Kishan Reddy : ఢిల్లీలో కాంగ్రెస్ నిర్వహించిన జంతర్ మంతర్ సభపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఈ సభ బీసీల సమస్యలకన్నా గాంధీ కుటుంబాన్ని పొగడటానికే పరిమితమైందని ఆయన వ్యాఖ్యానించారు. కిషన్ రెడ్డి మాట్లాడుతూ, “రాష్ట్రంలో ఎదురవుతున్న రాజకీయ ఒత్తిడిని తట్టుకునేందుకు, గాంధీ కుటుంబం అనుగ్రహం పొందాలన్న లక్ష్యంతోనే రేవంత్ ఢిల్లీ సభ పెట్టుకున్నాడు. 31 నిమిషాల ప్రసంగంలో సగానికి పైగా రాహుల్, సోనియా పేర్లే జపించాడు” అని విమర్శించారు. “బీసీ…
Rajasingh : గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీసీ రిజర్వేషన్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ఢిల్లీలో బీసీల కోసం నిర్వహిస్తున్న ధర్నాకు కాంగ్రెస్కు ధన్యవాదాలు తెలుపుతూ, అయితే బీసీ కోటాలో ముస్లింలకు రిజర్వేషన్లు ఎందుకు ఇస్తున్నారో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. “42 శాతం బీసీ రిజర్వేషన్లలో 10 శాతం ముస్లింలకు ఎందుకు ఇస్తున్నారు? ముస్లింలు బీసీలా? బీసీల రిజర్వేషన్ల సాధన కోసం డిల్లీకి వెళ్లారా, లేక ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వడానికే వెళ్లారా? దీనిపై సీఎం రేవంత్…
Singireddy Niranjan Reddy : కాలేశ్వరం ప్రాజెక్ట్పై ఘోష్ కమిషన్ నివేదికను ఆధారంగా చేసుకుని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలకు బీఆర్ఎస్ నేతలు ఘాటుగా ప్రతిస్పందించారు. ఈ నివేదికను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటూ సంస్థల విశ్వసనీయతను దెబ్బతీస్తున్నారని వారు ఆరోపించారు. ముఖ్యంగా నీటి పారుదల శాఖ మంత్రి నుత్తకంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ నేతలు తప్పుబట్టారు. మాజీ మంత్రి ఎస్. నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ, “1952 నాటి కమిషన్స్ ఆఫ్ ఇన్క్వయిరీ…
Harish Rao : బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మాజీ మంత్రి, సీనియర్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిపై ప్రభుత్వం చూపిన వైఖరి అవమానకరమని, సిగ్గుచేటని ఆయన అన్నారు. ఈ ఘటనకు ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి, గృహశాఖ బాధ్యతలు కూడా చేపట్టిన వ్యక్తిగా, నిస్సందేహ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. “మహిళా ఎమ్మెల్యేను బహిరంగంగా అవమానించడానికి, వేధించడానికి ఒక మంత్రి సమక్షంలోనే అనుమతించడం ఏమిటి? అంతేకాదు, పోలీసుల…
హరీష్ మాటలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలపై బీఆర్ఎస్కు చులకనభావం.. చట్టసభలు, న్యాయస్థానాలంటే కూడా గౌరవం లేదని మండిపడ్డారు. న్యాయ వ్యవస్థ మీద నమ్మకం లేదని.. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి సారధ్యంలో నియమించిన జ్యుడిషియల్ కమిషన్ అంటే కూడా లెక్కలేదన్నారు.
ఢిల్లీ – భారతదేశంలో ఇకపైన జరిగే ప్రతి ఎన్నిక బ్యాలెట్ పేపర్ విధానంలోనే జరగాలని డిమాండ్ చేశారు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బ్యాలెట్ విధానాన్ని బీహార్ అసెంబ్లీ ఎన్నికల నుంచే ప్రవేశపెట్టాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కేటీఆర్ కోరారు. ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం ఆహ్వానం మేరకు బిఆర్ఎస్ నేతల బృందం కేటీఆర్ నేతృత్వంలో ఈసీ అధికారులతో సమావేశం అయింది. దేశంలో ఎన్నికల వ్యవస్థ, నూతన సంస్కరణలు, ఎన్నికల నియమావళి వంటి అంశాలపై కేంద్ర…
ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘంతో కేటీఆర్, పలువురు బీఆర్ఎస్ నాయకులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆహ్వానం మేరకు సమావేశానికి వచ్చాం.. దేశంలో ఎన్నికలు జరుగుతున్న పరిస్థితులు.. తీసుకురావాల్సిన సంస్కరణలు పై స్వేచ్ఛగా వివరించామన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలు బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహిస్తున్నారు..
సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. నర్సారెడ్డి తనను కులం పేరుతో దూషిస్తూ, చంపేస్తామని బెదిరించాడంటూ గజ్వేల్ పీఎస్లో కాంగ్రెస్ ఎస్సీ సెల్ నేత విజయ్కుమార్ ఫిర్యాదు చేశారు.
Harish Rao : కాళేశ్వరం ప్రాజెక్టుపై వచ్చిన తాజా నివేదికను మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. గత 20 నెలలుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనను “గాలికి వదిలేసి” రాజకీయ కక్షలు సాధించేందుకే కమిషన్లను ఏర్పాటు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. డబ్బులు దంచుకోవడానికీ, ప్రతిపక్షాలపై కేసులు పెట్టడానికీ ఈ కమిషన్లు సాధనంగా మారాయని అన్నారు. హరీష్ రావు మాట్లాడుతూ, “పార్లమెంట్ ఎన్నికల ముందు ఒక రిపోర్ట్, బీఆర్ఎస్ రాజతోత్సవ సభ ముందు ఒక రిపోర్ట్,…
Ramchander Rao : తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై విచారణ కమిషన్ నివేదిక హాట్ టాపిక్గా మారింది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదురుతున్న వేళ, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ఈ అంశంపై స్పందించారు. నివేదిక లీకులపై తమకు ఎలాంటి ఆసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. “ప్రభుత్వం కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాతే మేము స్పందిస్తాం. ఇప్పుడే బయటకు వస్తున్న ఈ నివేదిక ప్రభుత్వానిదా? లేక కాంగ్రెస్దా?” అని ఆయన…