ముచ్చింతల్ లోని శ్రీరామానుజుల విగ్రహ ప్రాంగణానికి వీఐపీల తాకిడి ఎక్కువయింది. సమసమాజ నిర్మాత శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ధి ఉత్సవాల ఏర్పాట్లు శంషాబాద్ మండలం ముచ్చింతల్ చినజీయర్స్వామి ఆశ్రమంలో వేగంగా జరుగుతున్నాయి. ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ మేరకు ముచ్చింతల్లో ఫిబ్రవరి 5వ తేదీన నరేంద్రమోదీ పర్యటన ఖరారైనట్లు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఆశ్రమానికి సమాచారం అందింది. రూ.వెయ్యి కోట్లతో రూపుదిద్దుకుంటున్న 216 అడుగుల పంచలోహ విగ్రహాన్ని ఫిబ్రవరి 5వ తేదీన ప్రధానమంత్రి ఆవిష్కరిస్తారు.…
కోవిడ్ పరిస్థితుల పేరు చెప్పి ప్రభుత్వం స్కూళ్ళు, కాలేజీలకు సెలవులు పొడిగించడం, ఆన్ లైన్ క్లాసులు ప్రారంభించడంపై మిశ్రమస్పందన కనిపిస్తోంది. అవగాహన లేక విచ్చలవిడిగా కోవిడ్ వాహకాలుగా తిరిగి,కొవిడ్ కెంద్రాలుగా తయారు చేస్తున్న వాటిని పట్టించుకోవడం లేదని, విద్యావేత్తలు, తల్లిదండ్రులు ప్రభుత్వాల తీరుపై మండిపడుతున్నారు. సూపర్ మార్కెట్స్, మామూలు మార్కెట్లు, సినిమా థియేటర్స్, మాల్స్,వైన్స్,బార్స్,క్లబ్స్. రాజకీయ సమూహాల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వుందని విమర్శిస్తున్నారు. అవగాహనా ఉండి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ…విద్యానందించే విద్యాసంస్థలను మూసివేయడం, పిల్లల భవిష్యత్తుపై…
సంక్రాంతి పండగ సందర్భంగా భాగ్యనగరంలోని ప్రజలతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో నివసించేవారు స్వగ్రామాలకు వెళ్లారు. అయితే సంక్రాంతి పండగ పూర్తి కావడంతో స్వగ్రామాలకు వెళ్లిన ప్రజలు తిరుగుప్రయాణం అవుతున్నారు. అలాంటి వారి కోసం టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. సొంత గ్రామాలకు వెళ్లిన వారి కోసం 3,500 స్పెషల్ బస్సులను ఏర్పాటు చేసినట్లు టీఆఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రకటించారు. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు స్పెషల్ బస్సులను ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్…
తెలంగాణలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విద్యా సంస్థలకు సంక్రాంతి సెలవులను ఈనెల 30 వరకు ప్రభుత్వం పొడిగించిన సంగతి తెలిసిందే. అయితే సెలవుల పొడిగింపు ప్రకటనను ట్రస్మా (తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్-TRSMA) తీవ్రంగా ఖండించింది. అవగాహన లేకుండా విచ్చలవిడిగా కోవిడ్ వాహకాలుగా తిరిగి కోవిడ్ కేసులను పెంచుతున్న వారిని పట్టించుకోకుండా విద్యాసంస్థలను మూసివేయడమేంటని ప్రభుత్వాన్ని ట్రస్మా ప్రశ్నించింది. Read Also: కోవిడ్ ఎఫెక్ట్: రేపటి నుంచి ఆన్ లైన్ క్లాసులు మార్కెట్లు, సినిమా…
కరోనా మరోసారి పంజా విసురుతోంది.. క్రమంగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ పోతోంది.. ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులను కూడా కరోనా వైరస్ పలకరించింది.. తాజాగా, తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డికి కరోనా పాజిటివ్గా తేలింది.. స్వల్ప లక్షణాలతో బాధపడుతోన్న ఆయనకు తాజాగా నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్గా వచ్చింది.. అయితే, ఎటువంటి సమస్యలు లేనప్పటికీ డాక్టర్ల సూచనల మేరకు హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఐఏజీ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు పోచారం శ్రీనివాస్రెడ్డి..…
తెలంగాణలో కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసురుతోన్న సమయంలో.. మళ్లీ కఠిన ఆంక్షలు విధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది.. ఇప్పటికే వైద్యారోగ్యశాఖ సూచనలతో ఈ నెల 30వ తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు సెలవులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఈ మేరకు సీఎస్ సోమేష్ కుమార్ ఓ ప్రకటన విడుదల చేశారు. సీఎం కేసీఆర్పై తాజా పరిస్థితులపై చర్చించిన ఆయన.. ఆ తర్వాత ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. ఇదే సమయంలో..…
కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతోన్న సమయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది… విద్యా సంస్థలకు సెలవులు పొడిగించాలని నిర్ణయానికి వచ్చింది.. రాష్ట్రంలో సంక్రాంతి సెలవులు ఇవాళ్టితో ముగియనుండగా.. రేపటి నుంచి స్కూళ్లు, విద్యాసంస్థలు ప్రారంభం కావాల్సి ఉంది.. అయితే రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో మరికొద్ది రోజులు సెలవులు పొడిగించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు వార్తలు వచ్చాయి.. వాటిని నిజం చేస్తూ.. ఈ నెల 30వ తేదీ వరకు విద్యా సంస్థల…
రాజధాని హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నట్టుండి భారీ వర్షం కురిసింది.. కొన్ని ప్రాంతాల్లో 14 సెంటీమీటర్లకు పైగా వర్షం పడింది.. నల్లగొండ, సూర్యాపేట, మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి… అత్యధికంగా సూర్యాపేట జిల్లా ఎర్కరాంలో 14.5 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు కాగా.. నల్లగొండ జిల్లా నకిరేకల్లో 11.7 సెంటీ మీటర్లు, మేడ్చల్ జిల్లా కాప్రాలో 11.6 సెం.మీ., రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలో 9 సెం.మీ. నమోదు అయ్యింది..…
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం శ్రీవారి సేవలో పాల్గొన్నారు తమిళిసై సౌందరరాజన్ దంపతులు.. నిన్న సాయంత్రం తిరుమలకు చేరుకున్న తెలంగాణ గవర్నర్ తమిళిసైకి టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. రాత్రి తిరుమలలోనే బస చేసిన తెలంగాణ గవర్నర్.. ఇవాళ ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు.. అనంతరం మీడియాతో మాట్లాడిన తమిళిసై.. ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.. కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న ఈ సమయంలో.. ప్రతీ ఒక్కరు వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు… ప్రజలందరూ…
★ దేశవ్యాప్తంగా ఈరోజు 2,68,833 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అటు పార్లమెంట్లోనూ కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటివరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 850కి చేరింది. వీరిలో 250 మంది సెక్యూరిటీ సిబ్బంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు ★ ఏపీ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 4, 955 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 21,01, 710 కి పెరిగింది. మరోవైపు ఏపీలో కరోనా…