CM Revanth Reddy : మంత్రివర్గ విస్తరణపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
- తెలంగాణ కేబినెట్ విస్తరణ కు మరికొంత సమయం పట్టే అవకాశం
- మంత్రివర్గంలో ఎవరెవరు ఉండాలో అధిష్ఠానానిదే నిర్ణయం
- నేను ఎవరిని సిఫార్సు చేయడం లేదు : సీఎం రేవంత్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మంత్రివర్గ విస్తరణ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రివర్గంలో కొత్త సభ్యులను చేరుస్తారా లేదా కొందరిని తప్పిస్తారా అన్న విషయంలో తుది నిర్ణయం హైకమాండ్దే అని స్పష్టం చేశారు. ప్రతిపక్ష నేతల కేసులను చట్ట ప్రకారం ముందుకు తీసుకెళతామని తెలిపారు. తాను సాధ్యమైనంత వరకు అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం కనుగొనడానికి కృషి చేస్తున్నానని చెప్పారు. కుల గణనను సమగ్రంగా, పకడ్బందీగా నిర్వహించామని సీఎం తెలిపారు. అలాగే, పీసీసీ కార్యవర్గ కూర్పు పూర్తయిందని, ఒకట్రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. తనకు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోరలేదని, ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.
Rare Treatment : భళారే.. పురుషాంగాన్ని యువకుడి చేతిపై పుట్టించిన హైదరాబాద్ వైద్యులు..
Also Read
- Corporation Chairmans: కాంగ్రెస్ లో పదవుల పండగ.. 18 మందికి కార్పొరేషన్ చైర్మన్లుగా నియామకం..
- Pakistan Medicine Crisis: పిండి, గ్యాస్ తర్వాత పాకిస్తాన్లో మరో సంక్షోభం.. ప్రజల ప్రాణాలకు ముప్పు..
- CSK: సంజూ కాదు.. ఆ యువ ఆటగాడి ఆట అమోఘం: బ్యాటింగ్ కోచ్ మైఖేల్ హస్సీ
- BJP Bengal Win: పాక్ నుంచి యూఎస్ వరకు.. బీజేపీ బెంగాల్ విక్టరీపై అంతర్జాతీయ చర్చ..
డిసెంబర్ 7, 2023న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కేవలం 11 మందిని మాత్రమే తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు ప్రాతినిధ్యం దక్కలేదు. అప్పట్లో త్వరలో కేబినెట్ విస్తరణ ఉంటుందని సీఎం ప్రకటించినా, ఏడాది గడిచినా దానిని అమలు చేయలేదు. మంత్రివర్గంలో చోటు కోసం ఆశలు పెట్టుకున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి నేతలు అసమ్మతి గళం వినిపించడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో రేవంత్ ఢిల్లీలో “ఇప్పట్లో కేబినెట్ విస్తరణ ఉండదని” ప్రకటించడాన్ని రాజకీయంగా కీలకంగా భావిస్తున్నారు.
కేబినెట్ విస్తరణ పూర్తయితే చోటు దక్కని నేతలు అసంతృప్తికి గురవుతారని, వారి ఆశలు సజీవంగా ఉంచేందుకే విస్తరణను ఆలస్యం చేస్తున్నారని తెలుస్తోంది. ఇటీవల పది మంది ఎమ్మెల్యేల గోప్య సమావేశం, ఢిల్లీలో జూపల్లి కృష్ణారావు ఫిర్యాదు వంటి పరిణామాల కారణంగా పార్టీ హైకమాండ్ ఎలాంటి వివాదాస్పద నిర్ణయం తీసుకోవడానికి సిద్ధంగా లేదని సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణలో రాజకీయ పరిస్థితులు మరింత ఉత్కంఠకు గురి చేస్తున్నాయి.
Nagarjuna : ప్రధాని మోడీని కలిసిన నాగార్జున కుటుంబం.. ఎందుకంటే ?
తాజావార్తలు
-
Jana Nayagan: ‘జననాయగన్’ టైటిల్ కార్డ్తో సోషల్ మీడియా షేక్! దళపతి విజయ్ కాదు.. ఇకపై ‘తమిళనాడు సీఎం’
-
Corporation Chairmans: కాంగ్రెస్ లో పదవుల పండగ.. 18 మందికి కార్పొరేషన్ చైర్మన్లుగా నియామకం..
-
Esther Anil : మోహన్ లాల్’ను పొగడాలంటే వెంకీని తగ్గించాలా?
-
Pakistan Medicine Crisis: పిండి, గ్యాస్ తర్వాత పాకిస్తాన్లో మరో సంక్షోభం.. ప్రజల ప్రాణాలకు ముప్పు..
-
Maa Inti Bangaram: ఇట్స్ అఫీషియల్.. సమంత సినిమా వాయిదా
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!