Harish Rao: సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేఖ..
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
- రూ.2 లక్షల రుణమాఫీ అంతంత మాత్రమే పూర్తి చేశారు- హరీష్ రావు
- రైతు భరోసా పెట్టుబడి సాయానికి కోతలు పెట్టారు- హరీష్ రావు
- బోనస్ డబ్బులను బోగస్ అన్నట్లుగానే ఎగవేస్తున్నారు- హరీష్ రావు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో వరంగల్ రైతు డిక్లరేషన్ పేరిట మీరు అనేక హామీలను ఇచ్చారని.. అందులో రూ.2 లక్షల రుణమాఫీ అంతంత మాత్రమే పూర్తి చేశారని పేర్కొన్నారు. రైతు భరోసా పెట్టుబడి సాయానికి కోతలు పెట్టారని ఆరోపించారు. సన్నవడ్లకు మీరు ఇస్తానన్న బోనస్ డబ్బులను బోగస్ అన్నట్లుగానే ఎగవేస్తున్నారని హరీష్ రావు లేఖలో పేర్కొన్నారు. మీ బోనస్ హామీ ఒక బోగస్ హామీగా మారిపోయిందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 8,64,000 మెట్రిక్ టన్నుల ధాన్యానికి సంబంధిచిన రూ.432 కోట్ల బోనస్ చెల్లింపులు పెండింగ్ లోనే ఉన్నాయని తెలిపారు. వరి ధాన్యం కొనుగోలు నిలిపివేసి దాదాపు 50 రోజులు గడిచిపోతున్నాయి.. కానీ ఇంత వరకు రైతుల ఖాతాల్లో బోనస్ డబ్బలు జమ కాలేదన్నారు. రెండో పంటకు సిద్ధం కావాల్సిన రైతులు బోనస్ డబ్బుల కోసం ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరిగాల్సిన పరిస్థితి దాపురించదని దుయ్యబట్టారు.
Read Also: Thandel : అదరగొడుతున్న నాగ చైతన్య.. బుకింగ్స్ లో దుమ్ము లేపుతున్న “తండేల్”
Also Read
- Bhatti Vikramarka: సింగరేణి 128 మంది ఉద్యోగుల భవితవ్యంపై నిర్ణయం.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన.!
- Gold and Silver Price Today: మరింత తగ్గిన బంగారం ధరలు.. నేటి గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవే
- Srisailam Temple: శ్రీశైలం మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు
- TDP Leadership Conclave: ఎమ్మెల్యేలకు చంద్రబాబు టాస్క్.. స్థానిక ఎన్నికల్లో గెలవాల్సిందే.. లేదంటే పని చేయనట్టే..!
నిన్నటికి నిన్న మహబూబ్ నగర్ జిల్లాలో ముచ్చింతల రైతులు తమ వడ్లు అమ్మి రెండు నెలలు అయినా ప్రభుత్వం బోనస్ చెల్లించడం లేదంటూ జిల్లా కలెక్టరును కలిస్తే బోనస్ డబ్బులు పెండింగ్లో ఉన్నది నిజమే.. ప్రభుత్వం విడుదల ఆలస్యం అవుతుందని సమాధానం ఇచ్చారని అన్నారు. ప్రభుత్వాన్ని నమ్మి ధాన్యాన్ని విక్రయిస్తే, తమను ప్రభుత్వం మోసం చేసిందని రైతులు ఆందోళన చెందుతున్నారని హరీష్ రావు లేఖలో తెలిపారు. వరంగల్ రైతు డిక్లరేషన్ అబద్ధమా..? మీరిచ్చిన బాండ్ పేపర్ బూటకమా..? సమాధానం చెప్పాలని కోరారు. కేసీఆర్ పాలనలో రైతులంతా గుండె ధైర్యంతో వ్యవసాయాన్ని పండగలా చేశారని తెలిపారు. కానీ మీ పాలనలో వ్యవసాయం దండగలా మారి రైతు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని హరీష్ రావు ఆరోపించారు. రైతులు పడుతున్న ఇబ్బందులను చూసి వారి పక్షాన తక్షణమే హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు హరీష్ రావు లేఖలో పేర్కొన్నారు.
Read Also: Congress: తమ ఓటమి బాధ కన్నా, ఆప్ ఓటమితో కాంగ్రెస్ ఆనందం.. కారణం ఏంటంటే…
కాంగ్రెస్ పాలనపై తీవ్ర విమర్శలు..
కాంగ్రెస్ పార్టీ తవ్వుకున్న గ్యారెంటీల గోతిలో తానే సమాధి అవుతున్నదని హరీస్ రావు విమర్శించారు. ఇక్కడి గ్యారెంటీల వైఫల్యం హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీలో ఎఫెక్ట్ పడిందని తెలిపారు. తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీని గాల్లో కలపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీది జగమంత పాలన.. కాంగ్రెస్ పార్టీది సగమంత పాలన అని విమర్శించారు.. తమది అసలు పాలన మీది కోసరు పాలన అని అన్నారు. సంక్షేమం, సంపూర్ణం, సంతోషం, సంతృప్తి ఇది బీఆర్ఎస్ విధానమని తెలిపారు. సంక్షోభం, అసంపూర్ణం, అసంతృప్తి, అసహనం ఇది కాంగ్రెస్ విధానం అని దుయ్యబట్టారు.
తాజావార్తలు
-
Shaque: అనుమానాలతో పిచ్చెక్కించడానికి వస్తున్న పరిణీతి చోప్రా మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
Best Scooters for Women: మహిళలకు బెస్ట్ స్కూటర్లు ఇవే.. స్టైలిష్ లుక్, మంచి మైలేజ్తో అదిరిపోయే మోడల్స్!
-
Bhatti Vikramarka: సింగరేణి 128 మంది ఉద్యోగుల భవితవ్యంపై నిర్ణయం.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన.!
-
JrNTR : ఆదర్శకుటుంబానికి తోడుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్
-
Asia Cup 2026: జిత్తులమారి వస్తున్నాడు.. టీమిండియాకు మరోసారి ట్రోఫీ వివాదం తప్పదా?
ట్రెండింగ్
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!
-
990 గ్రా.లకే ThinkBook..! మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్తో Lenovo IdeaPad Vibe సిరీస్ వచ్చేసింది.!
-
JIO: అదిరిపోయే ఆఫర్.. 5TB క్లౌడ్ స్టోరేజ్, 18 నెలల AI సబ్స్క్రిప్షన్, 2.5GB డైలీ డేటాతో ఏడాదిపాటు..!