Missing in Forest: అడవిలో వాటర్ ఫాల్స్.. ముగ్గురమ్మాయిలు, నలుగురబ్బాయిల మిస్సింగ్.. చివరికి ఏమైందంటే?
- మహితపురం జలపాతంలో దారి తప్పిన NIT వరంగల్ ఏడుగురు విద్యార్థులు
- రిజర్వ్ ఫారెస్ట్లో అనుమతి లేకుండా వెళ్లిన విద్యార్థులు
- రాత్రి 9 గంటలకు డయల్ 100కు కాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ములుగు జిల్లాలోని వెంకటాపురం మండలంలో ఉన్న మహితపురం జలపాతం వద్ద జరిగిన ఒక ఘటన స్థానికులను కలవరపెట్టింది. అనుమతి లేకుండా ఈ జలపాతానికి వెళ్లిన వరంగల్కు చెందిన ఏడుగురు విద్యార్థులు అడవిలో దారి తప్పి చిక్కుకున్నారు. వీరిలో ముగ్గురు యువతులు, నలుగురు యవకులు ఉన్నారు. పోలీసులు, అటవీ శాఖ అధికారుల సమన్వయంతో నిర్వహించిన రెస్క్యూ ఆపరేషన్ ద్వారా వీరిని సురక్షితంగా కాపాడి, సమీపంలోని నుగూరు గ్రామానికి తరలించారు. మహితపురం జలపాతం రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో ఉండటం వల్ల, ఇక్కడకు వెళ్లడానికి అటవీ శాఖ అధికారుల అనుమతి తప్పనిసరి.
Also Read:Dr Namratha: సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ డాక్టర్ నమ్రత అరెస్ట్
Also Read
- KCR Meeting : ఎర్రవల్లి వేదికగా కేసీఆర్ మాస్టర్ ప్లాన్.. బీఆర్ఎస్ ప్రక్షాళనకు శ్రీకారం..!
- KTR: "23 లక్షల మందికి మానసిక క్షోభ".. నీట్ ప్రశ్నాపత్రం లీక్పై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్..
- Telangana Liquor Shop Scam: "పేరు దళితులది.. దందా సిండికేట్లది".. లిక్కర్ షాపుల్లో బినామీల గుట్టురట్టు
- S*uicide: తండ్రి దినకర్మ రోజే తనయుడు ఆత్మహత్య.!
అయితే, ఈ విషయం తెలియ లేదో లేక తెలిసినా లైట్ తీసుకున్నారో కానీ వరంగల్కు చెందిన ఏడుగురు విద్యార్థులు ఫోటోలు తీసుకోవడం, సెల్ఫీలు దిగడం కోసం ఈ జలపాతానికి వెళ్లారు. జలపాతం వద్ద గడిపిన తర్వాత, తిరిగి వచ్చే క్రమంలో వారు అడవిలో దారి తప్పారు. సాయంత్రం సమయంలో గ్రామస్థుల నుంచి సమాచారం సేకరించి, వేరే అటవీ మార్గం ద్వారా తిరిగి వచ్చేందుకు ప్రయత్నించారు. కానీ, అడవిలో చీకటి పడటంతో దారి కనిపించక, భయాందోళనకు గురై రాత్రి 9 గంటల సమయంలో డయల్ 100కు కాల్ చేసి సహాయం కోరారు.
Also Read:HHVM : హరిహర వీరమల్లు ఉచిత ప్రదర్శనలు..
విద్యార్థుల నుంచి వచ్చిన ఫిర్యాదు అందుకున్న వెంటనే, గోపాలపురం పోలీసులు మరియు అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. విద్యార్థులు పంపిన లొకేషన్ ఆధారంగా, అటవీ శాఖ అధికారుల సహాయంతో పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ను చేపట్టారు. దట్టమైన అడవిలో, భారీ వర్షాల మధ్య కూడా, అధికారులు చాకచక్యంగా వ్యవహరించి ఏడుగురు విద్యార్థులను సురక్షితంగా కాపాడారు. రెస్క్యూ చేసిన తర్వాత, విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించి, వారి భయాందోళనలను తగ్గించే ప్రయత్నం చేశారు అధికారులు. అనంతరం, విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం అందించి, వారిని సురక్షితంగా ఇంటికి పంపించారు.
తాజావార్తలు
-
Peddi: పెద్ది’కి నార్త్’లో సాలిడ్ బ్యాకప్..ట్రైలర్ లాంచ్ అక్కడే!
-
Keralam: కేరళం సీఎం ఎంపికపై గందరగోళం.. రంగంలోకి సోనియా!
-
Saraswati river: గంగా-యమున మధ్య భూగర్భ నది.. “అదృశ్య సరస్వతి” నదికి ఆనవాళ్లు..
-
Anil Kochhar: అమెరికా యూనివర్శిటీలో సంచలనం.. 176 మంది స్టూడెంట్ లోన్స్ క్లియర్ చేసిన ఇండియన్! ఆయన ఎవరో తెలుసా..
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
ట్రెండింగ్
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!
-
Palak Paratha Recipe: హెల్దీగా, టేస్టీగా చేసే సూపర్ సాఫ్ట్ ‘పాలక్ పరోటా’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!