Phone Tapping Case : జూబ్లీహిల్స్ పీఎస్ ఎదుట ఉద్రిక్తత
- Phone tapping కేసు SIT విచారణ వేగం
- హరీష్రావుపై గంటలపాటు ప్రశ్నలు
- జూబ్లీహిల్స్ పీఎస్ వద్ద బీఆర్ఎస్ కార్యకర్తల రద్దీ
- పోలీసులు- కార్యకర్తల మధ్య తోపులాట
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణ వేగవంతమైంది. ఈ కేసులో భాగంగా మాజీ మంత్రి హరీష్రావును ప్రత్యేక విచారణ బృందం (SIT) సుదీర్ఘంగా ప్రశ్నిస్తోంది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో జరిగిన ఈ విచారణలో ఫోన్ ట్యాపింగ్కు సంబంధించిన పలు కీలక అంశాలపై అధికారులు ఆయన నుంచి సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులతో ఉన్న సంబంధాలు, ఆ సమయంలో జరిగిన పరిణామాలపై సిట్ అధికారులు హరీష్రావును సుమారు 4 గంటలగా విచారిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ విభాగం కార్యకలాపాలు, పార్టీ పరంగా వచ్చిన సమాచారం వంటి అంశాలపై అధికారులు ఆరా తీసినట్లు సమాచారం.
ఇదిలా ఉంటే.. హరీష్రావు విచారణకు హాజరవుతున్నారన్న సమాచారంతో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ (BRS) నాయకులు, కార్యకర్తలు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. విచారణ ముగిసే సమయానికి స్టేషన్ పరిసరాలు పార్టీ శ్రేణులతో నిండిపోయాయి. పోలీసులు స్టేషన్ చుట్టూ భారీ బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ, కార్యకర్తలు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత ప్రారంభమైంది. పోలీసుల తీరుకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణులు భారీ ఎత్తున నినాదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, కార్యకర్తలకు మధ్య తీవ్రస్థాయిలో తోపులాట జరిగింది. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి కార్యకర్తలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా కార్యకర్తలు చేసిన నినాదాలతో జూబ్లీహిల్స్ ప్రాంతం హోరెత్తిపోయింది.
Also Read
AP Fake Liquor Case: మాజీ మంత్రి జోగి రమేష్కు బెయిల్.. అయినా జైలులోనే..!
తాజావార్తలు
-
Petrol-Diesel: వాహనదారులకు కేంద్రం శుభవార్త.. జూలై 1 నుంచి ఆంక్షలు ఎత్తివేత
-
Harmanpreet Kaur: టీ20 ప్రపంచకప్ నుంచి భారత్ అవుట్.. కెప్టెన్గా హర్మన్ప్రీత్ కౌర్ తొలగింపు.?
-
Raghav Niharika: బాలీవుడ్ నటుడితో తెలుగు అమ్మాయి లవ్ ట్రాక్? నెట్టింట ఫొటోలు వైరల్!
-
Eng vs NZ: ఇంగ్లండ్కు చుక్కలు చూపించిన న్యూజిలాండ్.. 160 పరుగుల భారీ విజయం, టెస్ట్ సిరీస్ కైవసం.!
-
Ayodhya Ram Mandir: బ్యాంకులకు చేరిన రామాలయ కానుకల చోరీ కేసు.. ఎస్బీఐతో పాటు మరో 5 బ్యాంకులకు నోటీసులు!
ట్రెండింగ్
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!