KTR : తులం బంగారం కాదు.. తులం ఇనుము కూడా ఇవ్వరు
- జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను సొంత పోరాటంగా భావించాలన్న కేటీఆర్
- కాంగ్రెస్ నాయకులపై డబ్బు వసూళ్ల ఆరోపణలు
- మైనారిటీ నాయకులకు టికెట్లు ఇవ్వలేదని కాంగ్రెస్పై విమర్శలు
- బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ ప్రత్యేక పిలుపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR : జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నికల ముంగిట బీఆర్ఎస్ నేత కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు వస్తూ పోతూ ఉంటాయని, కానీ తమకు అండగా నిలిచిన మాగంటి కుటుంబానికి అండగా నిలబడాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. త్వరలో జరగబోయే ఉప ఎన్నికలను ప్రతి కార్యకర్త తన సొంత పోరాటంగా భావించి పనిచేయాలని ఆయన ఉద్ఘాటించారు.
కాంగ్రెస్ నాయకులు ‘హైడ్రా’ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఆ డబ్బులతో జూబ్లీహిల్స్లో ఓట్లు కొనాలని చూస్తున్నారని విమర్శించారు. అంతేకాకుండా, కాంగ్రెస్ నాయకులు దొంగ ఓట్లను రాయించారని, వాటిని తొలగించే బాధ్యతను బీఆర్ఎస్ నాయకులు తీసుకోవాలని సూచించారు. అక్టోబర్ చివరి వారంలో గానీ, నవంబర్ మొదటి వారంలో గానీ ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉందని, బీహార్తో పాటు ఈ ఎన్నికలు రాబోతున్నాయని చెప్పారు.
Also Read
- Tragedy: తీవ్ర విషాదం.. ముగ్గురి ప్రాణాలు తీసిన ఈత సరదా.
- TG20 Cricket: తెలంగాణ క్రికెట్ లీగ్కు బీసీసీఐ ఆమోదం..
- Age Relaxation: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాలకు పదేళ్లు వయోపరిమితి పెంపు..?
- Ration Card Holders: రేషన్ కార్డుదారులకు భారీ శుభవార్త.. ఇక నుంచి రేషన్ షాపుల్లో అవి కూడా పంపిణీ..
Nara Lokesh: ఖాట్మండులో చిక్కుకున్న వారిని క్షేమంగా తీసుకొస్తాం..!
కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు జిల్లాల్లో ప్రజలు మోసపోయారని, కానీ హైదరాబాద్ ప్రజలు మాత్రం వారిని నమ్మలేదని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ నాయకులు తులం బంగారం ఇచ్చేవాళ్ళు కాదు, మెడలో పుస్తెలను గుంజుకెళ్లే వాళ్ళు అంటూ తీవ్రంగా విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తులం బంగారం కాదు కదా, తులం ఇనుము కూడా ఇవ్వడని ఎద్దేవా చేశారు. బతుకమ్మ, దసరా పండుగల ముందు ప్రజల వద్దకు వెళ్లి వారి అవసరాలు తీర్చాలని కార్యకర్తలకు సూచించారు.
గతంలో మైనారిటీ నాయకుడైన అజారుద్దీన్కు సీటు ఇచ్చి, ఇప్పుడు ఆయనకు టికెట్ ఇవ్వకుండా బాగా డబ్బులు ఉన్నవారికి ఇస్తున్నారని కాంగ్రెస్పై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. మైనారిటీలకు టికెట్ ఇవ్వనప్పుడు వారు కాంగ్రెస్కు ఎందుకు ఓటు వేయాలని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ వాళ్ళు ఓటుకు పైసలు ఇస్తే తీసుకోవాలని, కానీ ఓటు మాత్రం తమకే వేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలు జూబ్లీహిల్స్ రాజకీయాల్లో మరింత చర్చకు దారితీసే అవకాశం ఉంది.
Kishkindhapuri : కిష్కింధపురి.. ఆడియెన్స్ కు నచ్చకుంటే ఇండస్ట్రీ వదిలి వెళ్తా : బెల్లం కొండ
తాజావార్తలు
-
Vivo X300 FE: 6,500mAh బ్యాటరీ, జైస్-ట్యూన్డ్ కెమెరాతో.. వివో X300 FE భారత్ లో విడుదల
-
Bus Fitness Certificates: స్కూల్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు.. వందల సంఖ్యలో ఫిట్నెస్ లేని బస్సులు!
-
Tragedy: తీవ్ర విషాదం.. ముగ్గురి ప్రాణాలు తీసిన ఈత సరదా.
-
MK Stalin: తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై తమ వైఖరిని స్పష్టం చేసిన స్టాలిన్.. కీలక ప్రకటన
-
NANI : నాని ఫ్యాన్స్కు నిరాశ.. ‘బ్లడీ రోమియో’ వాయిదా.. ‘OG 2’పై సుజీత్ ఫోకస్