Harish Rao: సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేఖ..
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
- రూ.2 లక్షల రుణమాఫీ అంతంత మాత్రమే పూర్తి చేశారు- హరీష్ రావు
- రైతు భరోసా పెట్టుబడి సాయానికి కోతలు పెట్టారు- హరీష్ రావు
- బోనస్ డబ్బులను బోగస్ అన్నట్లుగానే ఎగవేస్తున్నారు- హరీష్ రావు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో వరంగల్ రైతు డిక్లరేషన్ పేరిట మీరు అనేక హామీలను ఇచ్చారని.. అందులో రూ.2 లక్షల రుణమాఫీ అంతంత మాత్రమే పూర్తి చేశారని పేర్కొన్నారు. రైతు భరోసా పెట్టుబడి సాయానికి కోతలు పెట్టారని ఆరోపించారు. సన్నవడ్లకు మీరు ఇస్తానన్న బోనస్ డబ్బులను బోగస్ అన్నట్లుగానే ఎగవేస్తున్నారని హరీష్ రావు లేఖలో పేర్కొన్నారు. మీ బోనస్ హామీ ఒక బోగస్ హామీగా మారిపోయిందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 8,64,000 మెట్రిక్ టన్నుల ధాన్యానికి సంబంధిచిన రూ.432 కోట్ల బోనస్ చెల్లింపులు పెండింగ్ లోనే ఉన్నాయని తెలిపారు. వరి ధాన్యం కొనుగోలు నిలిపివేసి దాదాపు 50 రోజులు గడిచిపోతున్నాయి.. కానీ ఇంత వరకు రైతుల ఖాతాల్లో బోనస్ డబ్బలు జమ కాలేదన్నారు. రెండో పంటకు సిద్ధం కావాల్సిన రైతులు బోనస్ డబ్బుల కోసం ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరిగాల్సిన పరిస్థితి దాపురించదని దుయ్యబట్టారు.
Read Also: Thandel : అదరగొడుతున్న నాగ చైతన్య.. బుకింగ్స్ లో దుమ్ము లేపుతున్న “తండేల్”
Also Read
- Mamata Banerjee: ‘‘నన్ను ఆపాలంటే చంపాలి’’.. మమతా దీదీ సంచలన వ్యాఖ్యలు..
- CM Chandrababu: 'స్వర్ణ కుప్పం విజన్ 2029'కు శ్రీకారం.. కుప్పం రూపురేఖలు మార్చే మాస్టర్ ప్లాన్పై సీఎం సమీక్ష
- Mumbai: భారీ వర్షాలతో ఆర్థిక రాజధాని అతలాకుతలం.. 12 గంటల్లో 200 మి.మీ రికార్డ్ వర్షం
- PoK: పీఓకేలో పాక్ అణచివేత.. భారత్ జోక్యం కోరిన JAAC
నిన్నటికి నిన్న మహబూబ్ నగర్ జిల్లాలో ముచ్చింతల రైతులు తమ వడ్లు అమ్మి రెండు నెలలు అయినా ప్రభుత్వం బోనస్ చెల్లించడం లేదంటూ జిల్లా కలెక్టరును కలిస్తే బోనస్ డబ్బులు పెండింగ్లో ఉన్నది నిజమే.. ప్రభుత్వం విడుదల ఆలస్యం అవుతుందని సమాధానం ఇచ్చారని అన్నారు. ప్రభుత్వాన్ని నమ్మి ధాన్యాన్ని విక్రయిస్తే, తమను ప్రభుత్వం మోసం చేసిందని రైతులు ఆందోళన చెందుతున్నారని హరీష్ రావు లేఖలో తెలిపారు. వరంగల్ రైతు డిక్లరేషన్ అబద్ధమా..? మీరిచ్చిన బాండ్ పేపర్ బూటకమా..? సమాధానం చెప్పాలని కోరారు. కేసీఆర్ పాలనలో రైతులంతా గుండె ధైర్యంతో వ్యవసాయాన్ని పండగలా చేశారని తెలిపారు. కానీ మీ పాలనలో వ్యవసాయం దండగలా మారి రైతు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని హరీష్ రావు ఆరోపించారు. రైతులు పడుతున్న ఇబ్బందులను చూసి వారి పక్షాన తక్షణమే హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు హరీష్ రావు లేఖలో పేర్కొన్నారు.
Read Also: Congress: తమ ఓటమి బాధ కన్నా, ఆప్ ఓటమితో కాంగ్రెస్ ఆనందం.. కారణం ఏంటంటే…
కాంగ్రెస్ పాలనపై తీవ్ర విమర్శలు..
కాంగ్రెస్ పార్టీ తవ్వుకున్న గ్యారెంటీల గోతిలో తానే సమాధి అవుతున్నదని హరీస్ రావు విమర్శించారు. ఇక్కడి గ్యారెంటీల వైఫల్యం హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీలో ఎఫెక్ట్ పడిందని తెలిపారు. తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీని గాల్లో కలపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీది జగమంత పాలన.. కాంగ్రెస్ పార్టీది సగమంత పాలన అని విమర్శించారు.. తమది అసలు పాలన మీది కోసరు పాలన అని అన్నారు. సంక్షేమం, సంపూర్ణం, సంతోషం, సంతృప్తి ఇది బీఆర్ఎస్ విధానమని తెలిపారు. సంక్షోభం, అసంపూర్ణం, అసంతృప్తి, అసహనం ఇది కాంగ్రెస్ విధానం అని దుయ్యబట్టారు.
తాజావార్తలు
-
OTR : అనంతపురం జిల్లా వైసీపీలో తోపుదుర్తి ఒంటరి అయ్యారా?
-
Mamata Banerjee: ‘‘నన్ను ఆపాలంటే చంపాలి’’.. మమతా దీదీ సంచలన వ్యాఖ్యలు..
-
TGEAPCET 2026: ఇంజినీరింగ్ మాక్ సీట్ల కేటాయింపు విడుదల.. పూర్తి వివరాలు ఇవే!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Kannappa: యూట్యూబ్లో విష్ణు మంచు ‘కన్నప్ప’
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!
-
Crispy Onion Pakoda Recipe: బయట చల్లటి వర్షం.. ఇంట్లో వేడి వేడి ఉల్లిపాయ పకోడీ.! హోటల్ స్టైల్లో క్రిస్పీగా చేసేయండి ఇలా..