BRS: బీసీల రిజర్వేషన్ల అంశంపై సీఎస్కు బీఆర్ఎస్ వినతిపత్రం..
- సెక్రటేరియట్లో సీఎస్ శాంతికుమారిని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు
- కుల గణనలో బీసీల సంఖ్యను తగ్గించి చూపించిన కుట్రను సరి చేయాలని వినతిపత్రం
- 42 శాతం రిజర్వేషన్లు అమలుపర్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సెక్రటేరియట్లో సీఎస్ శాంతికుమారితో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు సమావేశం అయ్యారు. అనంతరం సీఎస్కు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీ ప్రకారం 42 శాతం రిజర్వేషన్లు అమలుపర్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని.. కుల గణనలో బీసీల సంఖ్యను తగ్గించి చూపించిన కుట్రను సరి చేయాలని సీఎస్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మధుసుదనా చారి మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి పాలనకు కొత్త భాష్యం చెప్తున్నారు.. పాలన అంటే భక్షించడం, శిక్షించడంలా చేస్తున్నారని ఆరోపించారు. అధికారంలోకి రావడమే లక్ష్యంగా అనేక హామీలిచ్చారని పేర్కొన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని సీఎస్ను కోరామని మధుసుదనా చారి తెలిపారు. ప్రభుత్వానికి బీసీలపై చిత్తశుద్ధి లేదు.. కులగణన రీ సర్వే జరపాలి, బీసీలకు ద్రోహం చేసే చర్యలను సహించమని పేర్కొన్నారు.
Read Also: Kishan Reddy: కాంగ్రెస్ డబుల్ హ్యాట్రిక్ జీరో సాధించింది..
Also Read
మాజీ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. బీసీల పేరుతో బీసీలను కాంగ్రెస్ దగా చేసిందని మండిపడ్డారు. కామారెడ్డి డిక్లరేషన్ కాంగ్రెస్ మర్చిపోయినా.. తాము మర్చిపోలేదన్నారు. సర్వే పూర్తి స్థాయిలో జరగలేదు.. మళ్ళీ రీ సర్వే చేయాలని తెలిపారు. బీసీలకు న్యాయం జరగాలంటే బీసీ డెడికేషన్ డే పేరుతో సర్వే చేయాలని డిమాండ్ చేశారు. బీసీలను తొక్కే కుట్ర జరుగుతుంది. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తమిళనాడు తరహా కాంగ్రెస్ ఇచ్చిన హామీ నెరవేర్చాలి.. చట్ట బద్ధంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చాకే పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలని తెలిపారు. కేంద్రం కాళ్లు మొక్కి అయినా బీసీలకు 42 శాతం చట్టబద్ధంగా అమలు చేయాలని పేర్కొన్నారు.
Read Also: Libiya : లిబియాలో కుప్పలు కుప్పలుగా శవాలు.. వలసదారులవని అనుమానం
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!