MLA Raja Singh: రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే రాజకీయ సన్యాసం చేస్తా.. రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Raja Singh: తనను టార్గెట్ చేస్తూ బీజేపీ ఆఫీస్ లో ప్రెస్ మీట్ పెట్టారని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు.. తాను బీజేపీకి రాజీనామా జరగడానికి కారణం అందులో తప్పులు జరుగుతున్నాయని తెలిపారు.. బీజేపీ కార్యకర్తలను పక్కన పెడుతున్నారని రాజీనామా చేసినట్లు వెల్లడించారు. ఇంకా ఎన్ని రోజులు తనను టార్గెట్ చేస్తారని అడిగారు. తాను బీజేపీ కార్యకర్తల కోసం మాట్లాడానన్నారు. బీజేపీ రాష్ట్ర కమిటీలో 10 నుంచి 12 మందిని సికింద్రబాద్ పార్లమెంట్ నుంచి తీసుకున్నారని చెప్పారు.
READ MORE: Supreme Court: ‘‘ మన రాజ్యాంగం గర్వకారణం’’.. నేపాల్, బంగ్లాలను ఉదహరించిన సుప్రీంకోర్టు..
Also Read
ఇంతకీ ఇది రామ చందర్ రావు కమిటీ నా? మా కిషన్ రెడ్డి వేసిన కమిటీ నా? అని ప్రశ్నించారు. ఈ కమిటీతో బీజేపీ ప్రభుత్వాన్ని తెలంగాణలో తీసుకువస్తారా అన్నారు. ఒక వేళ తీసుకొస్తే నేను రాజకీయ సన్యాసం చేస్తా అని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయన్నారు. పార్టీని సర్వనాశనం చేస్తున్నారని వారు ఫోన్ చేసి చెబుతున్నారు. ఎంపీలు ఈ కమిటీతో సంతృప్తిగా ఉన్నారని చెప్పారు. ఆ విషయాన్ని బయటకు చెప్పారన్నారు.
READ MORE: Jagtial: గణపతి చందా ఇవ్వలేదని కులం నుంచి బహిష్కరణ.. ఎవరైనా మాట్లాడితే రూ.25వేలు ఫైన్..!
“రామ చందర్ రావు వెనుక కొందరు ఉండి పార్టీని నడిపించాలని అనుకుంటున్నారు. డబ్బులు ఇచ్చి సోషల్ మీడియాను నడిపిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి వేముల అశోక్ మాట్లాడే పద్ధతి సరిగా లేదు. బీబీ నగర్ ఎయిమ్స్ లో పోస్ట్ లు ఇప్పిస్తానని రూ. మూడు లక్షలు తీసుకున్నారని మీపై ఆరోపణలు ఉన్నాయి. భార్యతో కలిసి రామచందర్ రావు ఇంటికి వెళ్లి కిరోసిన్ పోసుకున్నారట. నేను నాలుగో సారి పోటీ చేయాలా వద్దా? అని ఆలోచిస్తా. నన్ను గెలిపించింది మా బీజేపీ కార్యకర్తలే.. మళ్ళీ కూడా గెలిపిస్తారు. మా పార్టీ బాగు పడాలనేది నేను అనుకుంటున్న. అధికారంలోకి రావాలనే నా కోరిక.. నేను ఎమ్మేల్యే గా రాజీనామా చేయను. కిషన్ రెడ్డి రాజీనామా చేస్తే నేను రాజీనామా చేస్తా.” అని రాజాసింగ్ వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!