Governor: సభలో గవర్నర్ ప్రసంగం ప్రభుత్వ ప్రకటన.. సొంత ప్రసంగం కాదు..
ఎల్లుండి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.. అయితే, ఈ సారి గవర్నర్ ప్రసంగం లేకుండానే అసెంబ్లీ సెషన్ ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.. దీనిపై స్పందించారు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్.. ఇది కొత్త సెషన్ కాదనీ, అంతకుముందు జరిగిన సెషన్కు కొనసాగింపు కాబట్టి, గవర్నర్ ప్రసంగంతో బడ్జెట్ సమావేశాన్ని ప్రారంభించడం సాధ్యం కాలేదని ప్రభుత్వం పేర్కొందని.. ఈ సాంకేతిక అంశం కారణంగా గవర్నర్ ప్రసంగం సాధ్యం కాదని ప్రభుత్వం తెలిపిందన్నారు.. అయితే, ఐదు నెలల తర్వాత సభ సమావేశమవుతోంది, సాధారణ పరిస్థితుల్లో ఇంత సుదీర్ఘ విరామం తర్వాత సభ సమావేశమైనప్పుడు, కొత్త సెషన్ తో సభ జరగాలన్నారు గవర్నర్.. సుదీర్ఘ విరామం ఉన్నప్పటికీ, ప్రభుత్వం మునుపటి సెషన్ను కొనసాగించాలని ఎంచుకుంది, సాంకేతిక కారణాలను ఉటంకిస్తూ సంప్రదాయ గవర్నర్ ప్రసంగాన్ని రద్దు చేసిందన్నారు.
సభలో గవర్నర్ ప్రసంగం అనేది ప్రభుత్వ ప్రకటన… కానీ, గవర్నర్ సొంత ప్రసంగం కాదు అని తన ప్రకటనలో పేర్కొన్నారు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్… ఇది గత సంవత్సరంలో ప్రభుత్వం యొక్క కార్యకలాపాలు, విజయాలు, తదుపరి సంవత్సరానికి సంబంధించిన విధాన సూచికల నివేదిక పత్రం.. ఇది సభ్యులు ప్రసంగంలో పేర్కొన్న పరిపాలన విషయాల గురించి సభలో సభ్యులు అర్ధవంతమైన చర్చను నిర్వహించే అవకాశం కల్పిస్తుందన్నారు.. ఇక, గవర్నర్ ప్రసంగం… ఎన్నికైన సభ్యులకు ప్రభుత్వం బాధ్యతను గుర్తు చేయడం, ప్రజాస్వామ్య సూత్రాలను సమర్థించడంలో ఒక ముఖ్యమైన సాధనంగా అభివర్ణించారు.. ఆర్థిక బిల్లును ప్రవేశపెట్టేందుకు గవర్నర్ సిఫార్సును కోరినప్పుడు, గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.. దురదృష్టవశాత్తు, ఇది అనుకోకుండా జరిగిందని తరవాత ప్రభుత్వం పేర్కొందని.. నోట్ అనుకోకుండా వచ్చిందనడం హాస్యాస్పదంగా ఉందని అసంతృప్తి వ్యక్తం చేశారు.
Also Read
- NTV ఎఫెక్ట్..! డ్యూటీ వదిలి చేపలు పట్టిన 60 మంది CRPF పోలీసుల బదిలీ
- Telangana Legislative Council: ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్, ప్రో. కోదండరాం
- Petrol, Diesel: రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత భయాల వేళ.. సివిల్ సప్లై కమిషనర్ కీలక ప్రకటన
- Traffic Constable: రైతు ఇబ్బంది తీర్చిన ట్రాఫిక్ కానిస్టేబుల్.. స్థానికుల నుంచి ప్రశంసల వర్షం
Read Also: Russia-Ukraine War: పుతిన్ సంచలన వ్యాఖ్యలు..
నేను రాజ్యాంగాన్ని గౌరవిస్తూ, రాజకీయాలకు అతీతంగా, సహకార సమాఖ్య స్ఫూర్తిని కొనసాగిస్తూ, ఆర్థిక బిల్లును ప్రవేశపెట్టడానికి ఆమోదం తెలియజేశానని తెలిపారు గవర్నర్ తమిళిసై.. నా సిఫార్సును ఇవ్వడానికి నేను సమయం తీసుకునే స్వేచ్ఛ నాకు ఉందని.. అయితే, ప్రజా సంక్షేమం ఇమిడి ఉందని, ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆర్థిక బిల్లుకు ఆమోదం తెలిపినట్టు వెల్లడించారు. ఈ బడ్జెట్ సెషన్లో గవర్నర్ ప్రసంగం లేక పోవడం వల్ల, ప్రభుత్వ గత ఏడాది పనితీరుపై చర్చించే అవకాశాన్ని సభ్యులు కోల్పోతున్నారన్న ఆమె.. ఏది ఏమైనా తెలంగాణ ప్రజలకు నా శుభాకాంక్షలు… రాజ్యాంగం గవర్నర్కు కొన్ని అధికారాలు ఇచ్చినప్పటికీ, గవర్నర్ ప్రసంగం నిర్వహించకూడదని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ, నా ప్రాథమిక ఉద్దేశ్యం ప్రజల సంక్షేమం అన్నారు.. అసెంబ్లీలో బడ్జెట్ను సమర్పించడానికి నా సిఫార్సును ఇచ్చానని తెలిపారు.
తాజావార్తలు
-
Robbery: బిగ్ షాక్.. శ్రీ చైతన్య కాలేజీలో దొంగతనం..
-
Angkrish Raghuvanshi: కోపం ఖరీదు.. 20% మ్యాచ్ ఫీజు జరిమానా.!
-
Padma Awards 2027: దేశ అత్యున్నత పౌర పురస్కారాలు.. నేడే నామినేట్ చేసుకోండి.. పూర్తి వివరాలివే!
-
Ola Electric Share: ఒక్కప్పుడు రారాజు.. ఇప్పుడు బికారి! ఓలా ఎలక్ట్రిక్ రూ.157 నుంచి రూ.20 కి?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!