ప్రధాని నరేంద్ర మోడీ జాగ్రత్త.. నీ ఉడుత ఊపులకు భయపడం అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు తెలంగాణ సీఎం కేసీఆర్… జనగామ బహిరంగసభ వేదికగా.. కేంద్ర ప్రభుత్వం, బీజేపీ నేతలపై నిప్పులు చెరిగారు కేసీఆర్.. 8 ఏళ్లుగా పైసా ఇవ్వకపోయినా కేంద్రాన్ని ఏమీ అనలేదన్న ఆయన.. అడ్డగోలుగా ధరలు పెంచుతూ ప్రజల నడ్డి విరిచారని మండిపడ్డారు.. ఇప్పుడు విద్యుత్ సంస్కరణల పేరుతో కొత్త పంచాయితీ పెడుతున్నారు.. ప్రతీ మోటారుకు విద్యుత్ మీటరు పెట్టాలంటున్నారని ఫైర్ అయ్యారు.. కానీ,…
జనగామ కలెక్టరేట్ భవన సముదాయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అరుదైన ఘటన చోటు చేసుకుంది… కలెక్టరేట్ ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్తో కలిసి పాల్గొన్నారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి.. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ చేతికి కొబ్బరికాయ అందించారు పూజారి.. ఆ వెంటనే.. తన పక్కనే ఉన్న ఎంపీ కోమటిరెడ్డికి కొబ్బరికాయ ఇచ్చిన కేసీఆర్.. కొట్టాల్సిందిగా సూచించారు.. మొదట నిరాకరించినట్టుగానే కనిపించిన ఆయన.. మీరే కొట్టాలని కోరగా.. మరోసారి సీఎం సూచన చేయడంతో.. వెంటనే టెంకాయను కొట్టేశారు కోమటిరెడ్డి..…
ఉద్యోగులకు శుభవార్త చెప్పారు తెలంగాణ సీఎం కేసీఆర్.. జనగామ కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధిలో ఉద్యోగుల పాత్రను కొనియాడారు… అందరి కృషివల్లే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకుపోతుందున్న ఆయన.. గతంలో కరెంట్ సమస్య ఉండేదని.. ఆ సమస్య లేకుండా చేశామని గుర్తుచేశారు.. ఇక, ఉద్యోగులు చిన్న చిన్న సమస్యలకు బెంబేలెత్తిపోవద్దని సూచించారు ముఖ్యమంత్రి.. తెలంగాణ ఉద్యమ సమయంలో అండగా నిలిచిన ఉద్యోగులను…
తెలంగాణలో ఇప్పటికే ఇంటర్ పరీక్షల షెడ్యూల్ను ప్రకటించగా.. త్వరలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ను కూడా వెల్లడించే అవకాశముంది. ఈ మేరకు మే నెలలో టెన్త్ పరీక్షలు నిర్వహించాలని ఎస్ఎస్సీ బోర్డు సూత్రప్రాయంగా నిర్ణయించింది. మే 9-12 తేదీల మధ్య పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇంటర్ పరీక్షలన్నీ పూర్తయ్యాక.. పదో తరగతి పరీక్షలు పెట్టాలనుకుంటే మే 11, 12 తేదీల్లో ప్రారంభం అవుతాయని సమాచారం. వాస్తవానికి తెలంగాణలో టెన్త్ పరీక్షలు ఏప్రిల్లోనే…
తెలంగాణ ప్రజలకు మంత్రి కేటీఆర్ శుభవార్త అందించారు. ఏప్రిల్ నుంచి కొత్త పింఛన్లు అందజేస్తామని ఆయన ప్రకటించారు. ఇప్పటివరకు పింఛన్ రాని వారికి ఏప్రిల్ నెల నుంచి నగదు అందజేస్తామని తెలిపారు. పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పరిష్కరించి.. కొత్తవి మంజూరు చేస్తామని పేర్కొన్నారు. టీఆర్ఎస్ సర్కారు పింఛన్ మొత్తాన్ని రూ.200 నుంచి రూ.2 వేలకు పెంచిందని.. గతంలో ఏడాదికి రూ.800 కోట్లు ఖర్చుచేస్తే కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక ఏడాదికి ఏకంగా రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తోందని…
★ నేడు మరోసారి హైదరాబాద్ రానున్న ఏపీ సీఎం జగన్.. హైటెక్స్లో మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడి వివాహానికి హాజరుకానున్న జగన్★ ఏపీ వ్యాప్తంగా పీఆర్సీపై ఉపాధ్యాయ సంఘాల నిరసనలు. 27 శాతానికి మించి ఫిట్మెంట్ ఇవ్వాలని డిమాండ్.. నేడు కలెక్టర్లకు వినతిపత్రాల సమర్పణ★ తూ.గో.: నేడు, రేపు అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం.. అమలాపురం, రాజోలు, రావులపాలెం డిపోల నుంచి ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేసిన ఆర్టీసీ అధికారులు★ ప్రకాశం: ఒంగోలులోని జిల్లా ఉపాధి కార్యాలయంలో నేడు…
రాష్ట్ర విభజన సరిగా సాగకపోవడంతో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కొన్ని శాఖల మధ్య వివాదాలు రాజుకుంటూనే వున్నాయి. తాజాగా విద్యుత్ రంగంలో జీపీఎఫ్ వివాదం తెరమీదకు వచ్చింది. తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జీపీఎఫ్ సొమ్ము వెనక్కి ఇవ్వాలని ఏపీ విద్యుత్ సంస్థలకు లేఖ రాశారు తెలంగాణ ట్రాన్స్ కో, జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు. 1999 నుంచి 2014 వరకు తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు దాచుకున్న సొమ్ము రూ. 2900 కోట్లు వుందన్నారు. ఇటీవల ఏపీలోని…
తెలంగాణలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారం చెల్లింపు అంశంపై హైకోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. సిద్దిపేటకు చెందిన సామాజిక కార్యకర్త కొండల్రెడ్డి పిల్పై హైకోర్టు విచారణ జరిపింది. రైతు కుటుంబాలకు పరిహారం చెల్లింపులో జాప్యంపై హైకోర్టు ఆగ్రహం చెందింది. ఏప్రిల్ 6న రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీచేసింది. రూ.6 లక్షలు చెల్లించేలా 2015లో ప్రభుత్వం జీవో ఇచ్చిందన్నారు పిటిషనర్ కొండల్ రెడ్డి. జీవో జారీ చేసి ఆరేళ్లు దాటినా పరిహారం…