కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ లో యాసంగి వరిధాన్యం కొనబోమని పదే పదే స్పష్టం చేస్తున్న నేపథ్యంలో… రాష్ట్ర ప్రభుత్వం యాసంగిలో వొక్క కిలో వడ్లు కూడా కొనలేదని, రాష్ట్రం లో యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయబోవడం లేదని ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు పునరుద్ఘాటించారు. కేంద్రం అనుసరిస్తున్న ప్రమాదకర విధనాలనుంచి రాష్ట్ర రైతాంగాన్ని కాపాడేందుకు క్షేత్ర స్థాయిలోకి వెళ్లి, ధాన్యం కొనబోమనే విషయాన్ని అర్థం చేయించాలని సీఎం కెసీఆర్ కలెక్టర్లను, వ్యవసాయ…
కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు సంగారెడ్డిలో పాత బస్టాండ్ నుండి కలెక్టరేట్ సి.ఎస్.ఐ చర్చ్ వరకు పెరిగిన పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలు తగ్గించాలని పాదయాత్ర నిర్వహించారు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఈ సందర్భంగా జగ్గా రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక 60 రూపాయలు ఉన్నా పెట్రోల్ రూ.110 లకు పెరిగిందని.. రూ. 600 ఉన్న గ్యాస్ ధర.. వెయ్యి రూపాయలు పెరిగాయన్నారు. దీనివల్ల పేద మధ్య,తరగతి కుటుంబాలకు ఆర్థిక…
నిత్యావసర వస్తువుల ధరలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర చేయాలని సంకల్పించిన సంగతి తెలిసిందే. రంగారెడ్డి జిల్లా ముడిమ్యాల నుంచి చేవెళ్లలోని ఇందిరాగాంధీ విగ్రహం వరకు 10 కిలోమీటర్లమేర పాదయాత్ర జరుగుతుంది. ఈ పాదయాత్రలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటుగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్, ఇతర నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ పాదయాత్ర అనంతరం భహిరంగ సభలో రేవంత్ రెడ్డి, దిగ్విజయ్ సింగ్ తదితరులు ప్రసంగిస్తారు. Read: ప్రపంచాన్ని చుట్టేస్తున్న…
ఊహాగానాలకు తెరదించారు ఆ సీనియర్ పొలిటీషియన్. మళ్లీ పాత గూటికే వెళ్తున్నారు. రీఎంట్రీ వెనక కీలక లెక్కలే ఉన్నాయట. భారీ అంచనాలు వేసుకుని.. పైవాళ్ల దగ్గర ఓ మాట అనేసుకుని.. జాయినింగ్కు ముహూర్తం ఫిక్స్ చేసేశారు. ఇంతకీ ఎవరా నాయకుడు? ఆయన వేసుకున్న లెక్కలేంటి? కాంగ్రెస్లోకి తిరిగి ఎందుకొస్తున్నారు? ధర్మపురి శ్రీనివాస్. ఇలా పూర్తి పేరుగా కంటే.. DS అంటే తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా పరిచయం అక్కర్లేని పొలిటీషియన్. సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీతో ప్రయాణించిన ఆయన.. తెలంగాణ…
వానకాలం పంటతో పాటు యాసంగి పంటను కూడా కొనుగోలు చేయాలని కోటి సంతకాల సేకరణ చేయాలని సీఎం కేసీఆర్ చెప్పారు అని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు చట్టాలకు తీరుకు నిరసనగా ఢిల్లీలో రైతులు నిరసనలు చేశారు దెబ్బకు మోడీ దిగివచ్చి క్షమాపణ చెప్పాడు… అదే విదంగా రాష్ట్రంలో కూడా రైతులు ఆందోళన లు చేయాలి. 7 సంవత్సరాల మోడీ ప్రభుత్వం లో ఒక్క ఎఫ్సిఐ గోదాం నిర్మించలేదు అంటే…
