Thummala Nageswara Rao: కార్యకర్తలు కూడా అధికారాన్ని అనుభవించాలి.. పార్టీని బ్రతికించుకోవాలి
- ఖమ్మం నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి మంత్రి తుమ్మల హాజరు
- లాఠీ దెబ్బలకు భయపడకుండా కాంగ్రెస్ కోసం పనిచేశారు- తుమ్మల నాగేశ్వరరావు
- కార్యకర్తలు కూడా అధికారాన్ని అనుభవించాలి- తుమ్మల నాగేశ్వరరావు
- గౌరవంగా తలెత్తుకుని ఉండే విధంగా పనిచేయాలి- తుమ్మల నాగేశ్వరరావు
- ప్రతిపక్షానికి అవకాశం లేకుండా కృషి చేసి ఆ కుర్చీలో మనం కూర్చోవాలి
- ఎన్నికలు ఛాలెంజ్ గా తీసుకోవాలి- తుమ్మల నాగేశ్వరరావు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఖమ్మం నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో నగర మేయర్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు, గిడ్డంగుల సంస్థ చైర్మన్, కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. లాఠీ దెబ్బలకు భయపడకుండా కాంగ్రెస్ కోసం కార్యకర్తలు పనిచేశారు.. కార్యకర్తలు కూడా అధికారాన్ని అనుభవించాలని అన్నారు. గౌరవంగా తలెత్తుకుని ఉండే విధంగా పనిచేయాలి.. ప్రతిపక్షానికి అవకాశం లేకుండా కృషి చేసి ఆ కుర్చీలో మనం కూర్చోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఎన్నికలను ఛాలెంజ్గా తీసుకోవాలి..
పదవిని పిలిచి ఇచ్చే రోజులు వస్తాయని కార్యకర్తలకు సూచించారు.
Read Also: Raviteja : అన్నయ్య కోసం భారీ త్యాగం చేసిన తమ్ముడు
Also Read
- Khammam Police : ఖమ్మంలో ఖాకీ కుంభకోణం.. పోలీసులే దోపిడీ ముఠాలో కీలక సభ్యులు
- Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రైల్వే బ్రిడ్జిని ఢీ కొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.!
- Bhatti Vikramarka : జర్నలిస్టులకు ఇళ్లు, ‘రాజీవ్ ఆరోగ్యశ్రీ’కి నెలకు రూ.150 కోట్లు.!
- Bhatti Vikramarka : ప్రజల చుట్టూ తిరిగే బడ్జెట్ ఇది.. ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తాం
ఎమ్మెల్యే టికెట్ రాని వాళ్ళు ఎంపీలు అయ్యారు.. పార్టీని బ్రతికించుకోవాలని కార్యకర్తలకు మంత్రి తుమ్మల తెలిపారు. తల్లిని కూడా మోసం చేసే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి.. పార్టీకి ద్రోహం చేస్తే తల్లికి ద్రోహం చేసినట్లు గుర్తించాలన్నారు. తనను కాంగ్రెస్ పార్టీ అక్కున చేర్చుకుంది.. నిబద్ధతగా పని చేస్తానని చెప్పారు. పార్టీ క్రమశిక్షణ గల వారికి ప్రాధాన్యత ఉంటుంది.. అవకాశవాదులను నమ్మరాదని మంత్రి అన్నారు. అధికారాన్ని అస్థగతం చేసుకోవాలని కార్యకర్తలకు చెప్పారు. సీఎం శక్తికి మించి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు.. దేశంలోనే రికార్డు స్థాయిలో ఏ రాష్ట్రంలో లేనటువంటి సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
Read Also: Harish Rao: సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేఖ..
మరోవైపు.. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మనకు కావలసిన నిధులు ఇవ్వడం లేదు.. నీటిపారుదల ఇరిగేషన్ రోడ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల పాజిటివ్గా లేదని తెలిపారు. గుండె ధైర్యంతోని సొంత కాళ్ళ మీద నిలబడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల కోరికలు తీరుస్తున్నారని అన్నారు. కార్యకర్తలు అడిగిన ప్రతి పని బాకీ లేకుండా పూర్తి చేస్తానని చెప్పారు. ఖమ్మం నియోజకవర్గానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ.1400 కోట్లు ఇచ్చారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
తాజావార్తలు
-
Nara Lokesh : ప్రవాసాంధ్రులంతా ఏపీ బ్రాండ్ అంబాసిడర్లే..
-
Kishan Reddy : మజ్లిస్ ను ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో రేవంత్ ప్రభుత్వం
-
Kapil Dev: విరాట్ కోహ్లీ తొందరపడ్డాడు.. 37 ఏళ్ల వయసులో ఆ రేంజ్ ఫామ్ పెట్టుకుని ఏంటా నిర్ణయం?
-
Pakistan: పాక్ ఎయిర్ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ అసిమ్ తారిఖ్ హతం..
-
Colleges Closed: బిగ్షాక్.. దేశవ్యాప్తంగా 58 ఇంజనీరింగ్ కళాశాలలు మూసివేత.. తెలంగాణ, ఏపీ నుంచి ఎన్నంటే..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!