MLA Sanjay : కరీంనగర్లో ఆదివారం జరిగిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఘటనపై జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ స్టేట్మెంట్ని రికార్డు చేశారు కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ.. నిన్న జరిగింది అధికారిక సమావేశమని, నన్ను కౌశిక్ రెడ్టి చేతితో దొబ్బేసాడన్నారు. నిన్నటి మీటింగ్లో కౌశిక్ రెడ్టి నాతో అసభ్యకరంగా ప్రవర్తించాడన్నారు. నిన్నటి సమావేశంలో కౌశిక్ నన్ను నెట్టివేసాడని, కౌశిక్ రెడ్టి ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్.? అని ఆయన…
Padi Kaushik Reddy : బీఆర్ఎస్ నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వివాదాలకు కేంద్రబిందువుగా మారుతున్న నాయకుడిగా నిలుస్తున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ నేతలతో జరిగిన వాగ్వాదాలు, వారిపై సవాళ్లు విసిరి ప్రాచుర్యంలోకి వచ్చిన కౌశిక్ రెడ్డి, తాజాగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్తో జరిగిన అధికారిక కార్యక్రమంలో దురుసుగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ ఘటనకు సంబంధించి సంజయ్ కుమార్ ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఈ వివాదం…
Gangula Kamalakar : నిన్న జరిగిన అధికారిక సమావేశంలో ముగ్గురు మంత్రులు ఉండి కూడా ఫెయిల్ అయ్యారని మాజీ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఇవాళ ఆయన కరీంనగర్ జిల్లాలో మీడియాతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక ఎమ్మెల్యేను ముగ్గురు మంత్రుల ముందు లాక్కుపోవడం దుర్మార్గమైన చర్య అని ఆయన విమర్శించారు. జిల్లా ఇంచార్జీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్నటి మీటింగ్ లో ఫెయిల్ అయ్యారని, కాంగ్రెస్ ప్రభుత్వంలో పోలీస్ రాజ్యం…
Manda Jagannatham : మాజీ పార్లమెంటు సభ్యుడు డాక్టర్ మందా జగన్నాథం (73) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ, హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన కుటుంబంలో భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. 1996లో తెలుగు దేశం పార్టీలో చేరిన ఆయన, మహబూబ్నగర్ జిల్లాలోని నాగర్ కర్నూల్ పార్లమెంటు స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. అనంతరం వరుసగా 1996, 1999, 2004, 2009 ఎన్నికల్లో విజయం సాధించి…
Jagadish Reddy : బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ నాయకులు దాడి జరిపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ఇవాళ ఆందోళనకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో ఆందోళనకు వెళ్తున్న బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. హైదరాబాద్ నుంచి భువనగిరి వెళ్తుండగా, ఘట్కేసర్ వద్ద పోలీసులు జగదీష్ రెడ్డిని అడ్డుకున్నారు. ఈ…
MLC Kavitha : నిజామాబాద్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మూలాలు ఆర్ఎస్ఎస్ లో ఉన్నాయని, అందుకే మైనారిటీల పట్ల ముఖ్యమంత్రి వివక్ష చూపుతున్నట్లున్నారన్నారు. గాంధీల కుటుంబాన్ని చూసి మైనారిటీలు కాంగ్రెస్ కు ఓట్లు వేశారని, కానీ ఇప్పుడు మైనారిటీల నమ్మకాన్ని వమ్ము చేస్తున్న కాంగ్రెస్ అని ఆమె వ్యాఖ్యానించారు. కేసీఆర్ హయాంలో రాష్ట్రంలో ఒక్క మతకల్లోలం కూడా జరగలేదని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే అనేక మతకల్లోలాలు…
Harish Rao : కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నట్టేట్ట ముంచిందని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇవాళ ఆయన సిద్దిపేటలో మీడియాతో మాట్లాడుతూ.. ముంచింది కాక సిగ్గులేకుండా సంబరాలు చేయమంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి అని ఆయన మండిపడ్డారు. రేవంత్ రెడ్డి నుంచి రాహుల్ గాంధీ వరకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చిన నేను బహిరంగ చర్చకు సిద్ధమని, 100 రోజుల్లో అమలు చేస్తామన్న హామీలు రైతులకు అమాలయ్యాయా..? అని ఆయన వ్యాఖ్యానించారు. 15…
Thammineni Veerabhadram : ఈ నెల 25వ తేదీ నుంచి 28వ తేదీ వరకు CPM తెలంగాణ రాష్ట్ర 4వ మహా సభలు జరుగనున్నాయి. జనవరి 25వ తేదీన సంగారెడ్డి PCR గ్రౌండ్ లో ప్రజా ప్రదర్శన బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో.. మహా సభలు బహిరంగ సభ పోస్టర్ను సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ..…
Congress : కాంగ్రెస్ అగ్రనేతలు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ఈనెల 27న తెలంగాణ పర్యటనకు రానున్నారని కాంగ్రెస్ హైకమాండ్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తి కావడంతో ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ నిర్ణయించింది. ఈ సందర్భంగా తెలంగాణలో జరగనున్న ‘సంవిధాన్ బచావో’ ప్రదర్శనలో వారు పాల్గొనబోతున్నారు. Siddipet: కొండపోచమ్మ ప్రాజెక్టులో ఐదుగురు గల్లంతు.. ఘటనపై సీఎం ఆరా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ…
హుజురాబాద్ నియోజకవర్గ రైతులకు ఎస్సారెస్పీ కాలువ ద్వారా నీటిని అందించడంలో ప్రభుత్వం పక్షపాత ధోరణి అవలంబిస్తోందని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం హుజురాబాద్ మండల పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇటీవల కాలంలో కాకతీయ కాలువ ద్వారా నీరు కొనసాగుతున్నప్పటికీ, డీబీఎం 16 ద్వారా హుజురాబాద్ రైతులకు నీరును అందించకుండా నిర్లక్ష్యం చూపుతున్నారని, ఇది అసహనానికి గురిచేస్తోందన్నారు. ఖమ్మం కోసం నీటిని…