తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ పై జస్టిస్ చంద్రు ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజా వ్యతిరేకంగా మాట్లాడితే.. ఎవరూ ఎక్కువ రోజులు అధికారంలో ఉండలేరని కేసీఆర్ ను హెచ్చరించారు. ఆర్టీసీ సమ్మె విషయంలో కేసీఆర్ తీరు విస్మయం కలిగించిందని వెల్లడించారు. సమ్మె ఎన్ని రోజులు చేస్తారో చూస్తానని కేసీఆర్.. కార్మికులను బెదిరించారని ఆగ్రహించారు. యూనియన్లతో కాకుండా ఉద్యోగులతోనే మాట్లాడతాననడం ఏంటి అని నిలదీశారు. కచ్చితంగా యూనియన్లతోనే మాట్లాడాలని పేర్కొన్నారు. జలహక్కులకు…
తెలంగాణ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ.. హనుమకొండలో నూతనంగా ఏర్పాటు చేసిన 10 కోర్టుల భవన సముదాయాన్ని ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. కోర్టుల ఆధునీకరణతో ప్రజలకు సత్వర న్యాయం జరుగుతుందన్నారు.. శిథిలావస్థలో ఉన్న కోర్టులను పునరుద్ధరించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం.. కోర్టుల్లో మౌలిక వసతులు ఉంటేనే పేదలకు న్యాయ సేవలు అందుతాయన్న ఆయన.. మౌలికవసతులు లేకుండా న్యాయమూర్తులు, న్యాయవాదులు పని చేయాలని అనుకోవడం దురాశ…
వరంగల్ లో మూడు సాహిత్య పాఠశాలలకు హాజరయ్యాను. వరంగల్ లో బంధువులు, మిత్రులు ఉన్నారు. వరంగల్ తో నాకు అవినాభావ సంబంధం ఉంది అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. వరంగల్ కోర్టు బిల్డింగ్ ప్రారంభోత్సవం కోసం వచ్చిన జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ… వరంగల్ పోరాట గడ్డ. విప్లవకారులు తిరిగిన నేల. దేశానికి ప్రధాన మంత్రిని అందించిన ప్రాంతం వరంగల్ అని తెలిపారు. పొరుగల్లుకు వందనం, ఓరుగల్లుకు వందనం, వరంగల్ కు…
తెలంగాణ ఆర్టీసీలో ఆ బంగళా పేరు చెబితే హడలిపోతున్నారా? గతంలో ఎంతోమంది సకుటుంబ సపరివారంగా ఆ భవనంలో ఉన్నారు. ఇప్పుడా బంగళా మాకొద్దు అంటే మాకొద్దని ముఖం చాటేస్తున్నారట. ఆర్టీసీలో రాజుగారి గదిలా మారిన ఆ బంగళా ఏంటి? ఎక్కడుంది? ఆర్టీసీ బంగ్లాపై రకరకాల చర్చలు..! తెలంగాణలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు పలు కార్పొరేషన్ చైర్మన్లకు, సలహాదారులకు ప్రభుత్వం క్వార్టర్స్ను కేటాయించింది. ఇటీవల కొన్ని కార్పొరేషన్లకు నూతన ఛైర్మన్లగా వచ్చిన వారికీ నివాస భవనాలు ఇచ్చారు. వారిలో…
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు మరోసారి బహిరంగ లేఖ రాశారు టి.పీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డి… ఈసారి లేఖలో పోస్టింగుల కోసం వెయిటింగ్లో ఉన్న అధికారుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు.. ఎక్సైజ్ శాఖలో అకారణంగా మూడు సంవత్సరాలుగా పోస్టింగ్స్ ఇవ్వకుండా వెయిటింగ్లో పెట్టిన అధికారులకు వెంటనే పోస్టింగ్స్ ఇవ్వాలని విన్నవించారు.. ఆంధ్ర నుండి తెలంగాణకు కేటాయించిన తెలంగాణ బిడ్డలైన ముగ్గురు ఎక్సైజ్ సూపరింటెండెంట్లను ఎటువంటి కారణం లేకుండా రెండు సంవత్సరాలుగా పోస్టింగ్ ఇవ్వకుండా జీతాలు ఇవ్వకుండా…
తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు వివాదం రేపుతున్నాయి. ఇంటర్ బోర్డు వైఖరి వల్ల చాలా మంది విద్యార్థులు నష్టపోయారంటూ విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం తెలంగాణ వ్యాప్తంగా ఇంటర్ కాలేజీల బంద్కు పిలుపునిస్తున్నట్లు NSUI ప్రకటించింది. ఇంటర్ బోర్డు తప్పిదాల వల్ల బలైన విద్యార్థుల కోసం తాము పోరాడుతుంటే ఇంటర్ బోర్డు కనీసం స్పందించకుండా పోలీసుల చేత తమను అక్రమంగా అరెస్ట్ చేయిస్తోందని NSUI పెద్దపల్లి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్ము అభిలాష్ ఆరోపించారు. Read…
ఈ సృష్టిలో తీయనైనది ప్రేమ. అది ఎవరి మధ్య అయినా పుడుతుంది. దానికి రంగు, కులం, మతంతో సంబంధం లేదు. అలా ఇద్దరు అబ్బాయిల మధ్య కూడా పుట్టింది. దీంతో ఆ ఇద్దరు పెద్దల సమక్షంలో పెళ్లి కూడా చేసుకున్నారు. ఇది జరిగింది ఎక్కడో కాదు మన తెలంగాణలో. తెలంగాణలో తొలిసారిగా ఇద్దరు అబ్బాయిలు ప్రేమించుకుని పెళ్లి చేసుకుని రికార్డు సృష్టించారు. Read Also: వరంగల్ బాలుడికి అరుదైన అవకాశం వివరాల్లోకి వెళ్తే.. 8 ఏళ్ల క్రితం…
ఢిల్లీకి చేరుకున్న తెలంగాణ మంత్రులు, టీఆర్ఎస్ ఎంపీలు… రేపు పార్లమెంట్ లో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ను కలవనున్నారు. మరోసారి కేంద్ర ఆహారం, ప్రజాపంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయల్ ను కలిసి ఖరీప్ సీజన్ లో పండే వరిధాన్యం కొనుగోలుపై స్పష్టత కోరనున్నారు తెలంగాణ మంత్రులు, ఎంపీల బృందం. ప్రస్తుతం ముంబైలో ఉన్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ రేపు ఢిల్లీ కి వచ్చిన తర్వాత, తెలంగాణ నేతల బృందం భేటీ అయ్యే అవకాశం…
దళితుల అభివృద్ధే లక్ష్యంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా దళితబంధు పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే.. మొదటగా తాను దత్తతతీసుకున్న వాసాలమర్రిలో పూర్తిస్థాయిలో అమలు చేసిన కేసీఆర్.. ఆ తర్వాత హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం అంతటా అమలు చేయాలన్న ఉద్దేశంతో సమీక్ష సమావేశాలు నిర్వహించి నిధులు కూడా విడుదల చేశారు.. అంతే కాకుండా.. మరికొన్ని మండలాల్లో కూడా పైలట్ ప్రాజెక్టు కింద అమలు చేయాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.. అయితే, దళితబంధు పథకం కింద…
వరంగల్కు చెందిన ఓ బాలుడు అరుదైన అవకాశం పొందాడు. టెస్లా సీఈవో ఎలన్ మస్క్ స్థాపించిన ఇంటర్నేషనల్ స్కూల్లో చదివేందుకు ఆ బాలుడు అర్హత సాధించాడు. వివరాల్లోకి వెళ్తే… వరంగల్ పట్టణంలోని గోపాలపూర్లో నివసిస్తున్న అనిక్ పాల్ ప్రస్తుతం ఆరో తగరతి చదువుతున్నాడు. వరంగల్ నిట్ సమీపంలోని గవర్నమెంట్ ఆర్ఈసీ పాఠక్ స్కూలులో అతడు అభ్యసిస్తున్నాడు. అయితే అనిక్ పాల్లో టాలెంట్ను గుర్తించిన అతడి తండ్రి విజయ్ పాల్.. ఎలన్ మస్క్ స్థాపించిన సింథిసిస్ స్కూలు గొప్పతనాన్ని…