సూర్యాపేట జిల్లా కోదాడలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. శోభాయాత్రలో పాల్గొన్న యువకుల మధ్య ఘర్షణ తలెత్తడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
దుండిగల్ చెరువులో ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని హైడ్రా DRF సిబ్బంది సకాలంలో స్పందించి కాపాడారు. కుటుంబ కలహాలతో మానసిక ఆవేదనకు గురైన రహీం అనే వ్యక్తి చెరువులో దూకి తన ప్రాణాలు తీసుకోవాలని ప్రయత్నించాడు.
హైదరాబాద్ మాదాపూర్ డీసీపీ వినీత్ మాట్లాడుతూ గత ఐదేళ్లుగా నగరంలో పిల్లల కిడ్నాప్లకు పాల్పడుతున్న ముఠాను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఆగస్టు 26న చందానగర్ పోలీసులకు వచ్చిన ఫిర్యాదుతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్ నగరంలో మరోసారి రేవ్ పార్టీ బస్టింగ్ జరిగింది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈగల్ టీమ్, గచ్చిబౌలి పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి డ్రగ్స్ వాడుతున్న పలువురిని పట్టుకున్నారు.
వరంగల్ నగరంలో మరో వివాదాస్పద ఘటన చోటుచేసుకుంది. మిల్స్ కాలనీ పోలీస్స్టేషన్కు చెందిన ఎస్సై శ్రీకాంత్పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయింది. వివరాల ప్రకారం, ఈ నెల 22వ తేదీ అర్ధరాత్రి స్థానికంగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వహిస్తున్న దళిత మహిళ మరియమ్మపై దాడి చేసిన ఘటన జరిగింది.
తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి వేడుకలు జోరుగా మొదలయ్యాయి. మండపాల ఏర్పాటు, బొజ్జ గణపయ్య విగ్రహాల తరలింపు వేగంగా జరుగుతున్న నేపథ్యంలో, తెలంగాణ పోలీసులు ముఖ్యమైన మార్గదర్శకాలు విడుదల చేశారు.
సూర్యాపేట జిల్లాలో సంచలనం రేపే ఘటన వెలుగులోకి వచ్చింది. నడిగూడెం పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్న కృష్ణంరాజుపై పోక్సో చట్టం కింద కేసు నమోదు అయ్యింది. అందిన సమాచారం ప్రకారం, ఇప్పటికే నాలుగు వివాహాలు చేసుకున్న కృష్ణంరాజు, ఐదో పెళ్లికి కూడా సిద్ధమయ్యాడు.
Betting Seva : నిర్మల్ జిల్లా పోలీసులు భైంసా ప్రాంతంలో జరుగుతున్న ఆన్లైన్ బెట్టింగ్ ముఠాపై గట్టి దాడి చేసి ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేశారు. ఏడాది కాలంగా భైంసాను అడ్డాగా చేసుకుని ఈ అక్రమ కార్యకలాపాలను నడిపిస్తున్న సయ్యద్ ఆజమ్ను గురువారం రాత్రి ఓవైసీ నగర్లోని ఓ ఆలయం సమీపంలో మెరుపుదాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల వెల్లడించిన వివరాల ప్రకారం, ఆజమ్ మీ సేవా సెంటర్ ముసుగులో Allpannel.com అనే…
హైదరాబాద్ నగరాన్ని కుదిపేసిన కూకట్పల్లి బాలిక సహస్ర హత్య కేసులో పోలీసులు కీలక పురోగతిని సాధించారు. ఎస్వోటీ పోలీసులు దర్యాప్తులో భాగంగా 10వ తరగతి చదువుతున్న బాలుడిని అదుపులోకి తీసుకున్నారు.
Marri Janardhan Reddy Warns Telangana Police: తెలంగాణ పోలీసులపై నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. పోలీసులు సీఎం రేవంత్ రెడ్డికి బానిస అయ్యారని విమర్శించారు. సీఎం గురించి సోషల్ మీడియాలో ఎవరు మాట్లాడినా.. ఉదయనే వారి ఇంటి ముందు పోలీసులు ఉంటున్నారని ఎద్దేవా చేశారు. కందనూలు ప్రాంతంలో పనిచేసిన ప్రతి ఎస్సై, సీఐ, డీఎస్పీల పేరు రాసి పెట్టుకుంటాము అని హెచ్చరించారు. తమ కార్యకర్తలను ఇబ్బంది పెట్టే…