KTR : తులం బంగారం కాదు.. తులం ఇనుము కూడా ఇవ్వరు
- జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను సొంత పోరాటంగా భావించాలన్న కేటీఆర్
- కాంగ్రెస్ నాయకులపై డబ్బు వసూళ్ల ఆరోపణలు
- మైనారిటీ నాయకులకు టికెట్లు ఇవ్వలేదని కాంగ్రెస్పై విమర్శలు
- బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ ప్రత్యేక పిలుపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR : జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నికల ముంగిట బీఆర్ఎస్ నేత కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు వస్తూ పోతూ ఉంటాయని, కానీ తమకు అండగా నిలిచిన మాగంటి కుటుంబానికి అండగా నిలబడాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. త్వరలో జరగబోయే ఉప ఎన్నికలను ప్రతి కార్యకర్త తన సొంత పోరాటంగా భావించి పనిచేయాలని ఆయన ఉద్ఘాటించారు.
కాంగ్రెస్ నాయకులు ‘హైడ్రా’ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఆ డబ్బులతో జూబ్లీహిల్స్లో ఓట్లు కొనాలని చూస్తున్నారని విమర్శించారు. అంతేకాకుండా, కాంగ్రెస్ నాయకులు దొంగ ఓట్లను రాయించారని, వాటిని తొలగించే బాధ్యతను బీఆర్ఎస్ నాయకులు తీసుకోవాలని సూచించారు. అక్టోబర్ చివరి వారంలో గానీ, నవంబర్ మొదటి వారంలో గానీ ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉందని, బీహార్తో పాటు ఈ ఎన్నికలు రాబోతున్నాయని చెప్పారు.
Also Read
- Sridhar Babu : హైదరాబాద్లో మరో కొత్త GCC కేంద్రం ఏర్పాటు
- Khaja Moizuddin Mur*der: హైకోర్టు న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు.!
- OTR : హైదరాబాద్ FSL లో అగ్నిప్రమాదం.. మేడిగడ్డ ఫైళ్లు తగలబడటం వెనుక రహస్యం ఏంటి?
- Cabinet Sub Committee : రేపు కేబినెట్ సబ్ కమిటీ అత్యవసర భేటీ!
Nara Lokesh: ఖాట్మండులో చిక్కుకున్న వారిని క్షేమంగా తీసుకొస్తాం..!
కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు జిల్లాల్లో ప్రజలు మోసపోయారని, కానీ హైదరాబాద్ ప్రజలు మాత్రం వారిని నమ్మలేదని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ నాయకులు తులం బంగారం ఇచ్చేవాళ్ళు కాదు, మెడలో పుస్తెలను గుంజుకెళ్లే వాళ్ళు అంటూ తీవ్రంగా విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తులం బంగారం కాదు కదా, తులం ఇనుము కూడా ఇవ్వడని ఎద్దేవా చేశారు. బతుకమ్మ, దసరా పండుగల ముందు ప్రజల వద్దకు వెళ్లి వారి అవసరాలు తీర్చాలని కార్యకర్తలకు సూచించారు.
గతంలో మైనారిటీ నాయకుడైన అజారుద్దీన్కు సీటు ఇచ్చి, ఇప్పుడు ఆయనకు టికెట్ ఇవ్వకుండా బాగా డబ్బులు ఉన్నవారికి ఇస్తున్నారని కాంగ్రెస్పై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. మైనారిటీలకు టికెట్ ఇవ్వనప్పుడు వారు కాంగ్రెస్కు ఎందుకు ఓటు వేయాలని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ వాళ్ళు ఓటుకు పైసలు ఇస్తే తీసుకోవాలని, కానీ ఓటు మాత్రం తమకే వేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలు జూబ్లీహిల్స్ రాజకీయాల్లో మరింత చర్చకు దారితీసే అవకాశం ఉంది.
Kishkindhapuri : కిష్కింధపురి.. ఆడియెన్స్ కు నచ్చకుంటే ఇండస్ట్రీ వదిలి వెళ్తా : బెల్లం కొండ
తాజావార్తలు
-
Mamata Banerjee: కదులుతున్న తృణమూల్ పునాదులు.. వరుస షాక్లతో దీదీ విలవిల..
-
Pakistan-China: జిన్పింగ్తో షెహబాజ్ షరీఫ్ భేటీ.. కాశ్మీర్పై కవ్వింపులు.. మండిపడ్డ భారత్
-
Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ భేటీ.. పర్సంటేజ్ గొడవకు ముగింపు పలికినట్లేనా?
-
Satish Sanpal: 8వ తరగతి డ్రాపౌట్ నుంచి వేల కోట్ల అధిపతిగా.. భార్యకు 40 కిలోల బంగారం గిఫ్ట్తో వైరల్గా మారిన సక్సెస్ స్టోరీ!
-
Gold Loan Surge : సంక్షోభ సమయంలో గోల్డ్ లోన్లవైపు పరుగులు తీస్తున్న సామాన్యులు.. ఎందుకిలా?
ట్రెండింగ్
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!
-
వాతావరణం మారితే కలర్ మారుతున్న ఫోన్.. 12 కలర్ వేరియంట్స్, సరికొత్త AI ఫీచర్లతో Infinix HOT 70 లాంచ్.!
-
Nitish Kumar Reddy Birthday: టెక్నిక్ + టాలెంట్ + టెంపరమెంట్.. విశాఖ కుర్రాడి జర్నీ.!
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!