Formula ERace : ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ దూకుడు..
- 9 నెలల విచారణ అనంతరం ఏసీబీ కీలక నివేదిక ప్రభుత్వానికి సమర్పణ
- కేటీఆర్, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్పై పలు సార్లు విచారణ
- స్పాన్సర్ కంపెనీ నుంచి రూ.44 కోట్ల ఎలక్టోరల్ బాండ్లు – క్విడ్ ప్రో కో నిర్ధారణ
- ఛార్జిషీట్ దాఖలు నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వ ఉత్కంఠ
Formula ERace : ఫార్ములా ఈ కార్ రేస్కు సంబంధించిన కేసులో తెలంగాణ ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) దర్యాప్తు వేగవంతం చేసింది. సుదీర్ఘంగా 9 నెలల పాటు సాగిన విచారణ అనంతరం, ఈ కేసులో కీలక నివేదికను ఏసీబీ ప్రభుత్వానికి సమర్పించింది. నివేదికలోని అంశాల ఆధారంగా, అప్పటి మంత్రి కేటీఆర్తో పాటు పలువురిపై ఛార్జిషీట్ దాఖలు చేయడానికి అనుమతి కోరింది. ప్రభుత్వం నుండి అనుమతి రాగానే ఛార్జిషీట్ దాఖలు చేయనున్నట్లు ఏసీబీ వర్గాలు తెలిపాయి. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠకు దారితీసింది.
Sweden: షాకింగ్ ఘటన.. ప్రెస్మీట్లో ఉండగా కుప్పకూలిన స్వీడన్ మంత్రి.. వీడియో వైరల్
Also Read
- Telangana Government: లొంగిపోయిన మావోయిస్టులకు సర్కార్ బంపర్ ఆఫర్.. 'గిరిదర్శక్'గా ఉద్యోగాలు!
- Telangana SSC 10th Results: పది ఫలితాలపై బిగ్ అప్డేట్.. రిజల్ట్స్ డేట్ ఫిక్స్..
- Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
- Fuel Shortage: తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజుకు చేరిన ఇంధన కష్టాలు.. అధికారులు ఏం చెబుతున్నారంటే..?
ఈ కేసులో ఏసీబీ, అప్పటి ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ను ఇప్పటికే నాలుగు సార్లు విచారించింది. అలాగే, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ను ఐదు సార్లు విచారించి వారి స్టేట్మెంట్లను రికార్డ్ చేసింది. వీరితో పాటు బీఎల్ఎన్ రెడ్డి, కిరణ్ రావు, ఫార్ములా ఈ ఆర్గనైజర్లను (FEOలు) కూడా విచారించినట్లు ఏసీబీ నివేదికలో పేర్కొంది. ఏసీబీ విచారణలో ఫార్ములా ఈ రేస్ నిర్వహణలో క్విడ్ ప్రో కో (ఎవరో ఒకరు ఏదో ఇస్తే, దానికి ప్రతిఫలంగా మరొకరు వారికి ఏదో ఇవ్వడం) జరిగిందని నిర్ధారించినట్లు సమాచారం. ఈ రేసుకు స్పాన్సర్గా ఉన్న కంపెనీ, అప్పటి అధికార పార్టీకి రూ. 44 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లను చెల్లించినట్లు ఏసీబీ గుర్తించింది.
ఈ లావాదేవీలు క్విడ్ ప్రో కోకు నిదర్శనమని ఏసీబీ తన నివేదికలో స్పష్టం చేసింది. ఏసీబీ తమ నివేదికను ఇప్పటికే ప్రభుత్వానికి అందజేసింది. ఈ నివేదికపై అడ్వకేట్ జనరల్తో న్యాయ సలహా తీసుకున్న ప్రభుత్వం, త్వరలో దీనిపై ఒక నిర్ణయం తీసుకోనుంది. ప్రభుత్వం నుండి అనుమతి రాగానే కేటీఆర్, అరవింద్ కుమార్ సహా నిందితులపై ఏసీబీ ఛార్జిషీట్ దాఖలు చేస్తుంది. ఈ కేసులో కఠిన చర్యలకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ నివేదికను గవర్నర్కు కూడా ఏసీబీ అందజేసినట్లు సమాచారం.
తాజావార్తలు
-
Airlines Crisis: ఇలాగైతే విమానాలు నిలిచిపోతాయి.. కేంద్రానికి ఎయిల్లైన్స్ హెచ్చరిక..
-
Bellamkonda Srinivas: రేపు పెళ్లి.. ఆ రోజు గ్రాండ్ రిసెప్షన్
-
Telangana Government: లొంగిపోయిన మావోయిస్టులకు సర్కార్ బంపర్ ఆఫర్.. ‘గిరిదర్శక్’గా ఉద్యోగాలు!
-
Ajay Pal Sharma: బెంగాల్ ఎన్నికల్లో హాట్ టాపిక్గా ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ‘‘అజయ్ పాల్ శర్మ’’
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
ట్రెండింగ్
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!