సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో ఏ1 నిందితురాలు డాక్టర్ నమ్రత ను కస్టడీలోకి తీసుకున్నారు గోపాలపురం పోలీసులు. సికింద్రాబాద్ కోర్టు 5రోజుల కస్టడీకి అనుమతించింది. చంచల్ గూడా జైలు నుంచి ఏ1 నమ్రత ను కస్టడీలోకి తీసుకొని పోలీసులు విచారించనున్నారు. ఈనెల 5 వరకు డాక్టర్ నమ్రత పోలీస్ కస్టడీలోనే ఉండనుంది. సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ విశాఖపట్నం మేనేజర్ కల్యాణి అచ్చయమ్మ వ్యవహారాలపై విచారించనున్నారు పోలీసులు. Also Read:Karnataka: నెల జీతం 15…
డబ్బు మాయలో పడి పవిత్రమైన వైద్య వృత్తికి కలంకం తెచ్చారు సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఆసుపత్రి వైద్యులు. సంతానం లేని దంపతులను నిండా ముంచి లక్షలు కాజేసి మానసిక క్షోభకు గురిచేశారు. పిల్లలు లేని లోటును తీర్చుకోవాలనే ఆరాటంలో సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ను సంప్రదించడమే వారు చేసిన తప్పైపోయింది. ఎవరో వ్యక్తుల స్పెర్మ్, అండాలు సేకరించడం, వాటి ద్వారా పిండాలను సృష్టించడం, ఐవిఎఫ్ కోసం వస్తున్న దంపతులను సరగోసి వైపు…
సృష్టి టెస్ట్ ట్యూబ్ కేసులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఐవిఎఫ్ కోసం వస్తున్న దంపతులను సరగోసి వైపు మళ్లించినట్లు పోలీసులు గుర్తించారు. ఐ వి ఎఫ్ అయితే రెండు మూడు లక్షలు మాత్రమే వస్తాయని భావించింది నమ్రత.. సరోగసి అయితే దంపతుల ఆర్థిక స్తోమతను బట్టి వసూలు చేయొచ్చని భావించింది. సరోగసి కోసం 30 నుంచి 50 లక్షల రూపాయలను వసూలు చేసింది నమ్రత. ఇప్పటికే 30 మందికి పైగా సరోగసి కోసం డబ్బులు కట్టినట్లు గుర్తించారు.…
ములుగు జిల్లాలోని వెంకటాపురం మండలంలో ఉన్న మహితపురం జలపాతం వద్ద జరిగిన ఒక ఘటన స్థానికులను కలవరపెట్టింది. అనుమతి లేకుండా ఈ జలపాతానికి వెళ్లిన వరంగల్కు చెందిన ఏడుగురు విద్యార్థులు అడవిలో దారి తప్పి చిక్కుకున్నారు. వీరిలో ముగ్గురు యువతులు, నలుగురు యవకులు ఉన్నారు. పోలీసులు, అటవీ శాఖ అధికారుల సమన్వయంతో నిర్వహించిన రెస్క్యూ ఆపరేషన్ ద్వారా వీరిని సురక్షితంగా కాపాడి, సమీపంలోని నుగూరు గ్రామానికి తరలించారు. మహితపురం జలపాతం రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో ఉండటం వల్ల,…
మెడికల్ మాఫియాకు హద్దులు లేకుండా పోతున్నాయి. వైద్యులు దేవునితో సమానం అని జనం నమ్మి వస్తే.. తాము ఏం చేసినా చెల్లుతుందనే రీతిలో మెడికల్ మాయగాళ్లు ప్రవర్తిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ ఓ టెస్ట్ ట్యూబ్ సెంటర్ చేసిన నిర్వాకం.. పవిత్రమైన వైద్య వృత్తిలో ఉండి వారు చేసే బాగోతాన్ని బయటపెట్టింది. అసలు ఆ టెస్ట్ ట్యూబ్ సెంటర్లో ఏం జరిగింది? పోలీసుల సోదాల్లో ఎలాంటి విషయాలు వెలుగు చూశాయి? పిల్లలు లేని దంపతుల బాధ వర్ణనాతీతం.. పిల్లలు…
