Formula ERace : ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ దూకుడు..
- 9 నెలల విచారణ అనంతరం ఏసీబీ కీలక నివేదిక ప్రభుత్వానికి సమర్పణ
- కేటీఆర్, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్పై పలు సార్లు విచారణ
- స్పాన్సర్ కంపెనీ నుంచి రూ.44 కోట్ల ఎలక్టోరల్ బాండ్లు – క్విడ్ ప్రో కో నిర్ధారణ
- ఛార్జిషీట్ దాఖలు నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వ ఉత్కంఠ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Formula ERace : ఫార్ములా ఈ కార్ రేస్కు సంబంధించిన కేసులో తెలంగాణ ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) దర్యాప్తు వేగవంతం చేసింది. సుదీర్ఘంగా 9 నెలల పాటు సాగిన విచారణ అనంతరం, ఈ కేసులో కీలక నివేదికను ఏసీబీ ప్రభుత్వానికి సమర్పించింది. నివేదికలోని అంశాల ఆధారంగా, అప్పటి మంత్రి కేటీఆర్తో పాటు పలువురిపై ఛార్జిషీట్ దాఖలు చేయడానికి అనుమతి కోరింది. ప్రభుత్వం నుండి అనుమతి రాగానే ఛార్జిషీట్ దాఖలు చేయనున్నట్లు ఏసీబీ వర్గాలు తెలిపాయి. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠకు దారితీసింది.
Sweden: షాకింగ్ ఘటన.. ప్రెస్మీట్లో ఉండగా కుప్పకూలిన స్వీడన్ మంత్రి.. వీడియో వైరల్
Also Read
- Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
- OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
- OTR: సీఎం టూర్.. శాసనమండలి ఛైర్మన్కు మరోసారి ప్రోటోకాల్ ఇబ్బంది.!
- IPS Transfers: తెలంగాణలో 26 మంది IPSల బదిలీ.. ఎవరికి ఏ పోస్టింగ్.?
ఈ కేసులో ఏసీబీ, అప్పటి ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ను ఇప్పటికే నాలుగు సార్లు విచారించింది. అలాగే, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ను ఐదు సార్లు విచారించి వారి స్టేట్మెంట్లను రికార్డ్ చేసింది. వీరితో పాటు బీఎల్ఎన్ రెడ్డి, కిరణ్ రావు, ఫార్ములా ఈ ఆర్గనైజర్లను (FEOలు) కూడా విచారించినట్లు ఏసీబీ నివేదికలో పేర్కొంది. ఏసీబీ విచారణలో ఫార్ములా ఈ రేస్ నిర్వహణలో క్విడ్ ప్రో కో (ఎవరో ఒకరు ఏదో ఇస్తే, దానికి ప్రతిఫలంగా మరొకరు వారికి ఏదో ఇవ్వడం) జరిగిందని నిర్ధారించినట్లు సమాచారం. ఈ రేసుకు స్పాన్సర్గా ఉన్న కంపెనీ, అప్పటి అధికార పార్టీకి రూ. 44 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లను చెల్లించినట్లు ఏసీబీ గుర్తించింది.
ఈ లావాదేవీలు క్విడ్ ప్రో కోకు నిదర్శనమని ఏసీబీ తన నివేదికలో స్పష్టం చేసింది. ఏసీబీ తమ నివేదికను ఇప్పటికే ప్రభుత్వానికి అందజేసింది. ఈ నివేదికపై అడ్వకేట్ జనరల్తో న్యాయ సలహా తీసుకున్న ప్రభుత్వం, త్వరలో దీనిపై ఒక నిర్ణయం తీసుకోనుంది. ప్రభుత్వం నుండి అనుమతి రాగానే కేటీఆర్, అరవింద్ కుమార్ సహా నిందితులపై ఏసీబీ ఛార్జిషీట్ దాఖలు చేస్తుంది. ఈ కేసులో కఠిన చర్యలకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ నివేదికను గవర్నర్కు కూడా ఏసీబీ అందజేసినట్లు సమాచారం.
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!