కేసీఆర్ ప్రస్తుతం డిప్రెషన్ లో ఉన్నాడు. బీజేపీ అంటే కేసీఆర్ భయపడుతున్నాడనీ ఆ పార్టీ ఎమ్మెల్యే లే చెప్తున్నారు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఔరంగజేబుల వ్యవహరిస్తే శివాజీల సమాధానం చెప్తాం. ఊసరవెల్లిల కేసీఆర్ వ్యవరిస్తున్నారు. బీజేపీ నేతలను ఉరికిస్తవ?ఎలా ఉరికిస్తవో చూస్తాం అని చెప్పారు. తమిళనాడులో ఏనుగు మొట్టి కాయలు వేసినా కేసీఆర్ కు సిగ్గు రాలేదు. నీ తుగ్లక్ పాలన వల్ల, నీ ఆనాలోచిత నిర్ణయాల వల్ల ప్రజలు ఇబ్బందులు…
ఆ మంత్రికి.. కాంగ్రెస్ ఎమ్మెల్యేకు మధ్య అంత కెమిస్ట్రీ ఎలా కుదిరింది? అదేజిల్లాకు చెందిన మంత్రిని నిత్యం టార్గెట్ చేస్తున్నా.. కాంగ్రెస్ ఎమ్మెల్యేతో ఎందుకు కలివిడిగా తిరిగారు? రానున్న రోజుల్లో ఈ పరిణామాలు.. జిల్లా రాజకీయాల్లో మార్పులు తీసుకొస్తాయా? ఇంతకీ ఎవరా మంత్రులు.. ఎవరా కాంగ్రెస్ ఎమ్మెల్యే? ఉమ్మడి మెదక్ జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు జరుగుతూ ఉంటాయి. అధికార, విపక్ష పార్టీల మధ్య వైరమైనా.. స్నేహమైనా హాట్ టాపిక్కే. అలాంటి అరుదైన దృశ్యాలకు సంగారెడ్డి జిల్లాలో…
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి టీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తండ్రి మారయ్య (73) శుక్రవారం అర్ధరాత్రి అనారోగ్యంతో కన్నుమూశారు. గాదరి మారయ్య ఉమ్మడి నల్గొండ జిల్లాలో పీఈటీ మాస్టర్గా సేవలందించారు. ఆయన స్వస్థలం నల్గొండ మండలం నర్సింగ్భట్. ప్రస్తుతం నల్గొండ పట్టణంలో కుటుంబంతో కలిసి జీవిస్తున్న మారయ్యకు శుక్రవారం అర్ధరాత్రి అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. Read Also: మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్కు బీజేపీ ఎమ్మెల్యే వార్నింగ్ కాగా…
హైదరాబాద్ కు తలమానికమయిన ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ ప్రారంభం అయింది. నానక్ రామ్ గూడాలోని వీకే టవర్స్ లో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ట్రస్టీలు – సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ లావు నాగేశ్వర రావు, జస్టిస్ హిమా కోహ్లి, సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జ్ జస్టిస్ ఆర్వీ రవీంద్రన్, హైకోర్టు చీఫ్…
రాయల తెలంగాణ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో వినిపించిన మాట. అప్పట్లో జేసీ దివాకర్రెడ్డి రాయల తెలంగాణ కోసం గట్టిగానే వాదించారు. ఆయన డిమాండ్ వర్కవుట్ కాలేదు. ఇప్పుడు అదే పాటను కొత్తగా అందుకున్నారు జేసీ. ఎందుకలా? జేసీ ఆశిస్తున్నదేంటి? తెరవెనక ఎలాంటి మంత్రాంగం నడుపుతున్నారు? జేసీ మరోసారి రాయల తెలంగాణ చర్చకు పెడుతున్నారా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్న సమయంలో సమైక్య ఆంధ్ర కోసం కొందరు ఉద్యమిస్తే.. మరికొందరు రాయల తెలంగాణ పల్లవి అందుకున్నారు.…