KTR : ఫార్ములా ఈ-కార్ కేసు లొట్టపీసు కేసు.. స్కాం లేదు.. మన్నూ లేదు
- ఫార్ములా ఈ-కార్ కేసుపై స్పందించిన కేటీఆర్
- ఫార్ములా ఈ-కార్ కేసు లొట్టపీసు కేసు
- దూద్ కా దూద్.. పానీ కా పానీ అవ్వాలి
- ఒక్కరూపాయి కూడా ఎక్కడా తారుమారు కాలేదు
- స్కాం లేదు.. మన్నూ లేదు-కేటీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR : ఫార్ములా ఈ-కార్ రేస్ కేసుపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఈ కేసు ‘లొట్టపీసు కేసు’ అని, ఇందులో ఎలాంటి స్కాం జరగలేదని ఆయన అన్నారు. ఒకవేళ అవకతవకలు జరిగాయని నిరూపిస్తే ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమని ఆయన పేర్కొన్నారు. ఈ కేసుపై ఏసీబీ విచారణ గురించి ప్రస్తావిస్తూ, “దూద్ కా దూద్, పానీ కా పానీ అవ్వాలి” అని, ఇందులో ఒక్క రూపాయి కూడా తారుమారు కాలేదని ఆయన స్పష్టం చేశారు. “స్కాం లేదు, మన్నూ లేదు” అని ఆయన అన్నారు. నా మీద ఎన్ని కేసులు పెట్టినా, లై డిటెక్టర్ టెస్ట్ చేసినా సిద్ధమని సవాల్ విసిరారు.
CM Revanth Reddy : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సీఎం రేవంత్ భేటీ
Also Read
- Congress Disciplinary Action: కాంగ్రెస్లో క్రమశిక్షణ కొరడా.. నేడు కొండా సురేఖ, చిన్నారెడ్డిపై చర్యలు తప్పవా..?
- Saidabad Steel Bridge :సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి రెడీ.. రేపే సీఎం చేతుల మీదుగా ఓపెనింగ్
- OTR: గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో బీజేపీ గేమ్ ప్లాన్ ఏంటి?
- Tukkuguda Nurse Case: తుక్కుగూడ నర్సు కేసులో బిగ్ ట్విస్ట్.. రంగంలోకి జాతీయ మహిళా కమిషన్
కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఇచ్చిన రెండు లక్షల ఉద్యోగాల హామీని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్ను ఓడించాలని అశోక్ నగర్లో చెప్పిన మాటలను నమ్మి ఓటు వేసిన ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని ఆరోపించారు. గ్రూప్ 1 నోటిఫికేషన్లో 500 పోస్టులు ఉంటే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 60 పోస్టులు కలిపి కొత్త నోటిఫికేషన్ ఇచ్చిందని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో గ్రూప్ 1 పేపర్ లీక్ అయిన వెంటనే పరీక్షను రద్దు చేశామని, కానీ కాంగ్రెస్ హడావుడిగా పరీక్ష నిర్వహించిందని అన్నారు. ఇందులో అవకతవకలు జరిగాయని, ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరిగిందని, కోర్టుకు వెళ్లిన అభ్యర్థులకు కోర్టు శుభవార్త వినిపించిందని ఆయన తెలిపారు. రీ-వాల్యుయేషన్ చేసినా న్యాయం జరగదని, మళ్లీ పరీక్ష నిర్వహించాలని, నిజం నిగ్గుతేల్చడానికి సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, కమిషన్ వేసి విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
సీఎం 60 వేల ఉద్యోగాలు ఇచ్చామని చెబుతున్నారని, మంత్రులు 70 వేలు, లక్ష అని వేర్వేరుగా చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటికే ఇచ్చిన ఉద్యోగాలకు కూడా మళ్లీ ఎల్బీ స్టేడియంలో సమావేశం పెట్టి సర్టిఫికెట్లు ఇచ్చి తామే ఇచ్చామని చెబుతున్నారని విమర్శించారు. మొన్న అసెంబ్లీని 15 రోజులు నిర్వహించాలని అడిగితే కేవలం రెండు రోజులే పెట్టారని, మరోసారి అసెంబ్లీ నిర్వహించి ప్రజలకు ఇచ్చిన హామీలపై చర్చించాలని కోరారు. నిరుద్యోగ యువత కోసం ప్రత్యేక అసెంబ్లీ సెషన్ పెట్టాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ రెండు ఉద్యోగాలు ఊడగొడితే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి వెళ్లిపోయారని, నిరుద్యోగులను మళ్లీ కలిసింది లేదని, వారి గురించి ఆలోచించిందే లేదని అన్నారు. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సీఎం స్పందించి రీ-ఎగ్జామ్ పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ పోరాటం చేస్తున్న యువతపై, అశోక్ నగర్లో ఆందోళన చేస్తున్న వారిపై పెట్టిన కేసులను బేషరతుగా విత్ డ్రా చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. చివరగా, “లొట్టపీసు కేసు, లొట్టపీసు సీఎం” అని వ్యాఖ్యానిస్తూ, “లీకులు ఇచ్చి ఎన్ని రోజులు బ్రతుకుతారు” అని ప్రశ్నించారు.
Formula ERace : ఫార్ములా ఈ రేస్పై ఏసీబీ నివేదిక.. కేటీఆర్తో సహా అధికారులపై ఛార్జ్షీట్ సిద్ధం..!
తాజావార్తలు
-
Chamari Athapaththu: కెప్టెన్ సంచలనం.. 5 పరుగులిచ్చి 7 వికెట్లు డౌన్..! హ్యాట్రిక్ కూడాను..
-
Strait of Hormuz: హోర్ముజ్ నుంచి యెమెన్ వరకు హైటెన్షన్.. 86 షిప్స్కు అమెరికా బ్రేక్!
-
Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఊహించని ధన లాభాలు!
-
Congress Disciplinary Action: కాంగ్రెస్లో క్రమశిక్షణ కొరడా.. నేడు కొండా సురేఖ, చిన్నారెడ్డిపై చర్యలు తప్పవా..?
-
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!