రాష్ట్ర విభజనపై రాజ్యసభలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి హరీష్రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ తెలంగాణపై మరోసారి అక్కసు వెళ్లగక్కారని, అమరుల త్యాగాలను కించపరచారని మండిపడ్డారు. మోదీ వ్యాఖ్యలు గమనిస్తే తెలంగాణను మళ్లీ ఆంధ్రాలో కలిపే కుట్ర చేస్తున్నట్లు అనిపిస్తోందని ఆరోపించారు. రాష్ట్ర సాధన కోసం వేల మంది ప్రాణాలు అర్పించారని, ఆ అమరుల త్యాగాలను మోదీ అవమానిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణపై విషం చిమ్మడమే మోదీ పనిగా పెట్టుకున్నారని మంత్రి హరీష్రావు…
హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ను గురువారం ఉదయం పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. రాష్ట్ర విభజనపై ఇటీవల ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ బుధవారం టీఆర్ఎస్ కార్యకర్తలు చేపట్టిన నిరసనల్లో పలుచోట్ల ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. మోదీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్, టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు పోటాపోటీగా ఆందోళనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో జనగామలో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణల్లో పలువురు బీజేపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. బీజేపీ కార్యకర్తలపై టీఆర్ఎస్ దాడులకు…
★ అమరావతి: నేడు ఉదయం 11 గంటలకు సీఎం జగన్తో సినీ ప్రముఖుల భేటీ… మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, మహేష్బాబు, రాజమౌళి, కొరటాల శివ, ఆర్.నారాయణమూర్తి హాజరయ్యే అవకాశం★ అమరావతి: నేడు కొత్తల జిల్లాల ఏర్పాటు పురోగతిపై అధికారులతో సీఎం జగన్ సమీక్ష★ తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు★ ఏపీలో నేడు కలెక్టరేట్ల వద్ద ఆందోళనలకు నిరుద్యోగ సంఘాల పిలుపు… ఈ నేపథ్యంలో జిల్లాలోని విద్యార్థి సంఘాల నేతలకు నోటీసులు ఇచ్చిన పోలీసులు.. కొన్ని విద్యార్థి…
రాష్ట్ర విభజనపై మరోసారి అక్కసు వెళ్లగక్కిన ప్రధాని నరేంద్ర మోడీ.. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్.. ప్రధావి మోడీవి పనికిమాలిన కూతలుగా పేర్కొన్న ఆయన.. దేశానికి ప్రధానిగా ఇలా మాట్లాడతారా ? అని నిలదీశారు… తల్లిని చంపి బిడ్డను ఇచ్చారని మోడీ ఎనిమిదేళ్ళ క్రితం అన్నారని గుర్తుచేసిన కేటీఆర్.. ఇప్పుడు మళ్లీ అసందర్భంగా మాట్లాడారని దుయ్యబట్టారు.. ప్రధాని నరేంద్ర మోడీ క్షమాపణ చెప్పాల్సిందేన్నారు.. ఇక, విగ్రహావిష్కరణ కోసం…
ఈ దేశంలో రాజకీయ పార్టీలను, ప్రభుత్వాలు ఎక్కువ శాతం నడుపుతోంది హిందువులే… హిందువుల ముందు నిలబడే సామర్థ్యం ఎవరికి లేదని వ్యాఖ్యానించారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్… హైదరాబాద్ శివారులోని ముచ్చింతల్లో రామానుజాచార్య మిలీనియం వేడుకల్లో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మనం సనాత ధర్మంలో అన్ని ఉన్నాయి. దేశంలో ఆలయాల నిర్మాణం జరుగుతోంది. మనం ఎవరో మనం మరిచిపోయాం అంతే.. ఇప్పుడు ప్రతి హిందువు ఇదే మరిచిపోయాడు. తనలోని బలం ఏంటో తనకు తెలియదు.…
కాలుష్య నివారణకు విరివిగా చెట్లు నాటడమే మార్గం అంటున్నారు ఎంపీలు. తెలంగాణలో ప్రారంభమయిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ దేశరాజధానికి విస్తరించింది. దేశ రాజధానిలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో లక్ష మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ భాగస్వామ్యంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వినూత్న కార్యక్రమం చేపట్టింది. ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ తో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు వివిధ రాష్ట్రాలకు చెందిన ఎంపీలు. కాలుష్యంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న దేశ రాజధాని ఢిల్లీలో…
భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత సోషల్ మీడియాలో స్పీడ్ పెంచారు విజయశాంతి.. ముఖ్యంగా అధికార పార్టీ, సీఎం కేసీఆర్ను టార్గెట్ చేస్తూ.. ఆరోపణలు, విమర్శలు గుప్పిస్తున్నారు.. తాజాగా, ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటనకు సీఎం కేసీఆర్ హాజరుకాకపోవడంపై, కేంద్ర బడ్జెట్ తర్వాత సీఎం కేసీఆర్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంపై ట్విట్టర్ వేదికగా ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు రాములమ్మ.. తెలంగాణ సీఎం కేసీఆర్ తీరుతో ఆయన పక్కా హిందూ వ్యతిరేకి అనే విషయం…
తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణగా విడిపోయిన తెలుగు రాష్ట్రాలను మళ్లీ కలిపే కుట్ర జరుగుతోందని.. తెలుగు రాష్ట్రాలను ఉమ్మడి రాష్ట్రంగా చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందంటూ సంచలన ఆరోపణలు చేశారు.. గుజరాత్ కంటే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు వెళ్తుంటే ఓర్వలేక పోతున్నారంటూ.. ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ నేతలపై విమర్శలు గుప్పించిన తలసాని.. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ క్షమాపణలు చెప్పాల్సిందేనని…
గడిచిన ఐదేళ్లలో దేశంలో 655 పోలీస్ ఎన్కౌంటర్లు చోటుచేసుకున్నాయని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ తెలిపారు. ఇందులో ఛత్తీస్గఢ్లో అత్యధికంగా 191 కేసులున్నాయని ఆయన చెప్పారు. జనవరి 1, 2017 నుండి జనవరి 31, 2022 మధ్య కాలంలో ఈ ఎన్కౌంటర్లు జరిగాయన్నారు. 117 ఉత్తరప్రదేశ్లో, అసోంలో 50, జార్ఖండ్లో 49, ఒడిశా 36, జమ్ముకాశ్మీర్ 35, మహారాష్ట్ర 26 ఎన్కౌంటర్ ఘటనలు చోటుచేసుకున్నాయని బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ లోక్సభలో అడిగిన…
ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. ప్రధాని మోడీ అక్కసుతో మాట్లాడారు. అనేక ఇబ్బందులు తట్టుకుని తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్. మోడీ అలా మాట్లాడుతుంటే.. కేసీఆర్ ఎందుకు సైలెంట్ గా వున్నారు. ప్రతీ ఓటు ఇంపార్టెంట్ అనుకునే సమయంలో కూడా కేసీఆర్ పార్లమెంట్ కి పోలేదన్నారు. మోడీ..దేశ ప్రధానిగా కాకుండా అక్కసుతో మాట్లాడారన్నారు. తెలంగాణపై మోడీకి ఉన్న అక్కసు ఈ మాటలతో బయటపడిందన్నారు భట్టి. బిల్లు పాస్ చేసేటప్పుడు..…