఫ్గాన్ టెస్టుకు ముందు టీమిండియాలో ఊహించని ట్విస్ట్..
-
Ram Charan: రామ్ చరణ్ క్రేజ్ నెక్స్ట్ లెవెల్.. కూకట్పల్లిలో మెగా పవర్ స్టార్ ఆలయం! పూజలు చేస్తున్న ఫ్యాన్స్..
-
Kitchen Tips: బియ్యంలో పురుగుల నుంచి బిర్యానీ రైస్ వరకు.. వంటగది రూపురేఖలు మార్చే అమేజింగ్ చిట్కాలు!
-
Land Rates: తెలంగాణలో భూములకు కొత్త ధరలు.. జూన్ 5 నుంచే ప్రారంభం..
-
Pawan Kalyan: మావిగన్ పేరు వినడానికే చిరాకుగా ఉంది.. పవన్ ఫైర్
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
-
Chicken Keema Paratha Recipe: యమ్మీ.. యమ్మీ.. చికెన్ కీమా పరోటా.. సింపుల్గా ఇలా ఇంట్లోనే చేసుకోండి..!
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!