Ganja Smuggling: ములుగు రోడ్డులోని నార్కోటెక్ పోలీస్ స్టేషన్లో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP) సైదులు ఆధ్వర్యంలో శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గంజాయి రవాణా కేసు సంబంధిత వివరాలను వెల్లడించారు. ఈ కేసులో ముందుగా వరంగల్ నర్సంపేట రోడ్డులో విశ్వసనీయ సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా.. అందులో ఒకరు మైనర్గా గుర్తించారు అధికారులు. Prasanna Kumar…
Eagle Team : హైదరాబాద్లో ఈగల్ దంగల్ నడుస్తోంది. కొత్త రకం డ్రగ్స్తో సహా గంజాయి అమ్ముతున్న పెడ్లర్స్.. మాదక ద్రవ్యాలు తీసుకుంటున్న వారిని ఈగల్ టీమ్ ఛేజ్ చేసి మరీ పట్టుకుంటోంది. తాజాగా హఫీమ్ అనే డ్రగ్స్ను విక్రయిస్తున్న పెడ్లర్లను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఈగల్ అధికారులు. అలాగే హైదరాబాద్లో డ్రగ్స్ తీసుకుంటున్న 86 మందిని కటకటాల్లోకి నెట్టారు. వాయిస్: మీలో సెక్స్ సామర్థ్యం తగ్గిందా..!! ఐతే మా డ్రగ్ వాడండి..!! ఈ డ్రగ్ అంటే…
మల్నాడు రెస్టారెంట్ డ్రగ్ పార్టీ కేసులో పబ్ యజమానులకు చుక్కెదురైంది. ఈగల్ టీం మూడు పబ్బుల యజమానులపైన కేసులు నమోదు చేసింది. మల్నాడు రెస్టారెంట్ సూర్యతో ముగ్గురు పబ్ యజమాలతో సంబంధాలు ఉన్నట్లు తెలిసింది. మూడు పబ్ యజమాలతో కలిసి డ్రగ్ పార్టీలు నిర్వహించినట్లుగా ఈగల్ టీం గుర్తించింది. పబ్బుల్లో డ్రగ్స్ పార్టీ కోసం ప్రత్యేక ఏర్పాటు చేసినట్లు బట్టబయలైంది.
సైబర్ నేరగాళ్ల తోకలు కత్తిరిస్తున్నారు తెలంగాణ పోలీసులు. వాళ్లకి మ్యూల్ అకౌంట్లు సమకూర్చిన నేరగాళ్లను గుర్తించారు. మొత్తంగా ఆరుగురిపై కేసులు పెట్టిన పోలీసులు.. తాజాగా ఒకరిని ముంబై ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేశారు. తెలంగాణ పోలీసులు సైబర్ నేరగాళ్ల భరతం పడుతున్నారు. మొన్ననే 25 మంది సైబర్ నేరగాళ్ల ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు.. తాజాగా మరో ముఠా బాగోతాన్ని బయట పెట్టారు. సైబర్ క్రిమినల్స్కు బ్యాంక్ అకౌంట్లు అందిస్తున్న నేరగాళ్లను గుర్తించారు.. ఇటీవల హైదరాబాద్లో ఉంటున్న…
ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడు అని అంటారు. కానీ.. హైదరాబాద్ పోలీసులు మాత్రం ఇట్టే పట్టేసుకున్నారు. వాస్తవానికి.. హైదరాబాద్ కుత్బుల్లాపూర్ పరిధిలోని శిర్డీ హిల్స్లో చోరీ కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఇంట్లో దొంగతనం చేసినవారు ఎవరూ కాదండీ.